CM Revanth Reddy : పద్మవిభూషణ్ నాగేశ్వర రెడ్డి భారత రత్నకు కూడా అర్హుడు
- పద్మవిభూషణ్ నాగేశ్వర రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సన్మానం
- తెలంగాణ హెల్త్ టూరిజం పాలసీ త్వరలో అమలులోకి
- రాష్ట్రాన్ని హెల్త్ హబ్గా మార్చే దిశగా ప్రభుత్వ ప్రణాళికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : పద్మవిభూషణ్ అవార్డు గ్రహిత, ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర రెడ్డిని సన్మానించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు జాతి నుంచి ఒక డాక్టర్గా అరుదైన గౌరవాన్ని పొందిన వ్యక్తిగా నాగేశ్వర రెడ్డిని అభివర్ణించారు. “నాగేశ్వర రెడ్డి గారు భారతదేశానికి అపార సేవలు అందించారు. ఆయన ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్, మరియు తాజాగా పద్మవిభూషణ్ అవార్డులను గెలుచుకున్నారు. నిజానికి, ఆయన భారత రత్నకు కూడా అర్హుడు.”
“తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో హెల్త్ టూరిజం పాలసీని తీసుకురాబోతోంది. ఇది కేవలం రాష్ట్ర ప్రజల కోసమే కాకుండా, ఇతర దేశాల నుంచి వచ్చే వారికి కూడా మెరుగైన వైద్య సేవలను అందించేందుకు దోహదం చేస్తుంది. తెలంగాణను ఒక హెల్త్ హబ్గా అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. దేశంలో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మేము ఇప్పుడు ఆరోగ్యశ్రీ పరిమితిని ₹10 లక్షల వరకు పెంచి, మరింత మంది పేదలకు వైద్య సేవలు అందిస్తున్నాం.”
Also Read
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
“గతంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ ఉండేవారు. కానీ ఇప్పటి తరంలో ఆ విధానం కనుమరుగైంది. మేము మళ్లీ అదే విధానాన్ని తెస్తున్నాం. కుటుంబ సభ్యుడిలా ధైర్యాన్ని నింపే వైద్యుల అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ హెల్త్ ప్రొఫైల్ కలిగిన ప్రత్యేకమైన కార్డులు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.” అని ఆయన అన్నారు.
భవిష్యత్తులో డేటా అత్యంత విలువైన ఆస్తిగా మారబోతోంది. వైద్య సేవలకు సంబంధించి మరింత విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని అనుకుంటున్నాం. వెయ్యి ఎకరాల్లో, ఎయిర్ పోర్టు సమీపంలో, తెలంగాణలో హెల్త్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఇది వైద్య సేవలకు ఒక ప్రధాన కేంద్రంగా మారుతుంది. తెలంగాణను హెల్త్ హబ్గా అభివృద్ధి చేసేందుకు డాక్టర్ నాగేశ్వర రెడ్డి వంటి వైద్య నిపుణుల సహకారం అత్యంత కీలకం. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేస్తోందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
England: ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు విఫలం.. కెప్టెన్సీకి బట్లర్ రాజీనామా
తాజావార్తలు
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!