Pakistan: మహిళలు, పిల్లలపై పెరిగిన హింస.. 4 నెలల్లో 900కు పైగా హింసాత్మక కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఈ ఏడాది ప్రారంభం నుంచి పాకిస్తాన్లో మహిళలు, పిల్లలపై నేరాలకు సంబంధించిన నివేదిక ఒకటి వెలుగులోకి వచ్చింది. సస్టైనబుల్ సోషల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (SSDO) నివేదిక ప్రకారం, ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో మహిళలు, పిల్లలపై హింసకు సంబంధించి 900 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
మహిళలు, పిల్లలపై కేసులు పెరిగాయి..
ఈ నివేదిక ప్రకారం, ఈ నాలుగు నెలల్లో 529 మంది మహిళలు అపహరణకు గురయ్యారు. 119 గృహ హింస కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు 56 అత్యాచార కేసులు, 37 పరువు హత్య కేసులు నమోదయ్యాయి. కరాచీ సెంట్రల్, హైదరాబాద్, కెమారి జిల్లాలు మహిళలపై హింసాత్మక నేరాలకు హాట్స్పాట్లుగా మారాయి. చిన్నారులపై నమోదైన కేసుల్లో లైంగిక వేధింపుల కేసులు అత్యధికం కాగా, ఇప్పటివరకు దాదాపు 67 కేసులు నమోదయ్యాయి. పౌరులందరికీ, ముఖ్యంగా మహిళలు, పిల్లల భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం, పోలీసులు, న్యాయవ్యవస్థ మరింత శ్రద్ధ వహించాలని, చర్యలు తీసుకోవాలని నివేదిక కోరింది.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
Also Read: MS Dhoni: విమానంలో ధోనికి చాక్లెట్ ఇచ్చిన ఎయిర్ హోస్టెస్.. వైరల్ అవుతున్న వీడియో..!
కూతురిపై అత్యాచారం చేసిన కన్నతండ్రి
పాకిస్థాన్లోని నోరావాల్లోని సియాల్కోట్ జిల్లాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి, సియాల్కోట్ జిల్లాలోని పస్రూర్ తహసీల్లోని బని సిల్హరియన్ గ్రామంలో ఒక వ్యక్తి తన సొంత కుమార్తెపై అత్యాచారం చేశాడు, దీనికి నిందితుడైన తండ్రికి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి మరణశిక్ష విధించారు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి 2022 జూన్ 21న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత నిందితుడు నజీమ్ అలీపై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే స్పందించిన జిల్లా పోలీసు అధికారి ముహమ్మద్ హసన్ ఇక్బాల్ నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఆ తర్వాత, నిందితుడైన తండ్రిని పస్రూర్లోని అదనపు జిల్లా, సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ విచారణ తర్వాత, న్యాయమూర్తి ఉమర్ ఫరూఖ్ ఖాన్ నజీమ్ను దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించారు. జరిమానా చెల్లించాలని లేదా జరిమానా చెల్లించని పక్షంలో ఆరు నెలల అదనపు జైలు శిక్ష అనుభవించాలని కూడా కోర్టు నిందితుడిని ఆదేశించింది.
Also Read: Air India Flight: ఢిల్లీకి వెళ్లాల్సిన ఫ్లైట్ ఆలస్యం.. చెన్నైలో చిక్కుకున్న 150 మంది ప్రయాణికులు
చెట్టుకు వేలాడుతున్న బాలిక మృతదేహం
పాకిస్థాన్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చాలా కాలంగా 13 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయింది. విచారణ తర్వాత, మైనర్ మృతదేహం హైదరాబాద్ శివార్లలోని కైమ్ బబ్బర్ గ్రామంలో మామిడి చెట్టుకు వేలాడుతూ కనిపించింది. బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు విచారణలో తేలింది. తొలుత ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా కొందరు బంధువులు అడ్డుకోవడంతో విచారణ ఆలస్యమైంది. అయితే, ప్రాథమిక నివేదికను ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కు పంపారు. ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేసిన హైదరాబాద్ మేయర్ కాషిఫ్ షోరో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, సత్వర న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!