Pakistan-Afghanistan: పాకిస్థాన్- ఆఫ్ఘనిస్థాన్ పరస్పర దాడులు.. యుద్ధం తప్పదా?
- ఇటీవల ఆఫ్ఘనిస్థాన్పై పాకిస్థాన్ వైమానిక దాడి
- ఈ దాడిలో 46 మంది మృతి
- సైన్యాలు పరస్పరం సరిహద్దుల్లోకి ప్రవేశించి దాడులు
- యుద్ధం వచ్చే అవకాశాలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ఆఫ్ఘనిస్థాన్పై పాకిస్థాన్ వైమానిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 46 మంది మరణించగా.. మృతుల్లో అత్యధికులు మహిళలు, పిల్లలు ఉన్నారని.. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అఫ్గానిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి ప్రకటించారు. ఈ దాడి తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటోంది. ఇరువైపుల సైన్యాలు పరస్పరం సరిహద్దుల్లోకి ప్రవేశించి ప్రజలను చంపేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కొత్త యుద్ధం వచ్చే అవకాశాలు తెరపైకి వస్తున్నాయి.
ఆఫ్ఘనిస్థాన్పై పాకిస్థాన్ నిరంతరం దాడులు..
ఆఫ్ఘనిస్థాన్పై పాకిస్థాన్ నిరంతరం దాడులు చేస్తోంది. తాజాగా సోమవారం పాకిస్థాన్.. 8 మందిని ఆఫ్ఘనిస్తాన్ పౌరులను చంపినట్లు తెలుస్తోంది. మరో13 మంది పౌరులు గాయపడినట్లు సమాచారం. శనివారం కూడా, పాక్టియాలోని మసీదుపై పాకిస్థాన్ మోర్టార్ కాల్పులు జరిపింది. ఇందులో 3 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ఆఫ్ఘన్ పౌరులు అంతర్జాతీయ నాయకులు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పాక్ నిరంతరం తమ పౌరులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
- Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
- 7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
రెండు వైపుల నుంచి హింసాత్మక ఘర్షణలు..
టోలో న్యూస్ నివేదిక ప్రకారం.. డ్యూరాండ్ లైన్లో రెండు వైపుల నుంచి హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయని తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్థాన్ ఆర్మీకి చెందిన రెండు పోస్టులను తాలిబాన్ స్వాధీనం చేసుకుంది. భారీ ఆయుధాలను ఉపయోగించి, తాలిబాన్ సైనికులు డ్యూరాండ్ లైన్లో ఉన్న పాకిస్థానీ సైన్యం యొక్క అనేక పోస్టులను తగలబెట్టారు. 19 మంది పాక్ ఆర్మీ సైనికులు మరణించారు. మిగిలిన వారు పారిపోయారు. గోజ్గర్హి, మాతా సంగర్, కోట్ రాఘా, తారీ మెంగల్ ప్రాంతాల్లోకి తాలిబన్ ఫైటర్లు ప్రవేశించి భారీగా కాల్పులు జరుపుతున్నారు. మరోవైపు ఖుర్రం, ఉత్తర వజీరిస్థాన్లలో చొరబాటు ప్రయత్నాలను భగ్నం చేసినట్లు పాక్ సైన్యం తెలిపింది.
డురాండ్ రేఖను దాటి..
ఆఫ్ఘన్ తాలిబాన్ యోధులు డురాండ్ రేఖను దాటి పాకిస్థాన్లోకి ప్రవేశించి పాక్ ఆర్మీ పోస్టులను లక్ష్యంగా చేసుకున్నారు. పోస్టులపై గుండ్లు పేలుస్తున్నారు. వాస్తవానికి.. ఆఫ్ఘనిస్తాన్ -పాకిస్థాన్ మధ్య 2640 కి.మీ పొడవైన అంతర్జాతీయ సరిహద్దు పేరు డ్యూరాండ్ లైన్. ఈ రేఖ పష్టూన్ గిరిజన ప్రాంతం, దక్షిణాన బలూచిస్తాన్ గుండా వెళుతుంది. ఇది పష్తూన్లు , బలూచ్లను రెండు దేశాలుగా విభజిస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సరిహద్దుగా కూడా పరిగణించారు.
తాజావార్తలు
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కలకలం.. బెన్ స్టోక్స్పై వేటు తప్పదా?
-
Obsession Heroine : ‘అబ్సెషన్’ గర్ల్ను పరిచయం చేసింది మన దర్శకుడే !
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
ట్రెండింగ్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?