China-Pakistan: చైనాకు పాకిస్థాన్ భారీ గిఫ్ట్..
- చైనాకు పాకిస్థాన్ భారీ గిఫ్ట్
- చైనా ఇంజనీర్లను చంపిన ఉగ్రవాదులను హతం చేసిన పాక్
- వేరే జైలుకు తరలిస్తుండగా.. ఘటన
- ఇద్దరు ఉగ్రవాదులు తప్ప అందరూ సురక్షితంగా ఉన్నట్లు పోలీసుల ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా ప్రధాని లీ కియాంగ్కు పాకిస్థాన్ కొత్త గిఫ్ట్ ఇచ్చింది. ఈ రోజు ఉదయం, చైనా ఇంజనీర్లను చంపిన ఇద్దరు ఉగ్రవాదులను పాకిస్థాన్కు రాకముందే జైలుకు తరలించే పేరుతో..పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ సినిమా శైలిలో వారిని హతమార్చింది. అయితే వారితో పాటు ప్రయాణిస్తున్న ఇతర జైలు వ్యాన్లో కూర్చున్న పోలీసు అధికారులు, ఇతర ఉగ్రవాదులందరూ దాడి నుంచి బయటపడ్డారు. జూలై 14, 2021న పాకిస్థాన్లోని దాసులో చైనా ఇంజనీర్లతో నిండిన బస్సుపై టెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ తీవ్రవాదులు భారీ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.
READ MORE: Maharashtra: ‘‘మహాయుతి’’లో లుకలుకలు.. కేబినెట్ నిర్ణయాలపై అజిత్ పవార్ అసంతృప్తి..
Also Read
- Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- OTR: జాగ్రత్త.. మీరు, మీ భర్త జాగ్రత్తగా మెలగండి..
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
ఈ ఆత్మాహుతి దాడిలో నలుగురు చైనీస్ ఇంజనీర్లు సహా 12 మంది చనిపోయారు. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్పై చైనా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. చైనా వ్యతిరేకతకు భయపడి, పాక్ పరిపాలన ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసింది. ముహమ్మద్ హుస్సేన్, అతని సహచరుడు, అయాజ్ అలియాస్ జహాంజేబ్ను అరెస్ట్ చేసింది. విచారణ జరిపింది. 2022లో కోర్టు వారిద్దరికీ మరణశిక్ష విధించింది. అరెస్టు చేసిన తర్వాత ఈ ఇద్దరు ఉగ్రవాదులను వేర్వేరు జైళ్లలో ఉంచారు.
READ MORE: Lucky Baskhar: అక్టోబర్ 30 నుంచి ‘లక్కీ భాస్కర్’ ప్రీమియర్ షోలు
తాజా పరిణామాల ప్రకారం ఈ ఇద్దరు ఉగ్రవాదులను ఈ ఉదయం సాహివాల్లోని హై సెక్యూరిటీ జైలుకు తరలించారు. వీరితో పాటు మరికొందరు ఉగ్రవాదులు, పోలీసు బందోబస్తును కూడా జైలు వ్యాన్లో మోహరించారు. పాకిస్థాన్ పోలీసుల కథనం ప్రకారం.. ఈ జైలు వ్యాన్పై ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో చైనా ఇంజనీర్లను హతమార్చిన ఉగ్రవాదులిద్దరూ హతమయ్యారు. కాగా..వారితో పాటు ప్రయాణిస్తున్న ఇతర జైలు వ్యాన్లో కూర్చున్న ఇతర ఉగ్రవాదులు, పోలీసులకు ఎలాంటి గాయాలు కాలేదు. దాడి చేసిన వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కానీ ఇది పాక్ చైనాకు ఇచ్చిన గిఫ్ట్ అని అందరూ అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
-
OTR: జాగ్రత్త.. మీరు, మీ భర్త జాగ్రత్తగా మెలగండి..
-
Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
-
Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!