Pakistan Supreme Court Blast: పాకిస్థాన్ సుప్రీంకోర్టులో భారీ పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Supreme Court Blast: పాకిస్థాన్ సుప్రీంకోర్టు భవనంలో పేలుడు సంభవించి 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ భారీ పేలుడు సుప్రీంకోర్టు బేస్మెంట్ క్యాంటీన్లో గ్యాస్ సిలిండర్ పేలిపోవడం వల్ల సంభవించిందని ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి. అయితే ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ మరమ్మతుల సమయంలో పేలుడు సంభవించిందని స్థానిక మీడియా పేర్కొంది. పాకిస్థాన్ టీవీ ఛానల్ సమా టీవీ కథనం ప్రకారం.. సుప్రీంకోర్టు భవనంలోని సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ మరమ్మతు సమయంలో ఈ భారీ పేలుడు సంభవించిందని నిఘా వర్గాలు నిర్ధారించాయని తెలిపింది.
READ ALSO: Gopichand P Hinduja: హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి హిందూజా కన్నుమూత..
Also Read
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
భయంతో బయటికి పరుగులు..
సుప్రీంకోర్టు భవనంలో ఆకస్మిక పేలుడు కారణంగా అంతా గందరగోళం నెలకొంది. ప్రకంపనలతో భవనం మొత్తం కంపించింది, న్యాయవాదులు, న్యాయమూర్తుల సిబ్బంది, ఇతర ఉద్యోగులు భయంతో బయటికి పరుగులు తీశారు. పాకిస్థాన్ మీడియా నివేదికల ప్రకారం.. పేలుడు కారణంగా కోర్టు నంబర్ 6 కు తీవ్ర నష్టం వాటిల్లినట్లు సమాచారం. పేలుడు జరగడానికి ముందు జస్టిస్ అలీ బాకర్ నజాఫీ, జస్టిస్ షాజాద్ మాలిక్ అక్కడ విచారణలు నిర్వహించారు.
సిబ్బందికి తీవ్ర గాయాలు..
భారీ పేలుడు కారణంగా గాయపడిన కార్మికుల్లో ఎక్కువ మంది ఏసీ ప్లాంట్ సమీపంలో మరమ్మతులు చేస్తున్న వారు ఉన్నారని, వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. బేస్మెంట్లో ఉన్న ఈ కెఫెటేరియా సుప్రీంకోర్టు ఉద్యోగులకు మాత్రమే కేటాయించినట్లు వెల్లడించారు.
ఇస్లామాబాద్ ఐజీపీ అలీ నాసిర్ రిజ్వీ మాట్లాడుతూ.. క్యాంటీన్లో చాలా రోజులుగా గ్యాస్ లీక్ అవుతోందని అన్నారు. ఎయిర్ కండిషనర్ మరమ్మతుల సమయంలో ఈ పేలుడు సంభవించిందని ఆయన చెప్పారు. “పలువురు నిపుణులు కూడా ఇది గ్యాస్ పేలుడు అని నిర్ధారించారు” అని వెల్లడించారు. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ఒక ఏసీ టెక్నీషియన్ శరీరం దాదాపు 80% వరకు కాలిపోయిందని చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారందరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
READ ALSO: Trump Mexico Operation: 100 ఏళ్ల తర్వాత మెక్సికోకి ట్రంప్ సైన్యం.. ఇక రక్తపాతమేనా!
తాజావార్తలు
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్బ్యాగ్స్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!