Paddy Procurement : నిజామాబాద్లో ధాన్యం దిబ్బలు.. రైతుల కన్నీళ్లు.. లారీల మాయాజాలంలో అన్నదాత అగచాట్లు..!
- లారీలు లేక ధరించని ధాన్యం.. రైతుల గుండెల్లో ఆందోళన
- కృత్రిమ కొరత కుట్ర.. నల్లమట్టి, ఇసుక వ్యాపారాలకే లారీలు
- పంట మట్టిపాలుకాక ముందు అధికారులు స్పందిస్తారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paddy Procurement : నిజామాబాద్ జిల్లాలో అన్నదాతలు పండించిన బంగారం కుప్పలుతెప్పలుగా కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయింది. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ ధాన్యం రాశులు కళ్లెదుటే క్షీణిస్తుంటే రైతుల గుండెలు మాత్రం ఆందోళనతో కొట్టుకుంటున్నాయి. దీనికి కారణం లారీల కొరత.. ధాన్యాన్ని తరలించేందుకు లారీలు అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు కేంద్రాలు ధాన్యం కుప్పలతో నిండిపోయాయి. రోజుల తరబడి రైతులు తమ ధాన్యంతో పడిగాపులు కాస్తున్నా, పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
దీని వెనుక అసలు కథ వేరే ఉంది.. లారీ కాంట్రాక్టర్లు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ధాన్యం తరలింపునకు వినియోగించాల్సిన లారీలను నల్ల మట్టి, ఇసుక వంటి ఇతర వ్యాపారాలకు మళ్లిస్తుండటంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాన్ని, నష్టాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడుతున్నారు.
Also Read
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
- 19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
ఒక్కో గింజను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఎన్నో కష్టనష్టాలకోర్చి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు పడుతున్న బాధ వర్ణనాతీతం. సమయానికి ధాన్యం తరలింపు జరగకపోవడంతో నాణ్యత తగ్గిపోతోంది. మరోవైపు అప్పులు తెచ్చి వ్యవసాయం చేసిన రైతులు వాటిని తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది బాగానే ఉంది. కానీ, ధాన్యం తరలింపునకు సరైన వ్యవస్థ లేకపోతే ఈ కేంద్రాలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి..? లారీ కాంట్రాక్టర్ల స్వార్థపూరిత చర్యలకు అడ్డుకట్ట వేయకపోతే, రైతుల కష్టాలు ఇలాగే కొనసాగుతాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తక్షణమే లారీలను అందుబాటులోకి తెచ్చి ధాన్యం తరలింపునకు చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. లేదంటే, పండించిన పంట కళ్లెదుటే మట్టిపాలై, వారి జీవితాలు మరింత దుర్భరంగా మారే ప్రమాదం ఉంది. నిజామాబాద్ రైతుల ఆర్తనాదాలు ఉన్నతాధికారులకు వినిపిస్తాయా..? వేచి చూడాలి..!
Pahalgam Terror Attack: దాడిని ఖండిస్తూ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం
తాజావార్తలు
-
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
-
Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
-
Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!