Pakistan: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం.. ఆయుధాలు అమ్ముతున్న పాకిస్థాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ డబ్బులు సంపాదించుకునేందుకు ఆయుధాలను అమ్ముతుంది. ఇందులో భాగంగా పాకిస్థాన్ గత ఏడాది రెండు ప్రైవేట్ అమెరికాకు చెందిన కంపెనీలతో ఆయుధ ఒప్పందాలలో $364 మిలియన్లు సంపాదించినట్లు తెలుస్తుంది. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు మందుగుండు సామగ్రిని సరఫరా చేయడం ద్వారా పాకిస్తాన్ ఈ డబ్బును సంపాదించిందని పాక్ మీడియాలో వెల్లడిస్తుంది. బీబీసీ ఉర్దూ సోమవారం ప్రసారం చేసింది. అయితే, రొమేనియా పొరుగు దేశమైన ఉక్రెయిన్కు తాము ఎలాంటి మందుగుండు సామాగ్రిని అందించలేదని పాకిస్థాన్ తెలిపింది. యూఎస్ ఫెడరల్ ప్రొక్యూర్మెంట్ డేటా సిస్టమ్ నుంచి కాంట్రాక్ట్ వివరాల ప్రకారం.. 155 ఎంఎం షెల్స్ అమ్మకం కోసం గ్లోబల్ మిలిటరీ, నార్త్రోప్ గ్రుమ్మన్ అనే రెండు యూఎస్ కంపెనీలతో పాకిస్తాన్ ఒప్పందాలు చేసుకుందని బీబీసీ తెలిపింది. ఉక్రెయిన్కు ఆయుధాలు అందించేందుకు 2022 ఆగస్టు 17న పాకిస్థాన్ ఈ ఒప్పందాలపై సంతకం చేసింది.
Read Also: LB Nagar Politics: ప్రచారంపై ప్రత్యేక దృష్టి.. సభలు, రోడ్షోలతో హోరెత్తుతున్న ఎల్బి నగర్..
Also Read
- Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
- Virat Kohli: ఇంగ్లాండ్కు అసలైన మొగుడు విరాట్.. మైదానంలోకి తిరిగి రాగానే 'కోచ్'గా మారిన కోహ్లీ!
- Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
- Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్కూ స్వేచ్ఛ ఇవ్వాలి
ఇక, ఇస్లామాబాద్లోని విదేశాంగ కార్యాలయం ఉక్రెయిన్కు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని విక్రయించడాన్ని తీవ్రంగా ఖండించింది. విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. పాకిస్తాన్ రెండు దేశాల మధ్య వివాదంలో తటస్థత విధానాన్ని కొనసాగిస్తోంది.. వారికి ఎలాంటి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అందించలేదు అని పేర్కొంది. ఈ ఆరోపణ ఒప్పందాలు పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ (PDM) పాలనలో జరిగాయని మీకు తెలిపారు. గత ఏడాది ఏప్రిల్లో అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని పీఎండీ పార్టీ గద్దె దింపింది. ఉక్రెయిన్పై దాడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించినప్పుడు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫిబ్రవరి 24న రష్యా పర్యటనలో ఉన్నారు.
Read Also: Arvind Kejriwal: ఢిల్లీలో అధికారులు వర్సెస్ ప్రభుత్వం.. ముదురుతున్న వివాదం
ఇక, బీబీసీ ఉర్దూ నివేదిక ప్రకారం.. అమెరికా-ఆధారిత కంపెనీ గ్లోబల్ మిలిటరీకి US$232 మిలియన్ల విలువైన కాంట్రాక్టు లభించగా.. US$131 మిలియన్ల విలువైన మరో ఒప్పందం నార్త్రోప్ గ్రుమ్మన్తో సంతకం చేయబడింది. ఈ ఒప్పందాల గడువు గత నెల అంటే అక్టోబర్ 2023తో ముగిసిందని నివేదికలో వెల్లడించింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ నుండి ఐదుసార్లు రావల్పిండిలో ల్యాండ్ అయిన బ్రిటిష్ మిలటరీ కార్గో విమానంలో డెలివరీ జరిగిందని నివేదిక ఆరోపించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆయుధాల ఎగుమతులు 3,000 శాతం పెరిగాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ డేటా కూడా ప్రకటించిందని బీబీసీ ఉర్దూ సాక్ష్యాలను వెల్లడించింది. పాకిస్తాన్ 2021-22లో US $ 13 మిలియన్ల విలువైన ఆయుధాలను ఎగుమతి చేయగా.. తాజా ఎగుమతులు 2022-23లో US $ 415 మిలియన్లకు చేరుకున్నాయి.
తాజావార్తలు
-
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్ను కలుపుతున్న నాని!
-
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
-
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్
-
Bengaluru Crime: బెంగళూరులో దారుణం.. పార్సిల్ ఇవ్వడానికి వచ్చి పశువులా ప్రవర్తించిన కామాంధుడు! ఏం చేశాడో తెలుసా?
-
Virat Kohli: ఇంగ్లాండ్కు అసలైన మొగుడు విరాట్.. మైదానంలోకి తిరిగి రాగానే ‘కోచ్’గా మారిన కోహ్లీ!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..