Palla Rajeshwar Reddy : అధికారులు కూడా సీఎం అబద్దాలను చూసి సిగ్గుపడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం రేవంత్ రెడ్డి పొద్దట్నుంచి అన్ని చోట్ల బూతులు మాట్లాడారని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయన భాష ను చూసి అందరూ సిగ్గుతో తల వంచుకుంటున్నారని, అధికారులు కూడా సీఎం అబద్దాలను చూసి సిగ్గుపడుతున్నారన్నారు. 30 వేల ఉద్యోగాల పై ,సీతారామ సాగర్ పై సీఎం వి మంత్రులవి అబద్దాలే అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం రాష్ట్రం లో బాక్రానంగల్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ అంటున్నారని, రైతు రుణ మాఫీ పై సీఎం ది అతి పెద్ద మోసపూరిత వైఖరి అని, మొదట రుణ మాఫీకి 40 వేల కోట్లు అవుతుందన్నారు ..తర్వాత 31 వేల కోట్లు అన్నారు ..ఇపుడు వేసింది 17 వేల కోట్లు మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించారు. హరీష్ రావు నీ మెడలు వంచి రుణ మాఫీ చేయించారని ఆయన వెల్లడించారు. దేవుడి మీద ఒట్లు లేకపోతే తిట్లు అనేది ఈ సీఎం వైఖరి అని, హరీష్ రావు ఆరు గ్యారంటీలు ,రుణ మాఫీ ఆగస్టు 15 లోగా చేస్తే రాజీనామా చేస్తానన్నారన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆ రాజీనామా లేఖను మీడియా మిత్రులకు ఇచ్చారని, హరీష్ రావు ఒత్తిడి తో సగం రుణ మాఫీ అయినా చేశారన్నారు. సీఎం రేవంత్ భాషను పశువులు కూడా సహించవని, హరీష్ రావు ఏడు సార్లు ఎమ్మెల్యే .రెండు సార్లు రాజీనామా చేశారని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సీఎం చిల్లర చిచోరా భాష ను మాట్లాడేందుకు మాకు సంస్కారం అడ్డు వస్తోందని, రాహుల్ గాంధీ కి సీఎం మీద నమ్మకం లేకే రుణమాఫీ సంబరాలకు రాలేదన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.
Minister Seethakka : మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్?
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
అనంతరం.. ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా సీఎం రేవంత్ బూతు పురాణం అందుకోవడం సిగ్గు చేటని, రుణ మాఫీ పూర్తి చేయనందుకు సీఎం రేవంత్ అమరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాయాలన్నారు. డైవర్షన్ రాజకీయాల్లో భాగం గానే రేవంత్ బూతులు అని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లను తిట్టక పోతే రేవంత్ కు పూట గడవడం లేదని ఆమె మండిపడ్డారు. రేవంత్ ఎన్ని తిట్టినా హామీల పై బీ ఆర్ ఎస్ నిలదీస్తూనే ఉంటామన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సిగ్గు లజ్జ లేకుండా హరీష్ రావు పై అసభ్య విమర్శలు చేశారని, దేవుళ్ళ ను మోసం చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు. సూటి గా చెప్పు 31 వేల కోట్ల రుణ మాఫీ చేశావా లేదా అని, కేవలం 17 వేల కోట్ల రూపాయలు మాత్రమే అకౌంట్ల లో వేశావ్ అని ఆయన అన్నారు. సిగ్గుంటే సీఎం రేవంత్ ముక్కు నేలకు రాసి పదవికి రాజీనామా చేయాలన్నారు.
Credit card: క్రెడిట్ కార్డులను క్లోజ్ చేసుకోవాలా.. ఆర్బీఐ రూల్స్ తెలుసా..?
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!