క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న టైమ్ రానే వచ్చింది. T20 ప్రపంచ కప్ మ్యాచ్లో భారత్ vs పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం సర్వం సిద్ధమైంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీం ఇండియా, సల్మాన్ అఘా నాయకత్వంలోని పాకిస్తాన్ జట్టు కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భీకర పోరులో తలపడనున్నాయి. మరికాసేపట్లో ఆర్ ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ ప్రారంభంకాబోతోంది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. పాకిస్తాన్ ఎటువంటి మార్పులు లేకుండా జట్టును బరిలోకి దింపింది. భారతదేశం తమ ప్లేయింగ్ XIలో అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్లతో రెండు మార్పులు చేసింది.
Also Read:Ishan Kishan: ఇషాన్ కిషన్ మనసు దోచిన సుందరి ఈమెనే.. త్వరలో పెళ్లి బాజాలు!
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా
పాకిస్తాన్ ప్లేయింగ్ 11
సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), బాబర్ ఆజం, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్.