Parliament: నేడు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం!.. లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament: మణిపూర్ అంశంపై పార్లమెంట్లో ప్రతిష్టంభన మధ్య, ప్రతిపక్షాలు బుధవారం మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకురాబోతున్నాయి. లోక్సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మంగళవారం రాత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. ఉదయం 10 గంటలకు లోక్సభ స్పీకర్కు నోటీసు అందజేస్తామని తెలిపారు. కాగా, ఎంపీలకు పార్టీ విప్ జారీ చేసింది.
ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది. అటువంటి పరిస్థితిలో ఏదైనా అవిశ్వాస తీర్మానానికి అర్థం ఉండదు, అయితే ఈ తీర్మానం ద్వారా, ప్రతిపక్షం ఖచ్చితంగా ప్రధానికి ప్రకటన చేయాలనే పట్టుదలతో ఉంది. అవిశ్వాస తీర్మానంపై ప్రధాని సమాధానం చెప్పాల్సి ఉండగా, మణిపూర్పై చర్చ జరిగితే, హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇస్తారు. మణిపూర్పై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా పార్లమెంటులో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని 26 పార్టీల నేతలు సమావేశంలో అనుకున్నారు. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీయే కూటమికి 330 మంది సభ్యుల మద్దతుంది. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’కు 140 మంది సభ్యులున్నారు. మరో 60 మందికిపైగా ఏ కూటమిలోనూ లేరు. గతంలో 2018లో మోదీ ప్రభుత్వంపై అప్పటి యూపీఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఎన్డీయేకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతు ఇవ్వడంతో అది వీగిపోయింది.
Also Read
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
- Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Cupid Limited Share Price: కండోమ్లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
- Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
Also Read: Kishan Reddy : అమిత్ షా పర్యటన ఏర్పాట్లపై కిషన్ రెడ్డి సమీక్ష
ప్రధాని సభలో ప్రకటన చేసిన తర్వాతే మణిపూర్పై చర్చను ప్రారంభించాలన్న తమ వైఖరికి తాము కట్టుబడి ఉన్నామని ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లోని పార్టీలు స్పష్టం చేశాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో మంగళవారం ఉదయం పార్లమెంట్ హౌస్లో జరిగిన ‘ఇండియా’ కూటమి నేతల సమావేశంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఎంపికపై చర్చించినట్లు వర్గాలు తెలిపాయి.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. అవిశ్వాస తీర్మానం పెట్టడం విపక్షాలకు తెలియదని, అలా చేస్తున్నారంటే, చివరిసారి అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు బీజేపీ 300 సీట్లకు పైగా మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వచ్చిందని తెలుసుకోవాలని అన్నారు. ఈ సారి అవిశ్వాస తీర్మానం పెడితే 350కి పైగా సీట్లు వస్తాయి.
17వ లోక్సభలో ఇప్పటివరకు అవిశ్వాస తీర్మానం రాలేదు..
17వ లోక్సభలో ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం రాలేదు. లోక్సభలో ఏ ఎంపీ అయినా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. తీర్మానం జాబితా చేయబడిన తర్వాత, లోక్సభ స్పీకర్ దానిని సభ లోపల ప్రకటిస్తారు. అదే సమయంలో కనీసం 50 మంది ఎంపీలు తీర్మానానికి మద్దతు ప్రకటించాల్సి ఉంటుంది. సభలో తీర్మానం ఆమోదం పొందితే, అవిశ్వాస తీర్మానంపై చర్చతోపాటు ఓటింగ్ తేదీని స్పీకర్ ప్రకటిస్తారు. లోక్సభలోని 543 స్థానాలకు గాను ప్రస్తుతం ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. లోక్సభలో ఎన్డీయేకు 330 మందికి పైగా సభ్యులు ఉండగా, మెజారిటీ మార్క్ 272. కాగా ‘ఇండియా’లో చేరి ఉన్న పార్టీలకు దాదాపు 150 మంది ఎంపీలు ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, బీజేడీ, భారత రాష్ట్ర సమితి వంటి పార్టీలకు 60 మందికి పైగా ఎంపీలు ఉన్నారు. వారు ఈ రెండు శిబిరాల వెలుపల ఉన్నారు.
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!