Super Sketch: కృష్ణ కోసం సిమ్రాన్ను చంపిన జ్యోతి.. దారం, ముక్కు పుడకే ఆధారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Super Sketch: తన ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ప్రియుడి కోసం ఓ మహిళ భలే స్కెచ్ వేసింది. ప్రియుడితో వెళ్లి సంతోషంగా జీవించాలనుకుంది. అందుకు తాను చనిపోయినట్లు ఇంట్లో వాళ్లని నమ్మించాలనుకుంది. అందుకు తన స్నేహితురాలి ప్రాణం తీసింది. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది. ప్రియుడితో పారిపోయేందుకు ప్రియురాలు ప్లాన్ వేసింది. ఇంట్లో వాళ్లు తను చనిపోయిందనుకోవాలని తన లాగే ఉండే మరో యువతి ప్రాణం తీసింది. ఈ ఘటన 2017 సెప్టెంబర్ 5న జరగింది, కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
Read Also: Mosquito Coil : ఆరుగురిని బలి తీసుకున్న మస్కిటో కాయిల్
Also Read
- AP Government: భూ కేటాయింపు విధానంలో కీలక సంస్కరణలు.. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం
- Vaibhav Sooryavanshi: నెట్స్లో బుడ్డోడి విశ్వరూపం.. వండర్ కిడ్ను చూసి వణుకుతున్న ఇంగ్లాండ్ జట్టు!
- Astrology: జూలై 1 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
పానిపట్ కు చెందిన జ్యోతి, కృష్ణ కుమార్ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలనుకున్నారు. వారి ప్రేమ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పారు. కానీ వారి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపలేదు. ముఖ్యంగా జ్యోతి ఇంట్లో వాళ్లు వీరి పెండ్లికి ససేమీరా అన్నారు. దీంతో ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఓ టీవీ సీరియల్ గుర్తుకు వచ్చింది. దాని ఆధారంగా వారిద్దరు ప్లాన్ వేశారు. కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ఉండేందుకు.. జ్యోతిలానే కనిపించే మరో యువతిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా జ్యోతి తన స్నేహితురాలైన సిమ్రన్ను స్థానికంగా ఉన్న జీటీ రోడ్డుకు పిలిపించింది. సిమ్రన్ను మాటల్లో పెట్టి మత్తు మందు కలిపిన కూల్డ్రింక్ తాగించింది. మత్తులోకి జారుకున్నాక గొంతు కోసి చంపేసింది. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా సిమ్రన్ దుస్తులు మార్చి.. ఆ స్థలంలో జ్యోతికి సంబంధించిన గుర్తింపు కార్డులను పడేసి ప్రేమికులిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు.
Read Also:Bengaluru: పార్కు నుంచి ఈడ్చుకెళ్లి.. కదిలే కారులో యువతిపై గ్యాంగ్ రేప్
మృతదేహంపై ఉన్న దుస్తులు, వస్తువుల ఆధారంగా చనిపోయింది జ్యోతినే అని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. మరోవైపు సిమ్రన్ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. సిమ్రన్ కోసం గాలింపు చేపట్టారు. కేసు విచారణ సందర్భంగా యువతి హత్య తాలుకా ఫోటోలను ఆమె తల్లిదండ్రులకు చూపించగా మెడకున్న దారం, ముక్కుపుడక ఆధారంగా సిమ్రన్ అని గుర్తించారు. దీంతో పారిపోయిన జ్యోతి, కృష్ణలను వెతికే పనిలో పడ్డ పోలీసులు.. వారిని గుర్తించి, 2020లో అదుపులోకి తీసుకున్నారు. కేసు కోర్టు పరిధిలో ఉండగానే కృష్ణ జైలులోనే క్షయవ్యాధితో చనిపోయాడు. ఈ ఘటనపై తీర్పు చెప్పిన పానిపట్ కోర్టు.. జ్యోతికి జీవితఖైదు విధించింది.
తాజావార్తలు
-
Commercial LPG Cylinder Price Cut: గుడ్ న్యూస్.. ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గాయోచ్..
-
AP Government: భూ కేటాయింపు విధానంలో కీలక సంస్కరణలు.. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం
-
Vaibhav Sooryavanshi: నెట్స్లో బుడ్డోడి విశ్వరూపం.. వండర్ కిడ్ను చూసి వణుకుతున్న ఇంగ్లాండ్ జట్టు!
-
Oh Sukumari: షాక్ ఇచ్చే ప్రేమకథతో వస్తున్న ‘ఓ సుకుమారి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
VB-G RAM G: వీబీ-జీరామ్ జీ పథకం నేటి నుంచి అమల్లోకి.. రోజువారీ కనీస వేతనం రూ.300
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!