Pakistan: పాక్లో ప్రెసిడెంట్, ప్రధాని కంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే ఎక్కువ వేతనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనాలు అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, మంత్రులు, సమాఖ్య కార్యదర్శులు, పార్లమెంటేరియన్ల కంటే ఎక్కువగా ఉన్నాయని పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సమర్పించిన డేటా ప్రకారం ది న్యూస్ ఇంటర్నేషనల్ నివేదించింది. జీతం పొందడంలో పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి మొదటి స్థానంలో ఉండగా.. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు రెండవ స్థానంలో ఉన్నారు. అధ్యక్షుడు మూడో స్థానంలో ఉన్నారు. ప్రధానమంత్రి మంత్రులు, సమాఖ్య కార్యదర్శుల కంటే తక్కువ జీతం పొందుతారు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఛైర్మన్ నూర్ ఖాన్, పాకిస్తాన్ అధ్యక్షుడి జీతం పాకిస్తానీ రూపాయిలు.8,96,550 గా ఉంది. ప్రధానమంత్రి రూ.201,574 జీతం పొందుతారని సభ్యులకు తెలియజేశారు. అదే సమయంలో పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి రూ.15,27,399 అందుకుంటారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల జీతం రూ. 14,70,711, ఫెడరల్ మంత్రులు రూ.3,38,125 పొందుతారు.ఒక పార్లమెంటేరియన్ రూ.188,000 జీతం పొందుతుండగా.. గ్రేడ్-22 అధికారి రూ.591,475 అందుకుంటారు. పాకిస్తాన్ అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ద్వారా పొందిన ప్రోత్సాహకాలు, అధికారాలకు సంబంధించిన వివరాలను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కోరింది.
Also Read
- Iran-US: ఇరాన్ మళ్లీ కొత్త మెలిక.. హార్ముజ్, యురేనియంపై కీలక వ్యాఖ్యలు
- Clothes Drying Tips: వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడానికి కష్టపడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలతో గంటల్లోనే డ్రై..!
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
- EMI Crime: ట్రాక్టర్ EMI చెల్లించడానికి కోసం బంధువుల దారుణం..
Read Also: BJP MP Passes Away: అనారోగ్యంతో బీజేపీ ఎంపీ కన్నుమూత
పాకిస్తాన్ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ మంగళవారం నాడు అత్యున్నత న్యాయస్థానం 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఖర్చుల ఆడిట్ కోసం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ముందు హాజరు కాలేదు. వచ్చే మంగళవారం జరగనున్న సమావేశానికి ఆయనను కమిటీ మళ్లీ పిలిపించి, హాజరుకాకపోతే వారెంట్లు జారీ చేస్తామని హెచ్చరించింది. రిజిస్ట్రార్ లేకపోవడంపై కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. “పాకిస్తాన్ సుప్రీం కోర్టు ప్రిన్సిపల్ అకౌంటింగ్ ఆఫీసర్ పీఏసీ ముందు హాజరుకాకపోతే, మిగిలిన సంస్థలు ఎందుకు జవాబుదారీగా ఉంటాయి” అని నూర్ ఖాన్ అన్నారు. ఎస్సీ అకౌంట్ల ఆడిట్ వ్యవహారం విచారణలో ఉందని, పీఏసీ పరిధిలోకి రాదని, కమిటీ ముందు హాజరు కావాల్సిన అవసరం లేదని రిజిస్ట్రార్ లేఖ రాశారని చెప్పారు.
తాజావార్తలు
-
Iran-US: ఇరాన్ మళ్లీ కొత్త మెలిక.. హార్ముజ్, యురేనియంపై కీలక వ్యాఖ్యలు
-
Sejal Pawar: డాక్టర్ అని చెప్పుకుంటూ చెత్త కూతలు కూసిన సెజల్ పవార్! అసలు రంగు బయటపెట్టిన కేఈఎమ్ హాస్పిటల్..
-
Clothes Drying Tips: వర్షాకాలంలో బట్టలు ఆరబెట్టడానికి కష్టపడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలతో గంటల్లోనే డ్రై..!
-
Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
-
EMI Crime: ట్రాక్టర్ EMI చెల్లించడానికి కోసం బంధువుల దారుణం..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!