OYO : అత్యధికంగా ఓయో బుక్ చేసుకున్న నగరాలు ఇవే.. హైదరాబాద్ టాప్?
- ఓయో ట్రావెలోపీడియా 2024 నివేదిక విడుదల
- మతపరమైన పర్యాటకంపై ప్రాధాన్యత
- బుకింగ్స్లో హైదరాబాద్ టాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరి కొన్ని రోజుల్లో 2024 సంవత్సరం ముగియనుంది. ఏడాది ఆఖరులో ఓయో ఓ నివేదికను విడుదల చేసింది. అత్యధికంగా ఓయో బుకింగ్లు జరిగిన నగరాల పేర్లను వెల్లడించింది. ట్రావెలోపీడియా 2024′ నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం భారతదేశంలో మతపరమైన పర్యాటకంపై ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పూరీ, వారణాసి, హరిద్వార్ ప్రముఖ ఆధ్యాత్మిక గమ్యస్థానాలుగా నిలిచాయి. వీటితో పాటు దేవఘర్, పళని, గోవర్ధన్లలో కూడా గణనీయమైన వృద్ధి కనిపించింది.
READ MORE: CM Chandrababu: ప్రధాని మోడీ, రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్తో సీఎం చంద్రబాబు భేటీ
Also Read
- 2027 వరల్డ్కప్కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
- Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
- Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
- AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
ఇదిలా ఉండగా.. బుకింగ్స్లో మాత్రం హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత.. బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా వంటి నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రయాణించడానికి అత్యంత ప్రజాదరణ పొందిన రాష్ట్రంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక ప్రయాణ దృశ్యాలకు పర్యాటక రంగాలకు అనువుగా ఉన్నాయి. పాట్నా, రాజమండ్రి, హుబ్లీ వంటి చిన్న నగరాల్లో ఈ ఏడాది బుకింగ్లు 48 శాతం వరకు పెరిగాయి. “ఈ సంవత్సరం సెలవుల సమయంలో ప్రయాణ కార్యకలాపాలు కూడా పెరిగాయని ఓయో తెలిపింది. గోవా, పుదుచ్చేరి, మైసూర్ వంటి ఎవర్గ్రీన్ గమ్యస్థానాల తర్వాత జైపూర్ పర్యాటక కేంద్రంగా కొనసాగుతోంది. అయితే ముంబైలో బుకింగ్స్ తగ్గుముఖం పట్టాయి. ఓయో గ్లోబల్ చీఫ్ సర్వీసెస్ ఆఫీసర్ శ్రీరంగ్ గాడ్బోలే మాట్లాడుతూ.. ఈ ఏడాది పర్యాటక రంగా అభివృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. పని ఒత్తిడి తదితర కారణాల వల్ల చాలా మంది మానసిక ప్రశాంతత కోసం తమకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లినట్లు తెలిపారు.
READ MORE: Maruti e Vitara: అడ్వాన్స్డ్ ఫీచర్స్, అద్భుతమైన బ్యాటరీ ప్యాక్.. లాంచ్ ఎప్పుడంటే..?
2012లో స్థాపించబడిన ఓయో.. భారత స్టార్టప్ కంపెనీల్లో ఓ సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఏ చిన్న పట్టణానికి వెళ్లినా ఓయో రూమ్స్ దర్శనమిస్తున్నాయి. కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు రాత్రి పూట ఒకవేళ బస చేయాల్సి వస్తే టక్కున గుర్తొచ్చేదీ ఓయోనే. అనతికాలంలోనే అంతగా పాపులారిటీ సంపాదించుకుంది ఈ స్టార్టప్. దీని వెనుక ఓ యువకుడి కృషి, పట్టుదల దాగి ఉన్నాయి. అతడే రితేశ్ అగర్వాల్. ఈయనే ప్రస్తుతం ఓయో సీఈఓగా కొనసాగుతున్నరు.
తాజావార్తలు
-
2027 వరల్డ్కప్కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
-
Avengers Doomsday : అవెంజర్స్ డూమ్స్ డే తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. థోర్ మాస్ విధ్వంసం
-
Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
-
Chennai LoveStory : ‘చెన్నై లవ్స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
-
Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!