Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. అతికిరాతకంగా పర్యాటకులను ఉగ్రవాదులు చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. తాజాగా ఎన్ఐఏ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. పహల్గాం ఉగ్రవాద దాడిలో కేవలం ముగ్గురు ఉగ్రవాదులు మాత్రమే పాల్గొన్నారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఇక్కడ మరో సంచలన విషయం ఏమిటంటే ఆ ముగ్గురికి ఆశ్రయం ఇచ్చిన స్థానికులకు వారు రూ.3 వేలు మాత్రమే ఇచ్చారు. వారికి సాయం చేసిన ఇద్దరు స్థానికులను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు.
READ ALSO: Pawan kalyan: ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ భేటీ.. మూడు తీర్మానాలకు ఆమోదం!
Also Read
- IMD Monsoon Forecast: రైతన్నలకు చేదు వార్త.. ఆగస్టు, సెప్టెంబర్లలో తగ్గనున్న వర్షాలు..
- Fuel Prices: తగ్గిన LPG ధరలు.. మరి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? క్లారిటీ ఇదిగో..
- Ruchika Singh: "నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి".. ప్రధానిని దూషించిన విద్యార్థిని వీడియో విడుదల
- Jio Annual Plan: జియో వార్షిక ప్లాన్తో అదిరిపోయే ఆఫర్.. అన్లిమిటెడ్ 5జీతో పాటు AI, OTT సబ్స్క్రిప్షన్లు ఉచితం
ఇలా బయటపడ్డారు..
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) షాకింగ్ రహస్యాలను వెల్లడించింది. ఈ కుట్ర రహస్యాన్ని డిజిటల్ ఆధారాలు బయటపెట్టాయి. ఈసందర్భంగా పలువురు ఎన్ఐఏ అధికారులు మాట్లాడుతూ.. ఈ దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు మాత్రమే ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ ఉగ్రవాదులకు స్థానిక స్థాయిలో కూడా సహాయం లభించింది. దీని కోసం వారు కేవలం రూ.3000 మాత్రమే ఖర్చు చేశారు. భద్రతా దళాల ప్రతిస్పందనలో జాప్యాన్ని సద్వినియోగం చేసుకోవడం, ప్రజల్లో భయాన్ని వ్యాప్తి చేయడమే ఈ దాడి లక్ష్యమని అన్నారు. NIA అధికారులు ఉగ్రవాదుల నుంచి అనేక డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనితో పాటు దాడి చేసిన స్థలం నుంచి లభించిన ఆధారాలు ఉగ్రవాదుల దగ్గర ఉన్న పరికరాలతో సరిపోలుతున్నాయి. ఈ సాంకేతిక ఆధారాలు దాడి చాలా బాగా ప్రణాళికాబద్ధంగా జరిగిందని రుజువు చేస్తున్నాయని చెప్పారు. ఉగ్రవాదులు పహల్గాంను లక్ష్యంగా చేసుకోడానికి వెనుక కారణం.. ఈ ప్రాంతం నగరానికి దూరంగా ఉండటం, పర్యాటకులతో నిండి ఉండటం అని అన్నారు.
ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఇద్దరు స్థానికులకు ఈ పని కోసం కేవలం రూ. 3000 మాత్రమే లభించిందని దర్యాప్తులో వెల్లడైంది. నిందితులిద్దరినీ NIA అరెస్టు చేసి ప్రశ్నిస్తోంది. స్థానికుల సహాయం లేకుండా ఉగ్రవాదులు ఇంత పెద్ద దాడి చేసి ఉండేవారు కాదని ఎన్ఐఏ అధికారులు అంటున్నారు. ఉగ్రవాది హషీం మూసా పాత్రపై కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. హషీం ప్రస్తుతం లోయలో చురుకైన ఉగ్రవాద ముఠాకు నాయకుడు. ఈ దాడి కుట్ర, ప్రణాళికలో అతను ముఖ్యమైన పాత్ర పోషించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం, హషీం ముసా పాత్ర, డిజిటల్ ఆధారాల ఆధారంగా మొత్తం కుట్రను బట్టబయలు చేయడంలో NIA బిజీగా ఉంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థ చెబుతోంది.
READ ALSO: Kim Jong Un’s Bulletproof Train: ఇది కదిలే కమాండ్ సెంటర్.. ఉత్తర కొరియా నియంత స్పెషల్ ట్రైన్
తాజావార్తలు
-
Operation Sindoor: 88 గంటల సీక్రెట్ మిషన్.. ‘ఆపరేషన్ సింధూర్’పై డాక్యుమెంటరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Pakistan: పక్క దేశంలో అసలేం జరుగుతోంది? పాకిస్థాన్లో పాలకులకు ఆర్మీతో పడట్లేదా?
-
August 2026 Smartphone Launches: గూగుల్ పిక్సెల్ 11 నుంచి పోకో ఎం8 పవర్ వరకు.. ఆగస్టులో రానున్న కొత్త ఫోన్లు
-
IMD Monsoon Forecast: రైతన్నలకు చేదు వార్త.. ఆగస్టు, సెప్టెంబర్లలో తగ్గనున్న వర్షాలు..
-
Jr NTR : ‘డ్రాగన్’ షూటింగ్కు బ్రేక్.. ఎన్టీఆర్ గాయం కారణంగా శ్రీలంక షెడ్యూల్ రద్దు
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!