OYO : అత్యధికంగా ఓయో బుక్ చేసుకున్న నగరాలు ఇవే.. హైదరాబాద్ టాప్?
- ఓయో ట్రావెలోపీడియా 2024 నివేదిక విడుదల
- మతపరమైన పర్యాటకంపై ప్రాధాన్యత
- బుకింగ్స్లో హైదరాబాద్ టాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరి కొన్ని రోజుల్లో 2024 సంవత్సరం ముగియనుంది. ఏడాది ఆఖరులో ఓయో ఓ నివేదికను విడుదల చేసింది. అత్యధికంగా ఓయో బుకింగ్లు జరిగిన నగరాల పేర్లను వెల్లడించింది. ట్రావెలోపీడియా 2024′ నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం భారతదేశంలో మతపరమైన పర్యాటకంపై ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పూరీ, వారణాసి, హరిద్వార్ ప్రముఖ ఆధ్యాత్మిక గమ్యస్థానాలుగా నిలిచాయి. వీటితో పాటు దేవఘర్, పళని, గోవర్ధన్లలో కూడా గణనీయమైన వృద్ధి కనిపించింది.
READ MORE: CM Chandrababu: ప్రధాని మోడీ, రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్తో సీఎం చంద్రబాబు భేటీ
Also Read
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
- Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
- PBSK Vs MI: ఐపీఎల్లో పంజాబ్ అరుదైన రికార్డు.. ఒక్క ఇన్నింగ్స్తో ఆ రికార్డులన్నీ పటాపంచల్..
ఇదిలా ఉండగా.. బుకింగ్స్లో మాత్రం హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత.. బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా వంటి నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రయాణించడానికి అత్యంత ప్రజాదరణ పొందిన రాష్ట్రంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక ప్రయాణ దృశ్యాలకు పర్యాటక రంగాలకు అనువుగా ఉన్నాయి. పాట్నా, రాజమండ్రి, హుబ్లీ వంటి చిన్న నగరాల్లో ఈ ఏడాది బుకింగ్లు 48 శాతం వరకు పెరిగాయి. “ఈ సంవత్సరం సెలవుల సమయంలో ప్రయాణ కార్యకలాపాలు కూడా పెరిగాయని ఓయో తెలిపింది. గోవా, పుదుచ్చేరి, మైసూర్ వంటి ఎవర్గ్రీన్ గమ్యస్థానాల తర్వాత జైపూర్ పర్యాటక కేంద్రంగా కొనసాగుతోంది. అయితే ముంబైలో బుకింగ్స్ తగ్గుముఖం పట్టాయి. ఓయో గ్లోబల్ చీఫ్ సర్వీసెస్ ఆఫీసర్ శ్రీరంగ్ గాడ్బోలే మాట్లాడుతూ.. ఈ ఏడాది పర్యాటక రంగా అభివృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. పని ఒత్తిడి తదితర కారణాల వల్ల చాలా మంది మానసిక ప్రశాంతత కోసం తమకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లినట్లు తెలిపారు.
READ MORE: Maruti e Vitara: అడ్వాన్స్డ్ ఫీచర్స్, అద్భుతమైన బ్యాటరీ ప్యాక్.. లాంచ్ ఎప్పుడంటే..?
2012లో స్థాపించబడిన ఓయో.. భారత స్టార్టప్ కంపెనీల్లో ఓ సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఏ చిన్న పట్టణానికి వెళ్లినా ఓయో రూమ్స్ దర్శనమిస్తున్నాయి. కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు రాత్రి పూట ఒకవేళ బస చేయాల్సి వస్తే టక్కున గుర్తొచ్చేదీ ఓయోనే. అనతికాలంలోనే అంతగా పాపులారిటీ సంపాదించుకుంది ఈ స్టార్టప్. దీని వెనుక ఓ యువకుడి కృషి, పట్టుదల దాగి ఉన్నాయి. అతడే రితేశ్ అగర్వాల్. ఈయనే ప్రస్తుతం ఓయో సీఈఓగా కొనసాగుతున్నరు.
తాజావార్తలు
-
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
-
Bajirao Peshwa : గెరిల్లా వార్లో దిట్ట.. బాజీరావు స్టైల్ ఇదే.!
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
-
Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Work From Home ఇచ్చేందుకు కంపెనీలు సుముకంగాలేవా..?
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!