పాకిస్తాన్ మూడు వైపుల నుంచి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ తన పశ్చిమ సరిహద్దులో భారతదేశంతో శత్రుత్వంతో ఉండగా.. ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించిన తాలిబాన్ ఉత్తర సరిహద్దులో ఆయుధాలతో నిలబడి ఉంది. ఈశాన్య సరిహద్దులో ఇరాన్తో పాకిస్థాన్ శత్రుత్వం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
ఆర్థిక సంక్షోభం పాకిస్థాన్ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాక్ ప్రజలపై మరో బాంబు పేలింది. ఆ దేశ ప్రభుత్వం ఇంధన ధరలను భారీగా పెంచింది.