Paddy Issue: వర్షాలతో అన్నదాతల అగచాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కష్టపడి వరి పండించిన రైతులను వర్షాలు పరేషాన్ చేస్తున్నాయి. అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమాగం అవుతున్నాడు…కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోగా మరికొన్నిచోట్ల తేమ పేరుతో ఆలస్యం కావడం కర్షకులకు కష్టాలు ఎదురౌతున్నాయి. నిర్మల్ మంచిర్యాల జిల్లాల్లో కొనుగోళ్ల పరిస్థితి రైతులను ఆందోనకు గురిచేస్తోంది.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి..ముఖ్యంగా మంచిర్యాల ,నిర్మల్ జిల్లాల్లో వరి ఎక్కువగా సాగు చేశారు.ఈరెండు జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి..అయితే మంచిర్యాల జిల్లాలో చాలా చోట్ల ఇంకా కాంటాలు కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..ముఖ్యంగా చెన్నూర్ నియోజకవర్గంలో అయితే ఏకంగా రైతులు రోడ్డుపై రాస్తారోకోలకు దిగుతున్నారు…బెల్లంపల్లి తోపాటు పలు మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
Also Read
- Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ఇప్పటికే రెండు దఫాలుగా అకాల వర్షాలు రైతుల ధాన్యం ను నీటి పాలు చేసింది..కొనుగోలు కేంద్రాల్లోని వరిధాన్యం వరదనీటిలో కొన్నిచోట్ల కొట్టుకు పోయింది. రైతులకు కనీసం టార్ఫాలిన్లు సైతం అందుబాటులో లేకపోవడం కల్లాల్లో ధాన్యం తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో లక్ష 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయగా మొత్తం 43 రైస్ మిల్లులున్నాయి. 185 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో కొన్ని చోట్ల ఇంకా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ఈసారి యాసంగి మంచిర్యాల జిల్లాలో 72 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా 221 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.అయితే ఇందులో సగం కేంద్రాలు సైతం ప్రారంభం కాకపోగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
కొన్ని చోట్ల గన్నీ బ్యాగ్ లు,మరికొన్ని చోట్ల టార్ఫాలిన్లు లేక అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బందిపడుతున్నారు..పొద్దంతా కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు నేర్పుతూ సాయంత్రం అయితే మళ్లీ కుప్పగా పోస్తూ కవర్లు కప్పేస్తూ తిప్పలు పడుతున్నారు..సకాలంలో కొనుగోలు చేయాల్సిన అధికారులు కాలయాసన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. కొన్ని చోట్ల సన్నవరి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటున్నారు రైతులు,.
ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంట వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలంటున్నారు రైతులు. తీవ్రమైన గాలులు,ఇంకో వైపు ఎండలతో కేంద్రాల వద్ద యాతన అనుభవిస్తున్నామంటున్నారు రైతులు. అధికారులు ఏం చేస్తారో చూద్దాం.
తాజావార్తలు
-
RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
-
Kodak QLED SE 80 cm: తక్కువ ధరలో QLED అనుభవం.. Kodak స్మార్ట్ టీవీపై రూ. 10 వేల డిస్కౌంట్
-
West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
-
Online Cybersecurity Course: ఫ్రాడ్గాళ్లకు చెక్.. ఈ 150నిమిషాల ఫ్రీ కోర్సు నేర్చుకుంటే మీ జేబు చాలా సేఫ్!
-
IPL 2026 Prize Money: ఛాంపియన్కు రూ.20 కోట్లు.. మరి SRH, రాజస్థాన్ జట్లకు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే?
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!