Online Food Delivery: అమాంతం పెరిగిన ఆన్లైన్ ఫుడ్ బుకింగ్.. ఆ రెండే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Food Delivery: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్కి క్రమంగా ఆర్డర్ల సంఖ్య పెరుగుతుందట.. దీంతో, డెలరీ బాయ్స్ సంఖ్యను పెంచుకునే పనిలో పడిపోతున్నాయట ఫుడ్ డెలవరీ యాప్స్.. అయితే, ఉన్నట్టుండి ఇప్పుడు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బుకింగ్స్ ఎందుకు పెరుగుతున్నాయంటే.. రెండు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.. ఒకటి ఎండలు మండిపోవడం అయితే.. మరొకటి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడం కూడా అంటున్నారు.. ఏప్రిల్ ఆదిలోనే ఎండలు దంచికొడుతున్నాయి.. ముఖ్యంగా మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది.. ఎండ వేడిమి తాళలేక అంతా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇప్పటికే టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ కూడా పూర్తికావడం.. సీబీఎస్ఈ లాంటి పరీక్షలు పూర్తి చేశారు.. మరోవైపు స్కూళ్లకు ఒంటిపూట బడులు జరుగుతున్నాయి.. కానీ, మధ్యాహ్నం తర్వాత కూడా జనం బయకు వెళ్లడానికి జంకుతున్నారట..
Read Also: Yash Thakur-IPL 2024: ఐపీఎల్ 2024లో లక్నో బౌలర్ల హవా.. యశ్ ఠాకూర్ అరుదైన రికార్డు!
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
షాపింగ్మాల్స్, రెస్టారెంట్లలో పెద్దగా రద్దీ కనిపించడంలేదంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఈ సమయంలో.. ఆన్లైన్ ఆర్డర్లు క్రమంగా పెరుగుతున్నాయని.. ఫుడ్ , ఇతర నిత్యావసరాలు డెలివరీ చేసేవారు చెబుతున్నమాట.. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎండలు దంచికొడుతుంటే.. వీకెండ్లో సాయంత్రం నుంచే.. మిగతా రోజుల్లో రాత్రి ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతుండడం కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు.. నచ్చిన ఫుడ్ను మెచ్చిన రెస్టారెంట్ను ఆర్డర్ ఇవ్వడమే కాదు.. నిత్యావసరాల ఆర్డర్లు కూడా పెరిగిపోయాయి.. క్రమంగా డెలివరీ యాప్లు స్విగ్గీ, జొమాటోల వినియోగం పెరిగిపోయింది.. అయితే, ఆర్డర్లు పెరిగిపోవడంతో.. డెలివరీలో ఆలస్యమూ జరుగుతుందని.. కొన్ని ప్రముఖ హోటళ్లు ఫుడ్ అందించలేక తాత్కాలికంగా ఆన్లైన్ సర్వీసులను నిలిపివేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందట.. దీంతో.. ఒకేసారి పెద్ద సంఖ్యలో ఆర్డర్లు రావడంతో హైదరాబాద్లోని ప్రధాన సెంటర్లలోని ప్రముఖ రెస్టారెంట్ల ముందు డెలివరీ బాయ్లు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తలెత్తిందట.. తమకు సమీపంలోని రెస్టారెంట్కు ఆర్డర్ పెట్టినా.. ఆర్డర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో.. డెలివరీ చేయడానికి సమయం పడుతుందని చెబుతన్నారు..
Read Also: USA: టీనేజ్ అబ్బాయిలే ఆమె టార్గెట్.. 14 ఏళ్ల బాలికగా నటిస్తూ పాడు పని..
మరోవైపు ఐపీఎల్ సీజన్లో తమ ప్రచారం కోసం కొన్ని యాప్లు, రెస్టారెంట్లు.. ఆఫర్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి.. అది కూడా ఆన్లైన్ ఫుడ్ బుకింగ్కి మొగ్గు చూపేలా చేస్తుందట.. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి మ్యాచ్ తిలకిస్తూ ఎంజాయ్ చేస్తూ.. ఆన్లైన్లో మెచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం కూడా దీనికి కారణంగా చెబుతున్నారు.. అయితే, పెరిగిన డిమాండ్ దృష్ట్యా.. పలు సంస్థలు అదనంగా డెలివరీ బాయ్లను నియమించుకున్నా.. వారికి సిటీపై సరైన అవగాహన లేకపోవడం కూడా ఆర్డర్ డెలివరీకి ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!