Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు ఓటమి
- పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు ఓటమి
- బెల్జియం చేతిలో 2-1 తేడాతో ఓడిన భారత హాకీ జట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు బెల్జియం చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్లో సెమీ ఫైనల్స్లో కూడా బెల్జియం భారత్ను ఓడించింది. పూల్-బిలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో బెల్జియం 2-1తో భారత్ను ఓడించింది. భారత్ తరఫున అభిషేక్ సింగ్ 18వ నిమిషంలో గోల్ సాధించాడు. బెల్జియం తరఫున తిబౌట్ స్టాక్బ్రూక్స్, జాన్ డోహ్మెన్ గోల్స్ చేశారు. తొలి క్వార్టర్లో భారత్ పొరపాట్లు చేయగా 8వ నిమిషంలో బెల్జియంకు తొలి పెనాల్టీ కార్నర్ లభించింది. అయితే, మొదటిసారి అమిత్ రోహి దాస్ సేవ్ చేయగా, మళ్లీ శ్రీజేష్ అద్భుతమైన సేవ్ చేశాడు. 10వ నిమిషంలో అభిషేక్ సింగ్ ఫీల్డ్ గోల్ చేసేందుకు ప్రయత్నించగా.. బెల్జియం గోల్ కీపర్ గోల్ అనుమతించలేదు. తొలి క్వార్టర్లో గోల్లు నమోదు కాలేదు.
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
రెండో క్వార్టర్లో భారత్ ముందంజ
రెండో క్వార్టర్లో భారత్ దూకుడుగా ఆడి తొలి గోల్ చేసింది. 18వ నిమిషంలో బెల్జియం డిఫెండర్లను దాటవేస్తూ అభిషేక్ అద్భుతమైన ఫీల్డ్ గోల్ చేశాడు. అంతకుముందు వివేక్ సాగర్ షాట్ మిస్ అయితే, అభిషేక్ ఎలాంటి పొరపాటు చేయలేదు. 23, 24 నిమిషాల్లో బెల్జియంకు పెనాల్టీ కార్నర్లు లభించాయి. అయితే శ్రీజేష్ అద్భుతంగా ఆదుకున్నాడు. 25వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ను భారత్ మిస్ చేసుకుంది. 26వ నిమిషంలో టామ్ బూన్ గ్రీన్ కార్డ్ పొంది రెండు నిమిషాల పాటు మైదానం వీడాడు. తొలి అర్ధభాగంలో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది.
మూడో క్వార్టర్లో బెల్జియం ముందంజ
మూడో క్వార్టర్లో భారత్ ఒత్తిడితో ఆడుతున్నట్లు కనిపించింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న బెల్జియం 33వ నిమిషంలో థిబ్యూ స్టాక్బ్రోక్స్ ఫీల్డ్ గోల్తో జట్టును సమం చేసింది. 43వ, 44వ నిమిషాల్లో బెల్జియంకు పెనాల్టీ కార్నర్ లభించగా, దాన్ని శ్రీజేష్ కాపాడాడు. అయితే, 44వ నిమిషంలో జాన్ డోహ్మెన్ చేసిన గోల్తో బెల్జియం 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. భారత్కు కూడా పెనాల్టీ కార్నర్ లభించినా అమిత్ రోహి దాస్ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
నాలుగో క్వార్టర్లో ఇరు జట్లు దూకుడుగా ఆడాయి. 51వ నిమిషంలో భారత్కు గోల్ చేసే అవకాశం లభించినా, అభిషేక్, సుమిత్ గోల్ చేయలేకపోయారు. బెల్జియంకు పెనాల్టీ కార్నర్ లభించినా దానిని గోల్గా మార్చలేకపోయింది. 54వ నిమిషంలో రాజ్కుమార్ పాల్కు ఎల్లో కార్డ్ లభించింది. చివరి నిమిషంలో భారత్కు పెనాల్టీ కార్నర్ లభించింది, కానీ భారత్ గోల్ చేయలేకపోయింది, దీంతో భారత్ 2-1తో మ్యాచ్ను కోల్పోయింది.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!