Operation Rope: ట్రాఫిక్కు చెక్ పెట్టేలా ‘ఆపరేషన్ రోప్ వే’.. యాక్షన్లోకి పోలీసులు
- ఫుట్పాత్ పై ఆక్రమణలు తొలగింపు
- ఫిల్మ్నగర్ నుంచి టోలిచౌకి మెజిస్టిక్ గార్డెన్ వరకు ఆపరేషన్ రోప్ వే
- స్వయంగా ఆపరేషన్లో పాల్గొన్న సీపీ సీవీ ఆనంద్
- ట్రాఫిక్ ఇబ్బందులపై హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్ రోప్ వే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భాగ్యనగరంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సర్కార్ ఆదేశించింది. ఈ క్రమంలో.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. ఆపరేషన్ రోప్లో భాగంగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించనున్నారు పోలీసులు. ఫిల్మ్ నగర్ నుంచి టోలిచౌకి మెజెస్టిక్ గార్డెన్స్ వరకు రెండు క్యారేజ్వేలలో ఆపరేషన్ రోప్ను చేపట్టారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు, అధికారులతో కలిసి ఆపరేషన్ రోప్లో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. రోడ్డుకు అడ్డంగా ఫుట్పాత్లపై నిర్మాణాలు, షాపులను తొలగించారు. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి త్వరలో ఆపరేషన్ రోప్ నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు.
Ola Electric: ఓలా నుంచి గిగ్, ఎస్1 జెడ్ స్కూటర్లు విడుదల.. వీటిల్లో స్పెషల్ ఏంటంటే..?
Also Read
- Iran-US: అమెరికాకు బిగ్ షాక్.. శాంతి చర్చల వేళ ఇరాన్ ఝలక్.. ఉద్రిక్తతలు తప్పవా?
- Tamil Nadu: అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరిక
- Venkatesh Iyer: సడన్గా వెంకటేశ్ అయ్యర్కు హైప్.. తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో కోహ్లీతో ఓపెనర్గా రంగంలోకి..
- Chandrababu: ప్రపంచానికే డేటా హబ్గా విశాఖ తయారవుతోంది
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో అతి కీలకమైన డిపార్ట్మెంట్ ట్రాఫిక్.. ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించకపోతే నగరవాసులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని సీపీ తెలిపారు. హైదరాబాద్ సిటీలో వాహనాలు సంఖ్య 85 లక్షలకు చేరుకుంది.. రోడ్లు విస్తరించాయి, ఫ్లై ఓవర్స్ నిర్మించారు. వాహనాలు పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఆశించినంత మేరకు రోడ్లు మాత్రం విస్తరించలేదని పేర్కొన్నారు. నాయకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని సీవీ ఆనంద్ కోరారు. ఆపరేషన్ రోప్లో స్థానిక ఎమ్మెల్యే రాలేదన్నారు.
నగరంలో ఫుట్ పాత్లు చాలా వరకు ఆక్రమణలు గురయ్యాయని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వాళ్లు, పేదవాళ్లు.. మేము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఆక్రమణలు తొలగించాలంటే కొంత మంది అడ్డు పడుతున్నారు.. జీహెచ్ఎంసీ నుండి అనుమతులు లేకుండా ఫుట్పాత్లు ఆక్రమిస్తున్నారు.. ఇదంతా హైదరాబాద్ సిటీలో మాఫియాలా తయారయిందని తెలిపారు. ఆపరేషన్ రోప్లో భాగంగా అనేక అంశాలను పరిశీలించామని సీపీ అన్నారు. మరోవైపు.. వీఐపీ మూమెంట్ పెద్ద సమస్యగా మారింది.. సీఎం, గవర్నర్, హైకోర్టు చీఫ్ జస్టిస్కు మాత్రమే గ్రీన్ ఛానల్ ఉంటుంది.. తనకు గ్రీన్ ఛానల్ వద్దని సీఎం కోరారు కానీ.. భద్రత దృష్ట్యా గ్రీన్ ఛానల్ పాటించాల్సి ఉంటుందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
తాజావార్తలు
-
Tollywood : మెగాస్టార్ చిరంజీవితో ముగిసిన ఎగ్జిబిటర్ల సమావేశం.. గిల్డ్ నిర్మాతల ప్రతినిధులకు పిలుపు
-
CM Revanth Reddy: డిమార్ట్, బిగ్ బాజార్ల కంటే మిన్నగా ‘మహిళా శక్తి’.. 2034 నాటికి కోటి మంది కోటీశ్వరులు
-
Iran-US: అమెరికాకు బిగ్ షాక్.. శాంతి చర్చల వేళ ఇరాన్ ఝలక్.. ఉద్రిక్తతలు తప్పవా?
-
Ram Charan: శివన్నతో యాక్ట్ చేయడం నా జన్మ ధన్యం.. రెండూన్నరేళ్ల కష్టానికి ఫలితం ‘పెద్ది’ : రామ్ చరణ్
-
Tollywood : నందమూరి బాలకృష్ణకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అభినందనలు
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?