Opposition Parties Meeting: ముగిసిన విపక్ష పార్టీ నేతల సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో విపక్ష నేతల తొలి రోజు సమావేశం ముగిసింది. వివిధ అంశాలపై దాదాపు రెండు గంటలకు పైగా నేతలందరూ చర్చించారు. రేపు (మంగళవారం) మరోసారి భేటీ కానున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీని నిలువరించే అంశాలతో పాటు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకంగా చర్చించారు. ఇప్పటికే ఓసారి పట్నాలో విపక్షాలు మీటింగ్ జరిగింది. మహారాష్ట్రలోని ఎన్సీపీలో తిరుగుబాటు, బెంగాల్లో పంచాయతీ ఎన్నికల్లో హింసకు టీఎంసీనే కారణమంటూ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఆరోపించిన నేపథ్యంలో తాజాగా జరుగుతున్న ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పాడింది.
Read Also: MBBS Student Missing: జార్జియాలో తెలుగు విద్యార్థి అదృశ్యం
Also Read
- Arjun Tendulkar విధ్వంసం.. ఆల్రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!
- Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
- Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
ఈసారి బెంగళూరులో జరిగిన ఈ కీలక సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, బిహార్ సీఎం నీతీశ్ కుమార్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్సోరెన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆయన కొడుకు ఆదిత్య ఠాక్రే, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎండీకే ప్రధాన కార్యదర్శి వైకోతో పాటు మొత్తం 26 పార్టీలకు చెందిన 53 మంది ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Read Also: Adivi Sesh: మళ్లీ డైరెక్షన్ చేయబోతున్న అడివి శేష్?
బెంగళూరు వేదికగా జరుగుతోన్న విపక్షాల తొలిరోజు సమావేశానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గైర్హజరు అయ్యారు. దీంతో ఆయనపై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్సీపీ క్లారిటీ ఇచ్చింది. రెండో రోజు మీటింగ్ కు తన కుమార్తె సుప్రియా సూలేతో కలిసి శరద్ పవార్ విపక్షాల భేటీకి వస్తారని తెలిపింది. అయితే, తొలి రోజు సమావేశంతో పాటు విందుకు ఎందుకు హాజరుకాలేదనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి స్టార్ట్ అవుతుండటంతో పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయడంతో పాటు సభలో జరిగే పరిణామాలను నిశితంగా పరిశీలించాలని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన వైభవ్ సూర్యవంశీ!
-
Arjun Tendulkar విధ్వంసం.. ఆల్రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!
-
LENIN : అఖిల్ ‘లెనిన్’ ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కలకలం.. బెన్ స్టోక్స్పై వేటు తప్పదా?
ట్రెండింగ్
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!