Pataleshwar Mahadev Temple: శివుడికి చీపురు సమర్పించే ఆలయం గురించి విన్నారా.? ఆలా ఎందుకు చేస్తారంటే..
- ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లాలోని బిహాజోయ్ గ్రామంలో పురాతన పాతాలేశ్వర్ శివాలయం.
- శివుడిని పూజించేటప్పుడు ప్రజలు దేవుడుకి చీపుర్లను సమర్పిస్తారు.
- శివునికి చీపురు సమర్పించడం ద్వారా కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు.
- చర్మ సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pataleshwar Mahadev Temple: మనం ఎప్పుడయినా శివాలయానికి వెళ్ళినప్పుడు శివునికి పాలు, నీరు, బిల్వ పత్రం, ఇంకా అనేక పండ్లను సమర్పించడం చూసే ఉంటాము. అయితే వీటన్నింటితో పాటు భక్తులు చీపుర్లు సమర్పించి మహాదేవుని పూజించే శివాలయం ఉందని కూడా తెలుసా మీకు. అవును మీరు చదివింది, వింది నిజమే. శివుడికి చీపురు సంపర్పించడం ఏంటి అని అనుకుంటున్నారా.? మరి ఆ గుడి విశేషాలేంటో ఒకసారి చూద్దాం..
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లాలోని బిహాజోయ్ గ్రామంలో పురాతన పాతాలేశ్వర్ శివాలయం ఉంది. ఈ ఆలయంలో శివుడిని పూజించేటప్పుడు ప్రజలు దేవుడుకి చీపుర్లను సమర్పిస్తారు. పాతాళేశ్వరాలయం పట్ల భక్తులకు ప్రత్యేకమైన భక్తి ఉంటుంది. ఇక్కడ ప్రజలు పాలు, నీరు, పండ్లు అలాగే కర్రలతో కూడిన చీపురులను శివలింగంపై శివునికి సమర్పిస్తారు. ఈ ఆలయంలో శివునికి చీపురు సమర్పించడం ద్వారా కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. చీపురు సమర్పించడం ద్వారా భగవంతుడు భోలేనాథ్ సంతోషిస్తాడని., అలా చేయడం ద్వారా చర్మ సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ శివాలయం ఆ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం సుమారు 150 సంవత్సరాల నాటిదని ఆలయ పూజారి తెలిపారు.
Vande Bharath Trains: 100 వందే భారత్ రైళ్ల ఆర్డర్ను రద్దు చేసిన రైల్వేశాఖ..
ఇక్కడ చీపురు సమర్పించే సంప్రదాయం కూడా చాలా పాతది. శివునికి చీపురు సమర్పించేందుకు ప్రజలు ప్రతిరోజూ గంటల తరబడి క్యూలో నిలబడతారు. అంతేకాకుండా వందలాది మంది భక్తులు దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఈ గ్రామంలో భిఖారిదాస్ అనే వ్యాపారవేత్త నివసించేవాడని అతడు చాలా ధనవంతుడని చెబుతారు. కానీ., అతనికి పెద్ద చర్మ వ్యాధి వచ్చింది. ఒకరోజు ఈ వ్యాధికి చికిత్స పొందేందుకు వెళ్తుండగా అకస్మాత్తుగా దాహం వేసింది. అప్పుడు అతను నీరు త్రాగడానికి ఈ మహాదేవుని ఆలయానికి వచ్చి ఆలయాన్ని ఊడుస్తున్న మహంత్ను ఢీకొన్నాడు. ఆ తర్వాత ఎలాంటి చికిత్స లేకుండానే అతడి జబ్బు తగ్గిపోయింది. దీంతో సంతోషించిన సేథ్ మహంత్కు డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించగా మహంత్ దానిని తీసుకునేందుకు నిరాకరించాడు. అందుకు బదులుగా అతను ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని సేథ్ను కోరాడు. అప్పటి నుండి ఈ ఆలయం గురించి చర్మవ్యాధి వచ్చినప్పుడు ఇక్కడ చీపురు సమర్పించాలని చెబుతారు. దీంతో ప్రజల కష్టాలు తీరనున్నాయి. అందుకే నేటికీ భక్తులు ఇక్కడికి వచ్చి చీపుర్లు సమర్పించుకుంటారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!