Operation Rope: ట్రాఫిక్కు చెక్ పెట్టేలా ‘ఆపరేషన్ రోప్ వే’.. యాక్షన్లోకి పోలీసులు
- ఫుట్పాత్ పై ఆక్రమణలు తొలగింపు
- ఫిల్మ్నగర్ నుంచి టోలిచౌకి మెజిస్టిక్ గార్డెన్ వరకు ఆపరేషన్ రోప్ వే
- స్వయంగా ఆపరేషన్లో పాల్గొన్న సీపీ సీవీ ఆనంద్
- ట్రాఫిక్ ఇబ్బందులపై హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్ రోప్ వే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భాగ్యనగరంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సర్కార్ ఆదేశించింది. ఈ క్రమంలో.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. ఆపరేషన్ రోప్లో భాగంగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించనున్నారు పోలీసులు. ఫిల్మ్ నగర్ నుంచి టోలిచౌకి మెజెస్టిక్ గార్డెన్స్ వరకు రెండు క్యారేజ్వేలలో ఆపరేషన్ రోప్ను చేపట్టారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు, అధికారులతో కలిసి ఆపరేషన్ రోప్లో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. రోడ్డుకు అడ్డంగా ఫుట్పాత్లపై నిర్మాణాలు, షాపులను తొలగించారు. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి త్వరలో ఆపరేషన్ రోప్ నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు.
Ola Electric: ఓలా నుంచి గిగ్, ఎస్1 జెడ్ స్కూటర్లు విడుదల.. వీటిల్లో స్పెషల్ ఏంటంటే..?
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో అతి కీలకమైన డిపార్ట్మెంట్ ట్రాఫిక్.. ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించకపోతే నగరవాసులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని సీపీ తెలిపారు. హైదరాబాద్ సిటీలో వాహనాలు సంఖ్య 85 లక్షలకు చేరుకుంది.. రోడ్లు విస్తరించాయి, ఫ్లై ఓవర్స్ నిర్మించారు. వాహనాలు పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఆశించినంత మేరకు రోడ్లు మాత్రం విస్తరించలేదని పేర్కొన్నారు. నాయకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని సీవీ ఆనంద్ కోరారు. ఆపరేషన్ రోప్లో స్థానిక ఎమ్మెల్యే రాలేదన్నారు.
నగరంలో ఫుట్ పాత్లు చాలా వరకు ఆక్రమణలు గురయ్యాయని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వాళ్లు, పేదవాళ్లు.. మేము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఆక్రమణలు తొలగించాలంటే కొంత మంది అడ్డు పడుతున్నారు.. జీహెచ్ఎంసీ నుండి అనుమతులు లేకుండా ఫుట్పాత్లు ఆక్రమిస్తున్నారు.. ఇదంతా హైదరాబాద్ సిటీలో మాఫియాలా తయారయిందని తెలిపారు. ఆపరేషన్ రోప్లో భాగంగా అనేక అంశాలను పరిశీలించామని సీపీ అన్నారు. మరోవైపు.. వీఐపీ మూమెంట్ పెద్ద సమస్యగా మారింది.. సీఎం, గవర్నర్, హైకోర్టు చీఫ్ జస్టిస్కు మాత్రమే గ్రీన్ ఛానల్ ఉంటుంది.. తనకు గ్రీన్ ఛానల్ వద్దని సీఎం కోరారు కానీ.. భద్రత దృష్ట్యా గ్రీన్ ఛానల్ పాటించాల్సి ఉంటుందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?