MSVP OTT Release: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్లో సందడి చేయటానికి రెడీ అవుతుంది. ప్రముఖ ఓటీటీ మాధ్యమం జీ5లో ఫిబ్రవరి 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. చిరంజీవి, నయనతార జంటగా నటించిన ఈ చిత్రం, సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయిన అన్ని చిత్రాల్లో అతి పెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. దీని డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ఇప్పటికే ప్రకటించినట్లుగా జీ5లో అందుబాటులో ఉన్న అన్నీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా ఈ ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
READ ALSO: బడ్జెట్ సెగ్మెంట్లో సంచలనం.. 10000mAh బ్యాటరీతో వస్తున్న Honor X80.!
అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పవర్ఫుల్ రోల్లో మెప్పించారు. ఆయనతో పాటు వెంకటేశ్ దగ్గుబాటి, నయనతార, క్యాథరిన్ ట్రెసా తదితరులు ఇతర పాత్రల్లో అలరించారు. బలమైన ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాతో పాటు మంచి యాక్షన్ను కలగలిపి సీట్ ఎడ్జ్ డ్రామాగా, ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రూపొందించారు మేకర్స్. ఓ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (చిరంజీవి) తనకు దూరమైన కుటుంబాన్ని కాపాడుతూ ప్రేమ, బాధ్యతతో చేసే ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠి, బెంగాలి భాషల్లో ఫిబ్రవరి 11 నుంచి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
READ ALSO: Tragic Incident: అన్నం పెట్టే చెట్టుపైనే.. కల్లు గీయడానికి వెళ్లి గీత కార్మికుడు మృతి..