Bihar : జైలు నుంచి బయటకు వచ్చిన.. ‘ఛోటే సర్కార్’… బాహుబలి అనంత్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar : బీహార్ నాయకుడు, మొకామా మాజీ ఎమ్మెల్యే అనంత్ సింగ్కు 15 రోజుల పెరోల్ లభించింది. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జైలు నుంచి బయటకు వచ్చాడు. జైలు వెలుపల ఆయనకు మద్దతుదారులు పూలమాలలు వేసి స్వాగతం పలికారు. అనంతరం కారులో కూర్చొని నేరుగా స్వగ్రామం వైపు వెళ్లాడు. వాస్తవానికి అనంత్కు పూర్వీకుల భూమి, ఆస్తుల పంపకం కోసం 15 రోజుల పాటు పెరోల్పై విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ ఆదేశించింది.
అనంత్ సింగ్ ప్రస్తుతం పాట్నాలోని బీర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అనంత్ సింగ్ దాదాపు ఐదేళ్లుగా జైలులో ఉన్నారు. అనంత్ సింగ్ ఏకే 47 కలిగి ఉన్నారనే ఆరోపణలతో కోర్టు అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అప్పటి నుంచి మొకామా మాజీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ పాట్నాలోని బీర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అనంత్ సింగ్ కుటుంబంలో భూ పంపకాలకు సంబంధించి పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం ఉదయం, అనంత్ సింగ్ను 15 రోజుల పెరోల్పై బీర్ జైలు నుండి బయటకు తీసుకువెళుతున్నప్పుడు, జైలు అంతర్గత భద్రతను కట్టుదిట్టం చేశారు. జైలు నుంచి బయటకు రాగానే నవ్వుతూ కనిపించాడు. కళ్లకు డార్క్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. మద్దతుదారుల అభినందనలు స్వీకరించిన అనంతరం కారులో కూర్చొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Also Read
- Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
- Harbhajan Singh: ఆప్ నుంచి అందుకే బయటకు వచ్చేశా.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
- NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులకు బార్ కౌన్సిల్ షాక్..!
- Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
Read Also:Taapsee Pannu : అవకాశం వస్తే సౌత్ సినిమాలు కూడా చేస్తాను..
అనంత్ భార్య ప్రస్తుత ఎమ్మెల్యే
అనంత్ సింగ్ భార్య నీలం సింగ్ ప్రస్తుతం ఆర్జేడీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం బీహార్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. బీహార్లోని ముంగేర్లో లోక్సభ ఎన్నికలకు నాలుగో దశలో 13న పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి కూడా అనంత్ సింగ్ జైలు నుంచి బయటకు వస్తాడనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
లలన్ సింగ్కు ప్రయోజనం
ఆయన ప్రాంతంలోని ప్రజలు అనంత్ సింగ్ను ఛోటే సర్కార్ అని పిలుస్తారు. ఒకప్పుడు నితీష్ కుమార్ కు ఎంతో ప్రత్యేకత కలిగిన అనంత్ సింగ్ ఆ తర్వాత రాజకీయ కారణాలతో సీఎంకు దూరమై లాలూ యాదవ్ కు సన్నిహితంగా మారారు. అయితే ఇప్పుడు మరోసారి అనంత్ సింగ్ ఎన్డీయే కోర్టులో పడ్డారు. అనంత్ సింగ్ బహిరంగంగా ప్రచారం చేయకపోయినా, జేడీయూ లోక్సభ అభ్యర్థి, ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్కు లబ్ధి చేకూర్చవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Read Also:Digvijay Singh : ఇవే నా చివరి ఎన్నికలు… దిగ్విజయ్ సింగ్ సంచలన ప్రకటన
తాజావార్తలు
-
Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
-
Harbhajan Singh: ఆప్ నుంచి అందుకే బయటకు వచ్చేశా.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
-
NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులకు బార్ కౌన్సిల్ షాక్..!
-
Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!