OYO : అత్యధికంగా ఓయో బుక్ చేసుకున్న నగరాలు ఇవే.. హైదరాబాద్ టాప్?
- ఓయో ట్రావెలోపీడియా 2024 నివేదిక విడుదల
- మతపరమైన పర్యాటకంపై ప్రాధాన్యత
- బుకింగ్స్లో హైదరాబాద్ టాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరి కొన్ని రోజుల్లో 2024 సంవత్సరం ముగియనుంది. ఏడాది ఆఖరులో ఓయో ఓ నివేదికను విడుదల చేసింది. అత్యధికంగా ఓయో బుకింగ్లు జరిగిన నగరాల పేర్లను వెల్లడించింది. ట్రావెలోపీడియా 2024′ నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం భారతదేశంలో మతపరమైన పర్యాటకంపై ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పూరీ, వారణాసి, హరిద్వార్ ప్రముఖ ఆధ్యాత్మిక గమ్యస్థానాలుగా నిలిచాయి. వీటితో పాటు దేవఘర్, పళని, గోవర్ధన్లలో కూడా గణనీయమైన వృద్ధి కనిపించింది.
READ MORE: CM Chandrababu: ప్రధాని మోడీ, రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్తో సీఎం చంద్రబాబు భేటీ
Also Read
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
ఇదిలా ఉండగా.. బుకింగ్స్లో మాత్రం హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత.. బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా వంటి నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రయాణించడానికి అత్యంత ప్రజాదరణ పొందిన రాష్ట్రంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక ప్రయాణ దృశ్యాలకు పర్యాటక రంగాలకు అనువుగా ఉన్నాయి. పాట్నా, రాజమండ్రి, హుబ్లీ వంటి చిన్న నగరాల్లో ఈ ఏడాది బుకింగ్లు 48 శాతం వరకు పెరిగాయి. “ఈ సంవత్సరం సెలవుల సమయంలో ప్రయాణ కార్యకలాపాలు కూడా పెరిగాయని ఓయో తెలిపింది. గోవా, పుదుచ్చేరి, మైసూర్ వంటి ఎవర్గ్రీన్ గమ్యస్థానాల తర్వాత జైపూర్ పర్యాటక కేంద్రంగా కొనసాగుతోంది. అయితే ముంబైలో బుకింగ్స్ తగ్గుముఖం పట్టాయి. ఓయో గ్లోబల్ చీఫ్ సర్వీసెస్ ఆఫీసర్ శ్రీరంగ్ గాడ్బోలే మాట్లాడుతూ.. ఈ ఏడాది పర్యాటక రంగా అభివృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. పని ఒత్తిడి తదితర కారణాల వల్ల చాలా మంది మానసిక ప్రశాంతత కోసం తమకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లినట్లు తెలిపారు.
READ MORE: Maruti e Vitara: అడ్వాన్స్డ్ ఫీచర్స్, అద్భుతమైన బ్యాటరీ ప్యాక్.. లాంచ్ ఎప్పుడంటే..?
2012లో స్థాపించబడిన ఓయో.. భారత స్టార్టప్ కంపెనీల్లో ఓ సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఏ చిన్న పట్టణానికి వెళ్లినా ఓయో రూమ్స్ దర్శనమిస్తున్నాయి. కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు రాత్రి పూట ఒకవేళ బస చేయాల్సి వస్తే టక్కున గుర్తొచ్చేదీ ఓయోనే. అనతికాలంలోనే అంతగా పాపులారిటీ సంపాదించుకుంది ఈ స్టార్టప్. దీని వెనుక ఓ యువకుడి కృషి, పట్టుదల దాగి ఉన్నాయి. అతడే రితేశ్ అగర్వాల్. ఈయనే ప్రస్తుతం ఓయో సీఈఓగా కొనసాగుతున్నరు.
తాజావార్తలు
-
Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్కు సూర్యకుమార్ యాదవ్ గుడ్బై?.. ఇదే ప్రూఫ్!
-
Ram Gopal Varma : పెద్ద స్లార్లకు, భారీ బడ్జెట్ డైరెక్టర్లకు RGV కౌంటర్… హాలీవుడ్ హారర్ పై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
-
Today Gold and Silver Prices: బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవిగో.. తగ్గాయా? పెరిగాయా?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!