Opposition Parties Meeting: ముగిసిన విపక్ష పార్టీ నేతల సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో విపక్ష నేతల తొలి రోజు సమావేశం ముగిసింది. వివిధ అంశాలపై దాదాపు రెండు గంటలకు పైగా నేతలందరూ చర్చించారు. రేపు (మంగళవారం) మరోసారి భేటీ కానున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీని నిలువరించే అంశాలతో పాటు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకంగా చర్చించారు. ఇప్పటికే ఓసారి పట్నాలో విపక్షాలు మీటింగ్ జరిగింది. మహారాష్ట్రలోని ఎన్సీపీలో తిరుగుబాటు, బెంగాల్లో పంచాయతీ ఎన్నికల్లో హింసకు టీఎంసీనే కారణమంటూ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఆరోపించిన నేపథ్యంలో తాజాగా జరుగుతున్న ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పాడింది.
Read Also: MBBS Student Missing: జార్జియాలో తెలుగు విద్యార్థి అదృశ్యం
Also Read
- Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
- DMK: స్టాలిన్కు భారీ షాక్.. 9 ఏళ్ల తర్వాత డీఎంకే కూటమికి వైకో గుడ్బై
ఈసారి బెంగళూరులో జరిగిన ఈ కీలక సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, బిహార్ సీఎం నీతీశ్ కుమార్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్సోరెన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆయన కొడుకు ఆదిత్య ఠాక్రే, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎండీకే ప్రధాన కార్యదర్శి వైకోతో పాటు మొత్తం 26 పార్టీలకు చెందిన 53 మంది ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Read Also: Adivi Sesh: మళ్లీ డైరెక్షన్ చేయబోతున్న అడివి శేష్?
బెంగళూరు వేదికగా జరుగుతోన్న విపక్షాల తొలిరోజు సమావేశానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గైర్హజరు అయ్యారు. దీంతో ఆయనపై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్సీపీ క్లారిటీ ఇచ్చింది. రెండో రోజు మీటింగ్ కు తన కుమార్తె సుప్రియా సూలేతో కలిసి శరద్ పవార్ విపక్షాల భేటీకి వస్తారని తెలిపింది. అయితే, తొలి రోజు సమావేశంతో పాటు విందుకు ఎందుకు హాజరుకాలేదనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి స్టార్ట్ అవుతుండటంతో పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయడంతో పాటు సభలో జరిగే పరిణామాలను నిశితంగా పరిశీలించాలని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
-
Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
-
CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
DMK: స్టాలిన్కు భారీ షాక్.. 9 ఏళ్ల తర్వాత డీఎంకే కూటమికి వైకో గుడ్బై
ట్రెండింగ్
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!