Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు ఓటమి
- పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు ఓటమి
- బెల్జియం చేతిలో 2-1 తేడాతో ఓడిన భారత హాకీ జట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు బెల్జియం చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్లో సెమీ ఫైనల్స్లో కూడా బెల్జియం భారత్ను ఓడించింది. పూల్-బిలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో బెల్జియం 2-1తో భారత్ను ఓడించింది. భారత్ తరఫున అభిషేక్ సింగ్ 18వ నిమిషంలో గోల్ సాధించాడు. బెల్జియం తరఫున తిబౌట్ స్టాక్బ్రూక్స్, జాన్ డోహ్మెన్ గోల్స్ చేశారు. తొలి క్వార్టర్లో భారత్ పొరపాట్లు చేయగా 8వ నిమిషంలో బెల్జియంకు తొలి పెనాల్టీ కార్నర్ లభించింది. అయితే, మొదటిసారి అమిత్ రోహి దాస్ సేవ్ చేయగా, మళ్లీ శ్రీజేష్ అద్భుతమైన సేవ్ చేశాడు. 10వ నిమిషంలో అభిషేక్ సింగ్ ఫీల్డ్ గోల్ చేసేందుకు ప్రయత్నించగా.. బెల్జియం గోల్ కీపర్ గోల్ అనుమతించలేదు. తొలి క్వార్టర్లో గోల్లు నమోదు కాలేదు.
Also Read
- Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
- Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
రెండో క్వార్టర్లో భారత్ ముందంజ
రెండో క్వార్టర్లో భారత్ దూకుడుగా ఆడి తొలి గోల్ చేసింది. 18వ నిమిషంలో బెల్జియం డిఫెండర్లను దాటవేస్తూ అభిషేక్ అద్భుతమైన ఫీల్డ్ గోల్ చేశాడు. అంతకుముందు వివేక్ సాగర్ షాట్ మిస్ అయితే, అభిషేక్ ఎలాంటి పొరపాటు చేయలేదు. 23, 24 నిమిషాల్లో బెల్జియంకు పెనాల్టీ కార్నర్లు లభించాయి. అయితే శ్రీజేష్ అద్భుతంగా ఆదుకున్నాడు. 25వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ను భారత్ మిస్ చేసుకుంది. 26వ నిమిషంలో టామ్ బూన్ గ్రీన్ కార్డ్ పొంది రెండు నిమిషాల పాటు మైదానం వీడాడు. తొలి అర్ధభాగంలో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.
మూడో క్వార్టర్లో బెల్జియం ముందంజ
మూడో క్వార్టర్లో భారత్ ఒత్తిడితో ఆడుతున్నట్లు కనిపించింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న బెల్జియం 33వ నిమిషంలో థిబ్యూ స్టాక్బ్రోక్స్ ఫీల్డ్ గోల్తో జట్టును సమం చేసింది. 43వ, 44వ నిమిషాల్లో బెల్జియంకు పెనాల్టీ కార్నర్ లభించగా, దాన్ని శ్రీజేష్ కాపాడాడు. అయితే, 44వ నిమిషంలో జాన్ డోహ్మెన్ చేసిన గోల్తో బెల్జియం 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. భారత్కు కూడా పెనాల్టీ కార్నర్ లభించినా అమిత్ రోహి దాస్ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
నాలుగో క్వార్టర్లో ఇరు జట్లు దూకుడుగా ఆడాయి. 51వ నిమిషంలో భారత్కు గోల్ చేసే అవకాశం లభించినా, అభిషేక్, సుమిత్ గోల్ చేయలేకపోయారు. బెల్జియంకు పెనాల్టీ కార్నర్ లభించినా దానిని గోల్గా మార్చలేకపోయింది. 54వ నిమిషంలో రాజ్కుమార్ పాల్కు ఎల్లో కార్డ్ లభించింది. చివరి నిమిషంలో భారత్కు పెనాల్టీ కార్నర్ లభించింది, కానీ భారత్ గోల్ చేయలేకపోయింది, దీంతో భారత్ 2-1తో మ్యాచ్ను కోల్పోయింది.
తాజావార్తలు
-
Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
-
Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
-
IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
-
New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
-
Team India: ఇండియా-A జట్టులోకి మరో ఆల్రౌండర్ .. హర్ష్ దూబే అవుట్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!