Pawan Kalyan: హలో ఏపీ.. బై బై వైసీపీ.. ఇదే మన నినాదం..
Pawan Kalyan: హలో ఏపీ.. బై బై వైసీపీ.. ఇదే మన నినాదం అంటూ పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అమలాపురంలో వారాహి విజయ యాత్ర భారీ బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. జనం బాగుండాలంటే జగన్ పోవాలి.. అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం పోవాలి.. అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం పోవాలి అంటూ నినాదాలు చేశారు జనసేనాని.. గత ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు యువత ఒక్కసారి ఆలోచించి ఉంటే బాగుండేదని అన్నారు. ఓట్లు వేసి వైసీపీని గెలిపించారని, కానీ, ఉద్యోగాలు మాత్రం రాలేదన్నారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపించి ఉంటే కనీసం లక్ష ఉద్యోగాలు పడేవని వ్యాఖ్యానించారు పవన్. ఇంకోసారి వారి నాయకుడు నవ్వుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ వస్తే రోడ్డుపైనే నిలదీయండి.. 2.3 లక్షల ఉద్యోగాలు ఏవని ప్రశ్నించండి అంటూ పిలుపునిచ్చారు.
కోనసీమ వాడి వేడి తట్టుకోలేక పోతున్నా.. కోనసీమ ప్రజలకు హృదయపూర్వక నమస్కారం అంటూ ఉపన్యాసం ప్రారంభించిన పవన్.. మీరు చూపుతున్న అభిమానాన్ని తట్టుకోలేక పోతున్నా.. పది సంవత్సరాల పూర్తి పార్టీ పెట్టి.. పార్టీ నిర్మాణం కష్టం. మీ ఆధరణతోనే నడుపుతున్నా అన్నారు.. ఇక, అమలాపురం అల్లర్లకు వైసీపీ ప్రభుత్వమే కారణం అని ఆరోపించారు పవన్.. ఈ అల్లర్లలో 251 మంది అమాయక యువకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని చేతులు ఎత్తి నమస్కారించి డీజీపీని కోరారు జనసేనాని.. ఒక్కసారి అవకాశమిస్తే ప్రజలను నట్టేట ముంచారు.. వైసీపీ ప్రభుత్వం అవసరమా లేదో ప్రజలు ఆలోచించి వచ్చే ఎన్నికలలో ఓటు వేయాలని సూచించారు..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
గోడవలు సృష్టించే వాడు కాదు.. నివారించే శక్తి ఉన్న వాడే నాయకుడు అన్నారు పవన్.. చిన్న వారాహి వాహనంపై తిరుగుతున్న జనసేన అంటే వైసీపీ నేతలకు ఎందుకు భయం? అని ప్రశ్నించారు.. ఇక, ఉభయగోదావరి జిల్లాలంటే ఇతర ప్రాంతాలకు ఈర్య తాను భీమవరంలో, కోనసీమలో పార్టీ ఆఫీసు పెడతా.. ప్రజా సమస్యలు పరిష్కారానికి అందుబాటులో ఉంటానని వెల్లడించారు.. కొబ్బరి రైతులకు అండగా ఉంటా.. ధాన్యం రైతులను దగా చేస్తున్నారు. కాకినాడకు చెందిన దళారులు బస్తాకు 40 రూపాయలు దోచుకుంటున్నారు అని మండిపడ్డారు.. కోనసీమ రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు.. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రైతులకు ఈ కష్టాలు వచ్చాయి.. జనసేన ప్రభుత్వం వచ్చిన తరువాత కొబ్బరి రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు.. 20 రూపాయలు రావాల్సిన కొబ్బరికాయ కు ప్రస్తుతం ఏడు రూపాయలు వస్తోంది.. కొబ్బరి అనుబంధ పరిశ్రమలు రావాలన్న పవన్.. కొబ్బరి అభివృద్ధి బోర్డ్ రీజనల్ కార్యాలయం విజయవాడలో ఉంది. అది కోనసీమకు రావాలన్నారు..
175 సీట్లు, అన్ని ఎంపీ స్థానాలు తమవేనని వైసీపీ నేతలు చెబుతున్నారు.. మరి మాపై ప్రతి రోజూ ఎందుకు విమర్శలు చేస్తారు? వారాహి వాహనంపై వెళుతుంటే ఎందుకు భయపడుతున్నారు? అని ఎద్దేవా చేశారు పవన్.. జనసేన బలం ఏంటన్నది ఇప్పుడు వైసీపీ వాళ్లకు అర్థమైందన్న ఆయన.. రాష్ట్రానికి పట్టిన వైసీపీ తెగులును తీసేస్తా.. వచ్చే ఎన్నికల్లో నాకు అండగా నిలబడండి. నేనేమీ హైదరాబాద్ నుంచి మాట్లాడడంలేదు.. రాజమండ్రిలో పార్టీ ఆఫీసు పెట్టాను. కాకినాడ, పిఠాపురం, అమలాపురంలోనూ కార్యాలయాలు తెరుస్తాం. నేను కూడా ఇక్కడే ఉంటానని భరోసా ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో