Vyomika Singh : మన రాడర్ సెంటర్లను పాక్ టార్గెట్ చేసింది.. వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ ప్రకటన
- పశ్చిమ సరిహద్దుల్లో మిస్సైల్ దాడులకు పాల్పడుతుంది
- పాక్ ఫైటర్ జెట్లు భారత భూభాగంలోకి పలుమార్లు వచ్చాయి
- పంజాబ్ లోని పలు ఎయిర్ బేస్ లను లక్ష్యంగా చేసుకుంది
- శ్రీనగర్ స్కూల్లు, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుంది
- రాడర్ సెంటర్లు, వెపన్ స్టోరేజ్ సెంటర్లను కూడా టార్గెట్ చేసింది : వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vyomika Singh : పాకిస్తాన్ తన దుర్మార్గపు చర్యలను ఏమాత్రం విరమించడం లేదు. పశ్చిమ సరిహద్దుల్లో వరుసగా మిస్సైల్ దాడులకు పాల్పడుతోంది. అంతేకాకుండా పాక్ ఫైటర్ జెట్లు పదేపదే భారత భూభాగంలోకి చొచ్చుకువస్తున్నాయి. పంజాబ్లోని పలు కీలకమైన ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకున్నాయి. మానవత్వం మరిచి శ్రీనగర్లోని స్కూళ్లు, ఆసుపత్రులపై కూడా దాడులకు తెగబడుతోంది. రాడార్ కేంద్రాలు, ఆయుధ నిల్వ కేంద్రాలను కూడా టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ తన పిరికి చర్యలకు పాల్పడుతోందని వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Operation Sindoor: పాక్ పై మళ్లీ వాటర్ వార్.. సలాల్ డ్యామ్ 5 గేట్లు ఓపెన్
Also Read
- Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
- Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
- Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
- Asaduddin Owaisi: బాబ్రీ మసీదులాగే భోజ్శాల తీర్పు.. సుప్రీంకు వెళ్తామన్న ఓవైసీ..
వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం, పాకిస్తాన్ ఈ చర్యలు అత్యంత హేయమైనవిగా ఉన్నాయి. సైనిక స్థావరాలే కాకుండా పౌర ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకోవడం వారి దురుద్దేశాన్ని స్పష్టం చేస్తోందన్నారు. పంజాబ్లోని ఎయిర్ బేస్లపై దాడులు చేయడం ద్వారా భారత వైమానిక శక్తిని బలహీనపరచాలని చూస్తోందని, ఇక శ్రీనగర్లోని విద్యా సంస్థలు, వైద్యాలయాలపై దాడులు చేయడం వారి మానవత్వం లేని చర్యలకు నిదర్శనమన్నారు. రాడార్ కేంద్రాలు, ఆయుధ నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా భారత రక్షణ వ్యవస్థను దెబ్బతీయాలని పాకిస్తాన్ కుట్ర చేస్తోందని వ్యోమిక సింగ్ వివరించారు.
పాకిస్తాన్ ఈ వరుస దాడులు ప్రాంతీయంగా భయానక పరిస్థితులను సృష్టిస్తున్నాయి. అమాయక ప్రజల ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పాకిస్తాన్ తెగింపు చర్యలకు పాల్పడుతోంది. అయితే భారత సైన్యం పూర్తి అప్రమత్తతతో ఉంటూ శత్రువుల ప్రతి చర్యను తిప్పికొడుతోంది.
Operation Sindoor Live Updates: పాకిస్తాన్ పై భారత్ మెరుపు దాడులు.. లైవ్ అప్డేట్స్
తాజావార్తలు
-
Maharashtra: ఇండిగోలో సాధారణ ప్రయాణికులతో కలిసి బెంగళూరు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
Fact Check : ఆదివారం పెట్రోల్ బంకులు బంద్.. క్లారిటీ ఇచ్చిన సివిల్ సప్లైస్ కమిషనర్
-
Actor Darshan Case: రేణుకాస్వామి హత్య కేసు.. కన్నడ స్టార్ దర్శన్కు సుప్రీంకోర్టు షాక్..
-
Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
-
Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!