China-Pakistan: చైనాకు పాకిస్థాన్ భారీ గిఫ్ట్..
- చైనాకు పాకిస్థాన్ భారీ గిఫ్ట్
- చైనా ఇంజనీర్లను చంపిన ఉగ్రవాదులను హతం చేసిన పాక్
- వేరే జైలుకు తరలిస్తుండగా.. ఘటన
- ఇద్దరు ఉగ్రవాదులు తప్ప అందరూ సురక్షితంగా ఉన్నట్లు పోలీసుల ప్రకటన
చైనా ప్రధాని లీ కియాంగ్కు పాకిస్థాన్ కొత్త గిఫ్ట్ ఇచ్చింది. ఈ రోజు ఉదయం, చైనా ఇంజనీర్లను చంపిన ఇద్దరు ఉగ్రవాదులను పాకిస్థాన్కు రాకముందే జైలుకు తరలించే పేరుతో..పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ సినిమా శైలిలో వారిని హతమార్చింది. అయితే వారితో పాటు ప్రయాణిస్తున్న ఇతర జైలు వ్యాన్లో కూర్చున్న పోలీసు అధికారులు, ఇతర ఉగ్రవాదులందరూ దాడి నుంచి బయటపడ్డారు. జూలై 14, 2021న పాకిస్థాన్లోని దాసులో చైనా ఇంజనీర్లతో నిండిన బస్సుపై టెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ తీవ్రవాదులు భారీ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.
READ MORE: Maharashtra: ‘‘మహాయుతి’’లో లుకలుకలు.. కేబినెట్ నిర్ణయాలపై అజిత్ పవార్ అసంతృప్తి..
Also Read
ఈ ఆత్మాహుతి దాడిలో నలుగురు చైనీస్ ఇంజనీర్లు సహా 12 మంది చనిపోయారు. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్పై చైనా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. చైనా వ్యతిరేకతకు భయపడి, పాక్ పరిపాలన ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసింది. ముహమ్మద్ హుస్సేన్, అతని సహచరుడు, అయాజ్ అలియాస్ జహాంజేబ్ను అరెస్ట్ చేసింది. విచారణ జరిపింది. 2022లో కోర్టు వారిద్దరికీ మరణశిక్ష విధించింది. అరెస్టు చేసిన తర్వాత ఈ ఇద్దరు ఉగ్రవాదులను వేర్వేరు జైళ్లలో ఉంచారు.
READ MORE: Lucky Baskhar: అక్టోబర్ 30 నుంచి ‘లక్కీ భాస్కర్’ ప్రీమియర్ షోలు
తాజా పరిణామాల ప్రకారం ఈ ఇద్దరు ఉగ్రవాదులను ఈ ఉదయం సాహివాల్లోని హై సెక్యూరిటీ జైలుకు తరలించారు. వీరితో పాటు మరికొందరు ఉగ్రవాదులు, పోలీసు బందోబస్తును కూడా జైలు వ్యాన్లో మోహరించారు. పాకిస్థాన్ పోలీసుల కథనం ప్రకారం.. ఈ జైలు వ్యాన్పై ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో చైనా ఇంజనీర్లను హతమార్చిన ఉగ్రవాదులిద్దరూ హతమయ్యారు. కాగా..వారితో పాటు ప్రయాణిస్తున్న ఇతర జైలు వ్యాన్లో కూర్చున్న ఇతర ఉగ్రవాదులు, పోలీసులకు ఎలాంటి గాయాలు కాలేదు. దాడి చేసిన వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కానీ ఇది పాక్ చైనాకు ఇచ్చిన గిఫ్ట్ అని అందరూ అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!