EAM Jaishankar: రాత్రి ఉగ్రవాదం, పగలు వ్యాపారం.. పాక్పై విదేశాంగ మంత్రి మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EAM Jaishankar: ఒక సభ్యుడు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నంత కాలం భారతదేశం సార్క్ (సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్) సమావేశాన్ని నిర్వహించలేమని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం తెలిపారు. రాత్రిపూట ఉగ్రవాదం, పగటిపూట వ్యాపారం జరిగే పరిస్థితిని భారతదేశం సహించదని పాకిస్థాన్పై జైశంకర్ మండిపడ్డారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా, సార్క్ బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంకతో సహా దక్షిణాసియాలోని ఎనిమిది దేశాల ప్రాంతీయ అంతర్ ప్రభుత్వ సంస్థ.
ఇతర పొరుగు దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉన్నామని, కానీ పాకిస్తాన్తో కాదని జైశంకర్ తెలిపారు. సీమాంతర ఉగ్రవాదం కారణంగా పాక్తో సాధారణ సంబంధాలు కలిగి ఉండలేకపోతున్నామని అన్నారు. ఉగ్రవాదం కారణంగా పాకిస్థాన్తో సాధారణ సంబంధాన్ని కలిగి ఉండటం సాధ్యం కాదన్నారు. ప్రధాని అమెరికా పర్యటనపై, యూఎస్తో సంబంధాలపై ఆయన స్పందించారు. ప్రధాని పర్యటన అత్యంత ఉత్పాదకంగా జైశంకర్ అభివర్ణించారు. పర్యటన నుంచి వచ్చిన ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే.. రెండు దేశాల మధ్య సంబంధాలు అనూహ్యందా బాగా పెరిగాయన్నారు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
Also Read: Jammu And Kashmir: జమ్మూలో బక్రీద్ జోష్.. రంగుల కాంతులతో ముస్తాబైన కాశ్మీర్
కెనడా ఖలిస్థాన్ సమస్యపై ఆయన మాట్లాడారు. కెనడా ఖలిస్తానీ సమస్యతో ఎలా వ్యవహరిస్తుందనేది చాలా కాలంగా ఆందోళనగా ఉందన్నారు. ఎందుకంటే చాలా స్పష్టంగా, వారు ఓటు బ్యాంకు రాజకీయాలచే నడపబడుతున్నట్లు కనిపిస్తున్నారని జైశంకర్ అన్నారు. ఖలిస్థానీ సమస్య గత కొన్ని సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య సంబంధాలను అనేక విధాలుగా ప్రభావితం చేసిందని ఆయన అన్నారు. ఖలిస్థాన్ అనుకూల వేర్పాటువాదులు, తీవ్రవాద అంశాలకు చోటు కల్పించకుండా కెనడాను భారత్ అడుగుతోంది. కెనడా కార్యకలాపాలు భారత జాతీయ భద్రతకు విఘాతం కలిగిస్తే స్పందిస్తామని విదేశాంగ మంత్రి కెనడాకు స్పష్టం చేశారు.
చైనాతో ప్రతిష్టంభన
ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. లడఖ్ ప్రతిష్టంభన తరువాత భారతదేశం, చైనా మధ్య సంబంధాల గురించి కూడా మాట్లాడారు. “సరిహద్దు పరిస్థితి నేటికీ అసాధారణంగా ఉంది” అని జైశంకర్ అన్నారు. సరిహద్దు నిర్వహణకు సంబంధించిన ఒప్పందాలను ఉల్లంఘించినందున భారతదేశం, చైనా మధ్య సంబంధాలు కష్టతరమైన దశ గుండా వెళుతున్నాయని విదేశాంగ శాఖ పేర్కొంది. విస్తృతమైన దౌత్య, సైనిక చర్చల తరువాత ఇరుపక్షాలు అనేక ప్రాంతాల నుండి విడదీయడం పూర్తి చేసినప్పటికీ, తూర్పు లడఖ్లోని కొన్ని ఘర్షణ పాయింట్లలో భారతదేశం, చైనా దళాలు ఘర్షణలో చిక్కుకున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!