OYO : అత్యధికంగా ఓయో బుక్ చేసుకున్న నగరాలు ఇవే.. హైదరాబాద్ టాప్?
- ఓయో ట్రావెలోపీడియా 2024 నివేదిక విడుదల
- మతపరమైన పర్యాటకంపై ప్రాధాన్యత
- బుకింగ్స్లో హైదరాబాద్ టాప్
మరి కొన్ని రోజుల్లో 2024 సంవత్సరం ముగియనుంది. ఏడాది ఆఖరులో ఓయో ఓ నివేదికను విడుదల చేసింది. అత్యధికంగా ఓయో బుకింగ్లు జరిగిన నగరాల పేర్లను వెల్లడించింది. ట్రావెలోపీడియా 2024′ నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం భారతదేశంలో మతపరమైన పర్యాటకంపై ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పూరీ, వారణాసి, హరిద్వార్ ప్రముఖ ఆధ్యాత్మిక గమ్యస్థానాలుగా నిలిచాయి. వీటితో పాటు దేవఘర్, పళని, గోవర్ధన్లలో కూడా గణనీయమైన వృద్ధి కనిపించింది.
READ MORE: CM Chandrababu: ప్రధాని మోడీ, రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్తో సీఎం చంద్రబాబు భేటీ
Also Read
- Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
- మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
- Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
- KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
ఇదిలా ఉండగా.. బుకింగ్స్లో మాత్రం హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత.. బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా వంటి నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రయాణించడానికి అత్యంత ప్రజాదరణ పొందిన రాష్ట్రంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక ప్రయాణ దృశ్యాలకు పర్యాటక రంగాలకు అనువుగా ఉన్నాయి. పాట్నా, రాజమండ్రి, హుబ్లీ వంటి చిన్న నగరాల్లో ఈ ఏడాది బుకింగ్లు 48 శాతం వరకు పెరిగాయి. “ఈ సంవత్సరం సెలవుల సమయంలో ప్రయాణ కార్యకలాపాలు కూడా పెరిగాయని ఓయో తెలిపింది. గోవా, పుదుచ్చేరి, మైసూర్ వంటి ఎవర్గ్రీన్ గమ్యస్థానాల తర్వాత జైపూర్ పర్యాటక కేంద్రంగా కొనసాగుతోంది. అయితే ముంబైలో బుకింగ్స్ తగ్గుముఖం పట్టాయి. ఓయో గ్లోబల్ చీఫ్ సర్వీసెస్ ఆఫీసర్ శ్రీరంగ్ గాడ్బోలే మాట్లాడుతూ.. ఈ ఏడాది పర్యాటక రంగా అభివృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. పని ఒత్తిడి తదితర కారణాల వల్ల చాలా మంది మానసిక ప్రశాంతత కోసం తమకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లినట్లు తెలిపారు.
READ MORE: Maruti e Vitara: అడ్వాన్స్డ్ ఫీచర్స్, అద్భుతమైన బ్యాటరీ ప్యాక్.. లాంచ్ ఎప్పుడంటే..?
2012లో స్థాపించబడిన ఓయో.. భారత స్టార్టప్ కంపెనీల్లో ఓ సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఏ చిన్న పట్టణానికి వెళ్లినా ఓయో రూమ్స్ దర్శనమిస్తున్నాయి. కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు రాత్రి పూట ఒకవేళ బస చేయాల్సి వస్తే టక్కున గుర్తొచ్చేదీ ఓయోనే. అనతికాలంలోనే అంతగా పాపులారిటీ సంపాదించుకుంది ఈ స్టార్టప్. దీని వెనుక ఓ యువకుడి కృషి, పట్టుదల దాగి ఉన్నాయి. అతడే రితేశ్ అగర్వాల్. ఈయనే ప్రస్తుతం ఓయో సీఈఓగా కొనసాగుతున్నరు.
తాజావార్తలు
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
-
మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
-
Salman Khan-RR: సారీ భాయ్, ఈ రోజు కాదు.. సల్మాన్ ఖాన్ పోస్ట్కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై!
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో