Palla Rajeshwar Reddy : రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం.. రైతుల్ని ఆదుకుంటాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
32 జిల్లాల్లో వడగళ్ల వర్షాలు కురుస్తున్నాయని, 72 లక్షల ఎకరాల్లో పంటలు వేశారన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. దేశంలోనే అత్యధిక శాతం పంటలు వేసిన రాష్ట్రం తెలంగాణ అని ఆయన వ్యాఖ్యానించారు. మూడు రోజుల క్రితమే రైతులను మంత్రులు పరామర్శించారని, ముఖ్యమంత్రి అన్ని జిల్లా కలెక్టర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారని ఆయన వివరించారు. 80 వేల మంది రైతులకు చెందిన 1లక్ష 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, పంట నష్టం అంచనా వేస్తున్నారు. 2603 క్లస్టర్స్ నుంచి వివరాలు సేకరిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు రైతుల్లో భరోసా కల్పిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం.
Also Read : Meal Maker: మీల్ మేకర్తో బోలెడు ప్రయోజనాలు.. అస్సలు విడిచిపెట్టొద్దు
Also Read
రైతుల్ని ఆదుకుంటామని, కేంద్రం టీమ్ లను పంపాలి. నష్ట పోయిన పంటలకు ఆర్థిక సహాయం చేయాలన్నారు. గతంలో వరదల సమయంలో 7 వేల కోట్ల సహాయం అడిగితే 230 కోట్లు కేంద్రం ఇచ్చిందని, గవర్నర్ కూడా పోటీ పడి పరామర్శించారన్నారు. తెలంగాణ మీద కోపం పెట్టుకోకుండా కేంద్రం సహాయం చేయాలని, ఫజల్ భీమా యోజన అనే అర్ధరహిత పాలసీ కేంద్రం తెచ్చిందని, అన్ని రాష్ట్రాలు ఇందులో నుంచి బయటకు వస్తున్నాయని, దీని వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలకే అధిక లబ్ధి జరుగుతుందన్నారు.
Also Read : Chandrababu Naidu: శాసన సభ కాదు.. కౌరవ సభ.. చరిత్రలో ఇది చీకటి రోజు.
రైతులను ఆదుకునేందుకు కొత్త పాలసీ కేంద్రం తీసుకు రావాల్సి ఉందన్నారు. నిరుద్యోగులను అవమానపరిచే విధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని, 95 శాతం తెలంగాణ వారికే ఉద్యోగాలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువచ్చిందని, ఎవరో ఫిర్యాదు చేస్తేనో, ఎవరో చెబితేనో చర్యలు తీసుకోలేదన్నారు. టీఎస్పీఎస్సీ అనుమానంతోనే పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!