Hyderabad: హైదరాబాద్లో విక్రయానికి లక్ష ఇళ్లు..గత ఐదేళ్లలో పెరిగిన ధరలు
- హైదరాబాద్లో రియల్ రంగానికి అనుకూల వాతావరణం
- స్థిరాస్తుల విక్రయాల్లో భారీ వృద్ధి
- సీఏజీఆర్ గణాంకాలను వెల్లడించిన క్రెడాయ్..సీఆర్ఈ
- లక్ష ఇళ్లు అమ్మకానికి ఉన్నట్లు తెలిపిన నివేదికలు
హైదరాబాద్లో రియల్ రంగానికి అనుకూల వాతావరణం ఉండడంతో అన్ని తరగతుల వారు నగరాన్ని స్వర్గధామంగా భావిస్తున్నారు. దీంతో ఈ మహా నగరం స్థిరాస్తుల విక్రయాల్లో దూసుకుపోతోంది. ఇప్పుడు ఈ విశ్వనగరం ఆకాశహర్మ్యాలతో నగరం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. భారీగా రిజిస్ట్రేషన్లు నమోదవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇళ్ల విక్రయాల్లో 29 శాతం వార్షిక వృద్ధి నమోదైంది.
READ MORE: IAS officers Transferred: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. ఈ సారి ఎంతమందంటే..
Also Read
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
- Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
2019 నుంచి 2024 వరకు సీఏజీఆర్ గణాంకాలను క్రెడాయ్ హైదరాబాద్, సీఆర్ఈ మ్యాట్రిక్స్ రూపొందించిన నివేదికలో ఈ విషయాన్ని తెలిపింది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పటి మార్కెట్ పరిస్థితి భారీగా పుంజుకుంది. 2019 ప్రథమార్ధంతో పోలిస్తే 2024లో విక్రయాల్లో 148 శాతం వృద్ధి నమోదైంది. రూ.5 కోట్ల కంటే ఎక్కువ విలువ కల్గిన స్థిరాస్తుల విక్రయాల్లో ఏకంగా 760 శాతం వృద్ధి సాధించింది. అమ్మకానికి లక్షకుపైగా ఇళ్లు ఉన్నాయని నివేదిక తెలిపింది. నిర్మాణ రంగంలో ఐదేళ్లలో చాలా మార్పులు వచ్చాయి. ఐదేళ్ల క్రితం విక్రయించిన ఇళ్ల విలువ రూ.34,044 కోట్లు ఉంటే.. గతేడాది రూ.1,15,759 కోట్లకు చేరింది.
READ MORE:Children’s Memory: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే అద్భుత చిట్కాలు..
2019 నుంచి 2024 వరకు అమ్మకాల జాబితా….
2019లో 30,316 ఇళ్లను విక్రయించారు. వాటి విలువ రూ.34,044 కోట్లు.
2020లో కొవిడ్ కష్టకాలంలో విక్రయాలు తగ్గాయి. 29,611 మాత్రమే విక్రయించారు. విలువ రూ.33,084 కోట్లుగా లెక్కకట్టారు.
2021లో మార్కెట్ పుంజుకుంది. అమ్మకాలు 50,884కి పెరిగాయి. రూ.58,818కు వీటి విలువ.
2022లో 67,276 ఇళ్ల కొనుగోళ్లు జరిగాయి. రూ.92,359 ఎగబాకింది. ఈఏడాది ధరలు భారీగా పెరిగాయి.
2023లో స్థిరాస్తుల విక్రయాలు విలువ తొలిసారి లక్ష కోట్లను దాటింది. రూ.1,15,759గా విలువ కట్టారు. 74,991 యూనిట్లు అమ్మారు.
2024: ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే 38,660 యూనిట్లు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ. 58,841 కోట్లుగా క్రెడాయ్ పేర్కొంది.
READ MORE:Rashmika Mandanna: వయనాడ్ బాధితులకు రష్మిక సాయంపై ట్రోలింగ్?
కాగా..గత అయిదేళ్లుగా హైదరాబాద్ మహానగరంలో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. దీంతో స్థిరాస్తుల ప్రాథమిక విక్రయాల విలువ క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2019లో వాటి విలువ రూ.34,044 కోట్లు ఉంటే..ఈ ఏడాది ఆరు నెలల్లోనే రూ. 58,841 కోట్లు క్రాస్ అయ్యిందని క్రెడాయ్ తన నివేదికలో పేర్కొంది. ఇళ్ల అమ్మకాలు కూడా పెరిగాయి. ఇదిలా ఉండగా.. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే విషయంలో బిల్డర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సిటీలో అమ్ముడుపోని ఇళ్ల యూనిట్లు 1,03,316 ఉన్నాయి.దీంతో కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలపై బిల్డర్లు వెనక్కి తగ్గారు.
తాజావార్తలు
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
-
Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
-
Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!