Champions Trophy 2025: భారత్కు రావొద్దు.. పాక్కు హర్భజన్ కౌంటర్!
- భారత్కు పాకిస్థాన్ రావొద్దు
- పరిస్థితులు చక్కబడేవరకు భారత్ పర్యటించదు
- ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని జరగనివ్వండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025పై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. పాకిస్థాన్కు వెళ్లేది లేదని, హైబ్రిడ్ మోడల్లో అయితే టోర్నీ ఆడుతామని ఐసీసీకి బీసీసీఐ స్పష్టం చేసింది. పాక్లో మొత్తం టోర్నీ నిర్వహిస్తామని, హైబ్రిడ్ మోడల్కు తాము అస్సలు ఒప్పుకోమని పీసీబీ పేర్కొంది. మొండిపట్టు మీదున్న పాకిస్థాన్కు ఐసీసీ షాక్ ఇచ్చింది. హైబ్రిడ్ మోడల్కు ఒప్పుకోకుంటే.. టోర్నీ మొత్తాన్ని షిఫ్ట్ అవుతుందని పీసీబీకి ఐసీసీ చెప్పింది. దెబ్బకు దిగొచ్చిన పీసీబీ.. హైబ్రిడ్ మోడల్కు తాము సిద్దమే అని తెలిపింది.
హైబ్రిడ్ మోడల్కు అంగీకరిస్తామని చెప్పిన పీసీబీ.. ఓ మెలిక పెట్టింది. భవిష్యత్తులో పాకిస్తాన్ టీమ్ కూడా ఐసీసీ టోర్నీల కోసం భారత్కు వెళ్లాడని, ఆ మ్యాచ్లను తటస్థ వేదికల్లో నిర్వహించేలా హామీ ఇవ్వాలని ఐసీసీని పీసీబీ కోరింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. పీసీబీకి కౌంటర్ ఇచ్చాడు. ఐసీసీ టోర్నీల కోసం భారత్కు పాక్ రావొద్దని, తమకు ఎలాంటి బాధ లేదని పేర్కొన్నాడు. పాకిస్థాన్లో పరిస్థితులు చక్కబడేవరకు టీమిండియా పర్యటించదని భజ్జీ చెప్పుకొచ్చాడు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
Also Read: IND vs AUS: అడిలైడ్ టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్!
సోమవారం న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ టెన్నిస్ క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ… ‘పాకిస్థాన్కు ఇష్టం లేకపోతే భారత్కు అస్సలు రావొద్దు. మాకు ఎలాంటి బాధ లేదు. పాక్ టీమ్ భారత్కు రాకపోతే.. ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుత క్రికెటర్లను అడిగినా ఇదే విషయం చెప్తారు. పాకిస్థాన్లో పరిస్థితి భిన్నంగా ఉంటే.. ఈ విషయంలో భారత్ వైఖరి మరోలా ఉండేది. మొండి వైఖరిని వదిలేసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని జరగనివ్వండి. టోర్నీని పాక్ ఆపలేదు. మలేసియా, శ్రీలంక దేశాలు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. పాకిస్థాన్లో పరిస్థితులు చక్కబడేవరకు భారత్ పర్యటించదు’ అని అన్నాడు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..