Pakistan: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం.. ఆయుధాలు అమ్ముతున్న పాకిస్థాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ డబ్బులు సంపాదించుకునేందుకు ఆయుధాలను అమ్ముతుంది. ఇందులో భాగంగా పాకిస్థాన్ గత ఏడాది రెండు ప్రైవేట్ అమెరికాకు చెందిన కంపెనీలతో ఆయుధ ఒప్పందాలలో $364 మిలియన్లు సంపాదించినట్లు తెలుస్తుంది. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు మందుగుండు సామగ్రిని సరఫరా చేయడం ద్వారా పాకిస్తాన్ ఈ డబ్బును సంపాదించిందని పాక్ మీడియాలో వెల్లడిస్తుంది. బీబీసీ ఉర్దూ సోమవారం ప్రసారం చేసింది. అయితే, రొమేనియా పొరుగు దేశమైన ఉక్రెయిన్కు తాము ఎలాంటి మందుగుండు సామాగ్రిని అందించలేదని పాకిస్థాన్ తెలిపింది. యూఎస్ ఫెడరల్ ప్రొక్యూర్మెంట్ డేటా సిస్టమ్ నుంచి కాంట్రాక్ట్ వివరాల ప్రకారం.. 155 ఎంఎం షెల్స్ అమ్మకం కోసం గ్లోబల్ మిలిటరీ, నార్త్రోప్ గ్రుమ్మన్ అనే రెండు యూఎస్ కంపెనీలతో పాకిస్తాన్ ఒప్పందాలు చేసుకుందని బీబీసీ తెలిపింది. ఉక్రెయిన్కు ఆయుధాలు అందించేందుకు 2022 ఆగస్టు 17న పాకిస్థాన్ ఈ ఒప్పందాలపై సంతకం చేసింది.
Read Also: LB Nagar Politics: ప్రచారంపై ప్రత్యేక దృష్టి.. సభలు, రోడ్షోలతో హోరెత్తుతున్న ఎల్బి నగర్..
Also Read
- Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి - పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
ఇక, ఇస్లామాబాద్లోని విదేశాంగ కార్యాలయం ఉక్రెయిన్కు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని విక్రయించడాన్ని తీవ్రంగా ఖండించింది. విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. పాకిస్తాన్ రెండు దేశాల మధ్య వివాదంలో తటస్థత విధానాన్ని కొనసాగిస్తోంది.. వారికి ఎలాంటి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అందించలేదు అని పేర్కొంది. ఈ ఆరోపణ ఒప్పందాలు పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ (PDM) పాలనలో జరిగాయని మీకు తెలిపారు. గత ఏడాది ఏప్రిల్లో అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని పీఎండీ పార్టీ గద్దె దింపింది. ఉక్రెయిన్పై దాడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించినప్పుడు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫిబ్రవరి 24న రష్యా పర్యటనలో ఉన్నారు.
Read Also: Arvind Kejriwal: ఢిల్లీలో అధికారులు వర్సెస్ ప్రభుత్వం.. ముదురుతున్న వివాదం
ఇక, బీబీసీ ఉర్దూ నివేదిక ప్రకారం.. అమెరికా-ఆధారిత కంపెనీ గ్లోబల్ మిలిటరీకి US$232 మిలియన్ల విలువైన కాంట్రాక్టు లభించగా.. US$131 మిలియన్ల విలువైన మరో ఒప్పందం నార్త్రోప్ గ్రుమ్మన్తో సంతకం చేయబడింది. ఈ ఒప్పందాల గడువు గత నెల అంటే అక్టోబర్ 2023తో ముగిసిందని నివేదికలో వెల్లడించింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ నుండి ఐదుసార్లు రావల్పిండిలో ల్యాండ్ అయిన బ్రిటిష్ మిలటరీ కార్గో విమానంలో డెలివరీ జరిగిందని నివేదిక ఆరోపించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆయుధాల ఎగుమతులు 3,000 శాతం పెరిగాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ డేటా కూడా ప్రకటించిందని బీబీసీ ఉర్దూ సాక్ష్యాలను వెల్లడించింది. పాకిస్తాన్ 2021-22లో US $ 13 మిలియన్ల విలువైన ఆయుధాలను ఎగుమతి చేయగా.. తాజా ఎగుమతులు 2022-23లో US $ 415 మిలియన్లకు చేరుకున్నాయి.
తాజావార్తలు
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..