Pakistan Economy: పాకిస్థాన్ లో మరోసారి ద్రవ్యోల్బణం.. డజన్ గుడ్లు రూ. 400
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ ప్రజలు మరోసారి ద్రవ్యోల్బణం భారాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ లో ధరలకు సంబందించిన వివరాలను లాహోర్లో పాక్ ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా డజను గుడ్ల ధర మార్గెట్ లో 400 పాకిస్తానీ రూపాయలకు (పీకేఆర్) చేరుకుందని తెలిపారు.
Read Also: North Korea: అమెరికా స్థావరాలే టార్గెట్.. బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన నార్త్ కొరియా
Also Read
అలాగే, పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా రేట్ల జాబితాను విడుదల చేసినా స్థానిక యంత్రాంగం సక్రమంగా అమలు చేయకపోవడంతో ఈ సమస్య తలెత్తుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం నిర్ణయించిన కిలో 175 ధరకు వ్యతిరేకంగా కిలో ఉల్లిని 230 నుంచి 250 రూపాయల మధ్య విక్రయిస్తున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. లాహోర్లో డజను కోడిగుడ్ల ధర పీకేఆర్ 400కి చేరుకోగా.. అక్కడ చికెన్ కిలోగ్రాము పీకేఆర్ 615 చొప్పున విక్రయిస్తున్నారు. గత నెలలో ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ (ECC) జాతీయ ధరల పర్యవేక్షణ కమిటీ (NPMC) ధరల స్థిరత్వాన్ని నిర్ధారించడానికి అలాగే, హోర్డింగ్ తో పాటు లాభదాయకతను నిరోధించే చర్యల కోసం ప్రాంతీయ ప్రభుత్వాలతో క్రమం తప్పకుండా సమన్వయం కొనసాగించాలని ఆదేశించింది. పాకిస్థాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనను ఉటంకిస్తూ.. క్యాబినెట్ కమిటీ సమావేశానికి ఆర్థిక, రెవెన్యూతో పాటు ఆర్థిక వ్యవహారాల తాత్కాలిక సమాఖ్య మంత్రి శంషాద్ అక్తర్ అధ్యక్షత వహించినట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..