Orange Travels : ఆదిలాబాద్లో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Orange Travels : ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అమరావతికి వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు గుడిహత్నూర్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. రాత్రి వేళ వంకరగా ఉన్న రహదారిపై బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గట్టిపై ఢీకొంది. దీంతో బస్సు బోల్తా పడటంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అత్యవసర సేవల బృందాలు స్పందించాయి. గాయపడినవారిని సమీప ఆస్పత్రికి తరలించగా, తీవ్రమైన గాయాలున్న ఒకరిని ఆదిలాబాద్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అధిక వేగం లేదా రోడ్డు పరిస్థితులే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బస్సులో యాంత్రిక లోపాలు ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఈ ప్రమాదం ప్రైవేట్ బస్సు సేవల భద్రతాపై మరోసారి ప్రశ్నలు తీసుకొచ్చింది. గతంలో కూడా ఆరెంజ్ ట్రావెల్స్కు సంబంధించిన ప్రమాదాలు సంభవించడంతో, డ్రైవర్ల శిక్షణ, వాహన నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
Vishnu : ‘కన్నప్ప’ స్క్రిప్ట్ని తెలుగు డైరెక్టర్స్ రిజక్ట్ చేశారు.. కుండ బద్దలు కొట్టిన విష్ణు
తాజావార్తలు
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!