Pak Hikes Fuel Prices: పాక్ ప్రజలపై మరో బాంబ్.. లీటరు పెట్రోల్ ధర రూ.272
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pak Hikes Fuel Prices: ఆర్థిక సంక్షోభం పాకిస్థాన్ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాక్ ప్రజలపై మరో బాంబు పేలింది. ఆ దేశ ప్రభుత్వం ఇంధన ధరలను భారీగా పెంచింది. గతనెల 29న లీటర్ డీజిల్, పెట్రోల్పై రూ.35 చొప్పున పెంచిన షెహబాజ్ షరీఫ్ సర్కారు.. తాజాగా పెట్రోల్పై రూ.22.20, హై స్పీడ్ డీజిల్పై రూ.17.20, కిరోసిన్పై రూ.12.90 చొప్పున వడ్డించింది. పాక్ రూపాయి విలువ దారుణంగా పడిపోవడంతో పెట్రోల్, డీజిల్తోపాటు నిత్యావసర పదార్థాల ధరలు పాకిస్థాన్లో ఆకాశాన్నంటాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఏఎంఎఫ్)తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మినీ బడ్జెట్ను ప్రవేశపెట్టిన కొద్దిగంటల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం గమనార్హం. పాకిస్తాన్ బుధవారం రాత్రి పెట్రోల్, గ్యాస్ ధరలను చారిత్రాత్మక గరిష్ట స్థాయికి పెంచింది,
పెట్రోలు ధర 22.20 రూపాయలు పెరిగిన తర్వాత లీటరుకు రూ. 272కు పెంచబడింది, డాలర్తో రూపాయి విలువ క్షీణించడం వల్ల ఈ పెరుగుదల చోటుచేసుకుందని ఆర్థిక విభాగం నుంచి ఓ పత్రికా ప్రకటన వెలువడింది. 17.20 రూపాయల పెంపు తర్వాత హైస్పీడ్ డీజిల్ ధర లీటరుకు 280 రూపాయలకు పెరిగింది. 12.90 రూపాయల పెంపు తర్వాత కిరోసిన్ నూనె ఇప్పుడు లీటరుకు 202.73 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. కాగా, తేలికపాటి డీజిల్ ఆయిల్ 9.68 రూపాయలు పెరిగిన తర్వాత లీటరుకు 196.68 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. కొత్త ధరలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయని తెలిసింది.
Also Read
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
Philippines: ఫిలిప్పీన్స్లో భూకంపం.. 80కి పైగా ప్రకంపనలు
మూడీస్ అనలిటిక్స్తో సంబంధం ఉన్న సీనియర్ ఆర్థికవేత్త కత్రీనా ఎల్, 2023 ప్రథమార్థంలో పాకిస్థాన్లో ద్రవ్యోల్బణం సగటున 33 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. “మినీ-బడ్జెట్” ద్వారా, పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ (PDM) నేతృత్వంలోని సమాఖ్య ప్రభుత్వం బడ్జెట్ లోటును తగ్గించడం, పన్నుల వసూళ్లను విస్తృతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (FBR) 115 బిలియన్ రూపాయల విలువైన పన్నులను వసూలు చేయడానికి ప్రామాణిక 17 శాతం సాధారణ అమ్మకపు పన్ను (GST)ని 18 శాతానికి పెంచుతూ ఎస్ఆర్వో జారీ చేసింది. పాక్కు నిధుల విడుదల కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి.. ఆర్థిక క్రమశిక్షణ పేరిట పాక్ ప్రభుత్వానికి పలు నిబంధనలు విధించింది. ఇందులో భాగంగా పాకిస్థాన్ ప్రభుత్వం ఇటీవలి మినీ బడ్జెట్లో పన్నులను పెంచింది. తాజాగా ఇంధన ధరలూ భారీగా పెంచడంతో పాక్ ప్రజల లబోదిబోమంటున్నారు.
తాజావార్తలు
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. రెండో ఈవెంట్కు ముఖ్య అతిథిగా నాగ చైతన్య ?
-
Infinix Hot 70 Pro: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో రిలీజ్.. డ్యూయల్ డిస్ప్లే, 144Hz స్క్రీన్, 6000mAh బ్యాటరీ
-
RAW NTR: ‘ఊరు–వాడ’ కార్యక్రమంపై ‘రా ఎన్టీఆర్’ కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
Potti Sriramulu’s Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!