Deputy CM Pawan Kalyan: గ్రామీణాభివృద్ధే లక్ష్యం.. పంచాయతీరాజ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: 2019-24 మధ్య రూ.42,500 కోట్లతో 884 కి.మీ. సీసీ రోడ్లు మాత్రమే నిర్మాణం జరిగిందని, ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రూ.16,700 కోట్లతో 7,000 కి.మీ. సీసీ రోడ్ల నిర్మాణం జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వంలో 239 కి.మీ. బీటీ రోడ్లు పూర్తి చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వంలో 1,500 కి.మీ. పూర్తి చేశామన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి, కేంద్ర నిధుల వినియోగంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతపురంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న వి.బి.జి రామ్జీ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన శివరాజ్ సింగ్ చౌహాన్.. జూలై 1వ తేదీన అనంతపురం పర్యటనకు వచ్చేందుకు అంగీకరించారు. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అపారమైన సహకారానికి, అత్యధిక నిధుల కేటాయింపునకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత ఎన్డీఏ (NDA) కూటమి ప్రభుత్వ ప్రగతికి ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. గత 2019-24 మధ్య ఐదేళ్ల కాలంలో కేవలం 42,500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో కేవలం 884 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం మాత్రమే జరిగిందని గుర్తుచేశారు. కానీ తమ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కేవలం 16,700 కోట్ల రూపాయలతోనే ఏకంగా 7,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణాన్ని విజయవంతంగా చేపట్టామని వెల్లడించారు. రోడ్ల నాణ్యత విషయంలోనూ గతంలో కేవలం 239 కిలోమీటర్ల బీటీ రోడ్లు పూర్తయితే, ప్రస్తుత ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో 1,500 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లను పూర్తి చేశామని స్పష్టం చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి రంగాల్లో సాధించిన పురోగతిని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో గోశాలల నిర్మాణం పూర్తిగా శూన్యమని, అయితే తమ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా 15,000 యూనిట్ల గోశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. గతంలో కేవలం 564గా ఉన్న మినీ గోకులాల సంఖ్యను ఏకంగా 50,000 మినీ గోకులాల స్థాయికి పెంచి అద్భుతమైన ప్రగతి సాధించామన్నారు. ఇక ఉద్యానవన అభివృద్ధిలో కేవలం రెండేళ్లలోనే 2 లక్షల ఎకరాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టామని, ప్రతి సంవత్సరం మరో లక్ష ఎకరాల్లో ఉద్యానవన విస్తరణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. ఉపాధి హామీ పనుల్లో పారదర్శకతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఎన్రేగా కింద ఈ-కేవైసీ (e-KYC) అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో ఉందన్నారు. నిధుల దుర్వినియోగానికి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే వేలాది సామాజిక ఆడిట్లు, గ్రామ సభలు, ప్రజా విచారణలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థల బలోపేతానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, పల్లెల సమగ్ర వికాసమే ధ్యేయంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.
Also Read
- IND Vs SL: శ్రీలంకపై వీరవిహారం.. వచ్చిన అవకాశాన్ని సెంచరీ వైపు మలుస్తున్న పడిక్కల్!
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్పై విండ్ఫాల్ ట్యాక్స్ జీరో
- Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్కు ఓటమి తప్పదా?
తాజావార్తలు
-
Vayu Tej: మెగా వారసుడి ఫస్ట్ లుక్.. వాయువ్ తేజ్ ఫొటోను తొలిసారి షేర్ చేసిన నాగబాబు!
-
IND Vs SL: శ్రీలంకపై వీరవిహారం.. వచ్చిన అవకాశాన్ని సెంచరీ వైపు మలుస్తున్న పడిక్కల్!
-
Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
-
Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్పై విండ్ఫాల్ ట్యాక్స్ జీరో
-
Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్కు ఓటమి తప్పదా?
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!