T20 World Cup 2024: స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన భారత్.. టార్గెట్ ఎంతంటే..?
- భారత్-పాక్ మధ్య మ్యాచ్
- నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసిన పాకిస్తాన్
- భారత్ టార్గెట్ 106 పరుగులు.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా.. భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 8 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. భారత్ ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. పాకిస్తాన్ బ్యాటింగ్లో నిధా దార్ ఒక్కరే ఒంటరి పోరాటం చేసింది. 34 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 28 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లంతా తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. పాక్ బ్యాటర్లలో మునీబా అలీ (17), సయేద అరూబ్ షా (14), ఫాతిమా సనా (13), సిద్రా అమీన్ (8) పరుగులు చేశారు. భారత్ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ బ్యాటర్లను పెవిలియన్ కు పంపించారు. దీంతో.. తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. భారత్ బౌలర్లలో అరుంధతీ రెడ్డి 3 వికెట్లతో చెలరేగింది. శ్రేయాంక పాటిల్ 2 వికెట్లు తీసింది. రేణుకా సింగ్, దీప్తి శర్మ, ఆశ శోభన తలో వికెట్ సంపాదించారు.
Also Read
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!