Farmers Protest: మిల్లులో పత్తి కొనుగోళ్లు నిలిపివేత.. రోడ్డుపై బైఠాయించిన రైతులు
- వికారాబాద్ జిల్లా రంగంపల్లి నరసింహ కాటన్ మిల్లులో పత్తి రైతుల ఆందోళన
- మిల్లు యాజమాన్యం పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers Protest: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి నరసింహ కాటన్ మిల్లులో పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. పత్తి కొనుగోలు చేయకుండా కాటన్ మిల్ యాజమాన్యం నిలిపివేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. పత్తి జిన్నింగ్ మిల్లో టెక్నికల్ సాంకేతిక లోపం రావడంతో పాటు తేమ శాతం ఎక్కువగా ఉండడంతో సీసీఐ నిబంధనల మేరకు పత్తి కొనుగోలు నిలిపివేసినట్లు పత్తి రైతులకు కాటన్ మిల్లు యాజమాన్యం తెలిపింది. హైదరాబాద్-బీజాపూర్ నేషనల్ హైవే రోడ్డుపై బైఠాయించి పత్తి రైతులు నిరసన తెలిపారు.
Read Also: MLC Botsa Satyanarayana: సిట్ రిపోర్ట్ను బహిర్గతం చేయాలి.. కేంద్రానికి లేఖ రాస్తానన్న బొత్స
Also Read
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
పత్తి రైతులు ధర్నా చేపట్టడంతో కిలోమీటర్ల మేర అటు పరిగి, హైదరాబాద్ ఇటు కొడంగల్, బీజాపూర్ రోడ్డులో భారీగా వాహనాలు నిలిచిపోగా.. ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. గ్రామాల నుంచి ట్రాక్టర్లలో పత్తిని తీసుకొని వస్తే కొనుగోలు చేయకపోవడంతో ఆందోళనకు దిగినట్టు రైతులు తెలిపారు. పోలీసుల రంగ ప్రవేశంతో ధర్నా సద్దుమణిగింది. కాటన్ మిల్ యజమాన్యంతో మాట్లాడి ఇప్పుడున్న వారి ట్రాక్టర్లలోని పత్తి లోడ్లు దింపుకొని పంపించాలని పోలీసులు కోరారు. ఇరువైపులా నిలిచిపోయిన వాహనాలను క్లియర్ చేసి పోలీసులు పంపించారు. ఈ ఒక్కరోజుకు పోలీసులు, రైతుల రిక్వెస్టు మేరకు తిరిగి కొనుగోలు చేస్తున్నట్లు కాటన్ మిల్లు యాజమాన్యం ప్రకటించింది. రేపటి నుంచి వేరేచోటకు వెళ్లాలని పత్తి రైతులకు కాటన్ మిల్లు యాజమాన్యం సూచించింది.
తాజావార్తలు
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..