Arvind Kejriwal: ఢిల్లీలో అధికారులు వర్సెస్ ప్రభుత్వం.. ముదురుతున్న వివాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీలో మరోసారి అధికారులు వర్సెస్ ప్రభుత్వం మధ్య వార్ ముదిరింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజిలెన్స్ మంత్రి అతిషి నివేదికను ఎల్జీ వీకే సక్సేనాకు పంపారు. అతనిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. చీఫ్ సెక్రటరీని తక్షణమే తన పదవి నుంచి తొలగించాలని, సస్పెండ్ చేయాలని కేజ్రీవాల్ సిఫార్సు చేశారు. ఈ నివేదికను సీబీఐ, ఈడీకి పంపాలని మంత్రి అతిశిని సీఎం కోరారు. బామ్నోలి భూసేకరణ కేసులో ఢిల్లీ విజిలెన్స్ మంత్రి అతిషి ఒకరోజు ముందుగానే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు 650 పేజీల ప్రాథమిక నివేదికను సమర్పించారు. నివేదికలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్కుమార్ తన కుమారుడి కంపెనీకి లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. ఈ కేసులో 850 కోట్ల రూపాయలను అక్రమంగా లాభపడినట్లు నివేదిక పేర్కొంది. 2015లో ద్వారకా ఎక్స్ప్రెస్వే సమీపంలో ఈ భూమిని కేవలం రూ.75 లక్షలకు కొనుగోలు చేశారు.
Also Read
బామ్నోలిలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సేకరిస్తున్న 19 ఎకరాల భూమి అసలు ధరను ఈ ఏడాది మేలో అప్పటి జిల్లా మేజిస్ట్రేట్ (సౌత్ వెస్ట్) హేమంత్ కుమార్ రూ.41 కోట్ల నుంచి రూ.353 కోట్లకు పెంచారు. ఈ కేసులో హేమంత్ కుమార్ను హోం మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. ద్వారకా ఎక్స్ప్రెస్వే భూసేకరణ వ్యవహారంలో అక్రమాలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ప్రధాన కార్యదర్శిపై ఆరోపణలు చేశారు. అదే రోడ్డు ప్రాజెక్టు కోసం సేకరించిన భూమికి అక్రమ పరిహారం ఇస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ముఖ్యమంత్రి విజిలెన్స్ మంత్రి అతిశి నుంచి నివేదిక కోరారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నవంబర్ 11 న విజిలెన్స్ మంత్రి అతిషి నుండి నివేదిక కోరారు. నాలుగు రోజుల్లో దాదాపు 650 పేజీల నివేదికను రూపొందించి ముఖ్యమంత్రికి సమర్పించారు. ప్రధాన కార్యదర్శి నరేష్కుమార్పై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, డర్టీ పాలిటిక్స్లో భాగమని ఢిల్లీ ప్రభుత్వ డివిజనల్ కమిషనర్ అశ్విని కుమార్ సోమవారం విలేకరుల సమావేశంలో చెప్పడం గమనార్హం.
Read Also:Atchannaidu: జగన్ నిర్ణయంతో 21 బీసీ కులాలకు తీవ్ర అన్యాయం.. బీసీల ద్రోహి జగన్ రెడ్డి..!
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!