Pakistan Supreme Court Blast: పాకిస్థాన్ సుప్రీంకోర్టులో భారీ పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Supreme Court Blast: పాకిస్థాన్ సుప్రీంకోర్టు భవనంలో పేలుడు సంభవించి 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ భారీ పేలుడు సుప్రీంకోర్టు బేస్మెంట్ క్యాంటీన్లో గ్యాస్ సిలిండర్ పేలిపోవడం వల్ల సంభవించిందని ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి. అయితే ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ మరమ్మతుల సమయంలో పేలుడు సంభవించిందని స్థానిక మీడియా పేర్కొంది. పాకిస్థాన్ టీవీ ఛానల్ సమా టీవీ కథనం ప్రకారం.. సుప్రీంకోర్టు భవనంలోని సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ మరమ్మతు సమయంలో ఈ భారీ పేలుడు సంభవించిందని నిఘా వర్గాలు నిర్ధారించాయని తెలిపింది.
READ ALSO: Gopichand P Hinduja: హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి హిందూజా కన్నుమూత..
Also Read
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
భయంతో బయటికి పరుగులు..
సుప్రీంకోర్టు భవనంలో ఆకస్మిక పేలుడు కారణంగా అంతా గందరగోళం నెలకొంది. ప్రకంపనలతో భవనం మొత్తం కంపించింది, న్యాయవాదులు, న్యాయమూర్తుల సిబ్బంది, ఇతర ఉద్యోగులు భయంతో బయటికి పరుగులు తీశారు. పాకిస్థాన్ మీడియా నివేదికల ప్రకారం.. పేలుడు కారణంగా కోర్టు నంబర్ 6 కు తీవ్ర నష్టం వాటిల్లినట్లు సమాచారం. పేలుడు జరగడానికి ముందు జస్టిస్ అలీ బాకర్ నజాఫీ, జస్టిస్ షాజాద్ మాలిక్ అక్కడ విచారణలు నిర్వహించారు.
సిబ్బందికి తీవ్ర గాయాలు..
భారీ పేలుడు కారణంగా గాయపడిన కార్మికుల్లో ఎక్కువ మంది ఏసీ ప్లాంట్ సమీపంలో మరమ్మతులు చేస్తున్న వారు ఉన్నారని, వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. బేస్మెంట్లో ఉన్న ఈ కెఫెటేరియా సుప్రీంకోర్టు ఉద్యోగులకు మాత్రమే కేటాయించినట్లు వెల్లడించారు.
ఇస్లామాబాద్ ఐజీపీ అలీ నాసిర్ రిజ్వీ మాట్లాడుతూ.. క్యాంటీన్లో చాలా రోజులుగా గ్యాస్ లీక్ అవుతోందని అన్నారు. ఎయిర్ కండిషనర్ మరమ్మతుల సమయంలో ఈ పేలుడు సంభవించిందని ఆయన చెప్పారు. “పలువురు నిపుణులు కూడా ఇది గ్యాస్ పేలుడు అని నిర్ధారించారు” అని వెల్లడించారు. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ఒక ఏసీ టెక్నీషియన్ శరీరం దాదాపు 80% వరకు కాలిపోయిందని చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారందరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
READ ALSO: Trump Mexico Operation: 100 ఏళ్ల తర్వాత మెక్సికోకి ట్రంప్ సైన్యం.. ఇక రక్తపాతమేనా!
తాజావార్తలు
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
ట్రెండింగ్
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!