Palla Rajeshwar Reddy : అధికారులు కూడా సీఎం అబద్దాలను చూసి సిగ్గుపడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం రేవంత్ రెడ్డి పొద్దట్నుంచి అన్ని చోట్ల బూతులు మాట్లాడారని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయన భాష ను చూసి అందరూ సిగ్గుతో తల వంచుకుంటున్నారని, అధికారులు కూడా సీఎం అబద్దాలను చూసి సిగ్గుపడుతున్నారన్నారు. 30 వేల ఉద్యోగాల పై ,సీతారామ సాగర్ పై సీఎం వి మంత్రులవి అబద్దాలే అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం రాష్ట్రం లో బాక్రానంగల్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ అంటున్నారని, రైతు రుణ మాఫీ పై సీఎం ది అతి పెద్ద మోసపూరిత వైఖరి అని, మొదట రుణ మాఫీకి 40 వేల కోట్లు అవుతుందన్నారు ..తర్వాత 31 వేల కోట్లు అన్నారు ..ఇపుడు వేసింది 17 వేల కోట్లు మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించారు. హరీష్ రావు నీ మెడలు వంచి రుణ మాఫీ చేయించారని ఆయన వెల్లడించారు. దేవుడి మీద ఒట్లు లేకపోతే తిట్లు అనేది ఈ సీఎం వైఖరి అని, హరీష్ రావు ఆరు గ్యారంటీలు ,రుణ మాఫీ ఆగస్టు 15 లోగా చేస్తే రాజీనామా చేస్తానన్నారన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆ రాజీనామా లేఖను మీడియా మిత్రులకు ఇచ్చారని, హరీష్ రావు ఒత్తిడి తో సగం రుణ మాఫీ అయినా చేశారన్నారు. సీఎం రేవంత్ భాషను పశువులు కూడా సహించవని, హరీష్ రావు ఏడు సార్లు ఎమ్మెల్యే .రెండు సార్లు రాజీనామా చేశారని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సీఎం చిల్లర చిచోరా భాష ను మాట్లాడేందుకు మాకు సంస్కారం అడ్డు వస్తోందని, రాహుల్ గాంధీ కి సీఎం మీద నమ్మకం లేకే రుణమాఫీ సంబరాలకు రాలేదన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.
Minister Seethakka : మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్?
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
అనంతరం.. ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా సీఎం రేవంత్ బూతు పురాణం అందుకోవడం సిగ్గు చేటని, రుణ మాఫీ పూర్తి చేయనందుకు సీఎం రేవంత్ అమరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాయాలన్నారు. డైవర్షన్ రాజకీయాల్లో భాగం గానే రేవంత్ బూతులు అని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లను తిట్టక పోతే రేవంత్ కు పూట గడవడం లేదని ఆమె మండిపడ్డారు. రేవంత్ ఎన్ని తిట్టినా హామీల పై బీ ఆర్ ఎస్ నిలదీస్తూనే ఉంటామన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సిగ్గు లజ్జ లేకుండా హరీష్ రావు పై అసభ్య విమర్శలు చేశారని, దేవుళ్ళ ను మోసం చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు. సూటి గా చెప్పు 31 వేల కోట్ల రుణ మాఫీ చేశావా లేదా అని, కేవలం 17 వేల కోట్ల రూపాయలు మాత్రమే అకౌంట్ల లో వేశావ్ అని ఆయన అన్నారు. సిగ్గుంటే సీఎం రేవంత్ ముక్కు నేలకు రాసి పదవికి రాజీనామా చేయాలన్నారు.
Credit card: క్రెడిట్ కార్డులను క్లోజ్ చేసుకోవాలా.. ఆర్బీఐ రూల్స్ తెలుసా..?
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!