Breaking… Pawan Meets Chandrababu: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒక వైపు వేసవి తీవ్రత ఎలా ఉన్నా.. రాజకీయాల్లో మాత్రం వేడి రాజుకుంటోంది. తాజాగా జరిగిన పరిణామాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో కొద్దిసేపటి క్రితం ఇరువురు నేతల సమావేశం జరిగింది. రాష్ట్రంలో పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చ జరిగిందని తెలుస్తోంది. ఇటీవల కాలంలో మూడోసారి చంద్రబాబు.- పవన్ భేటీ జరిగింది.
Read Also: Shivraj Singh Chouhan: ప్రధాని మోడీ “నీలకంఠుడు”.. విషసర్పం విమర్శలకు కౌంటర్..
Also Read
- Pakistan: బ్రహ్మోస్కు పోటీగా ఫతా-3 క్షిపణిని తీసుకొచ్చిన పాకిస్తాన్..
- Nida Khan: టీసీఎస్ మతమార్పిడి కేసు.. పరారీలో ఉన్న నిదా ఖాన్ పోలీసులకు ఎలా చిక్కింది..?
- Mani Shankar Aiyar: ‘‘కాంగ్రెస్ది నీచ రాజకీయం’’.. విజయ్తో పొత్తుపై సొంత పార్టీ నేత విమర్శలు..
- Tamil Nadu: ఎంకే.స్టాలిన్ మాస్టర్ ప్లాన్.. తమిళనాడు అట్టుడుకనుందా!?
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఘటనపై చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు పవన్ కళ్యాణ్. ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రబాబు-పవన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణ రాజకీయాల పైనా బాబు-పవన్ భేటీలో ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది. టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉంటుందని భావిస్తున్న వేళ ఈ ఇద్దరి భేటీ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వీరు భేటీ కాగా తాజా భేటీపై మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరి భేటీపైనే అందరి కళ్లు ఉన్నాయి.ఇదిలా ఉంటే గతంలో విశాఖ పర్యటనకు వచ్చిన పవన్ ను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ పర్యటన అర్థాంతరంగా ముగించుకుని వచ్చేశారు. దీంతో పవన్ కు సంఘీభావం తెలపడానికి చంద్రబాబు భేటీ అయ్యారు. అప్పటి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటనను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు పవన్, ఈ విధంగా ఒకరికొకరు కలుసుకుని సంఘీభావం తెలుపుకుంటున్నారు.
ఇటీవల పవన్ ఢిల్లీకి వెళ్ళి వచ్చారు. బీజేపీ పెద్దలతో పొత్తుల గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయా? జనసేన-బీజేపీ కలిసి పోటీ చేయనున్నాయా లేదా టీడీపీ-బీజేపీ-జనసేన మూకుమ్మడిగా కలిసి పోటీ చేస్తారా అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఇద్దరు నాయకులు ఏం చెప్పబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
తాజావార్తలు
-
Pakistan: బ్రహ్మోస్కు పోటీగా ఫతా-3 క్షిపణిని తీసుకొచ్చిన పాకిస్తాన్..
-
DMK Congress Alliance Breakup: తమిళ రాజకీయాల్లో దశాబ్దాల దోస్తీకి ఎండ్ కార్డ్.. కాంగ్రెస్కు డీఎంకే గుడ్బై!
-
NTR: ఇదెక్కడి లుక్? ఒకే ఒక్క ఫోటోకు సోషల్ మీడియా షేక్!
-
Nida Khan: టీసీఎస్ మతమార్పిడి కేసు.. పరారీలో ఉన్న నిదా ఖాన్ పోలీసులకు ఎలా చిక్కింది..?
-
TVK Government Formation: తమిళనాడు కోటపై టీవీకే జెండా.. లెఫ్ట్ పార్టీలు, వీసీకే అండతో సీఎం పీఠంపై విజయ్!