Meerut: ఒక అమ్మాయి, నలుగురు స్నేహితులు.. మూడు హత్యలు.. మళ్లీ వెలుగులోకి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారు నలుగురూ మంచి స్నేహితులు. వారి మధ్య స్నేహం ఎలా ఉంటుందంటే.. ఒకరినొకరు చూసుకోకుండా, మాట్లాడకుండా ఉండలేరు. అయితే ఆ స్నేహితుల్లో ఇద్దరి స్నేహితుల కళ్లు ఒక్క అమ్మాయిపైనే పడ్డాయి. ఇద్దరూ ఆమెను ప్రేమించారు. అంతలోనే ఆ అమ్మాయిని ఇద్దరు ప్రేమిస్తున్నారని తెలిసింది. దీంతో ఇద్దరూ ఒకరికొకరు శత్రువులుగా మారారు. అయితే కొన్ని రోజుల తర్వాత.. నలుగురు స్నేహితులు కలిసి మద్యం సేవిస్తున్నారు. మత్తులో ఉండగా.. ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఒకరికొకరు ఆ అమ్మాయి నాదంటే నాది అని గొడవ పెట్టుకున్నారు. అయితే ఆ గొడవ పెద్దదిగా కావడంతో అమ్మాయిని ప్రేమించే వారిలో ఒకరు.. తన తన స్నేహితులకు ఫోన్ చేసి రమ్మని ముగ్గురు స్నేహితులను హత్య చేయించాడు.
Project K: ప్రాజెక్ట్ కె.. రిలీజ్ డేట్ తెలిసిపోయిందోచ్.. ?
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
నిందితుడు తన ముగ్గురు స్నేహితుల మృతదేహాలను బాగ్పత్లోని హిండన్ ఒడ్డున పాతిపెట్టేందుకు ప్రయత్నించగా.. అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ట్రిపుల్ మర్డర్ 2008లో జరగగా.. ఇంకా ఈ కేసు కోర్టులోనే పెండింగ్లో ఉంది. మరోవైపు ప్రధాన నిందితుడు హాజీ ఇజ్లాల్కు ఇటీవల పెరోల్ రావడంతో.. 15 ఏళ్ల తర్వాత మరోసారి ఈ ఘటన వార్తల్లో నిలిచింది. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ముఖ్యమంత్రి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాన నిందితుడు ఇజ్లాల్ను విచారించగా మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మీరట్ కాలేజీలో చదువుతున్న షీబా సిరోహి అనే విద్యార్థినితో ఇజ్లాల్ ఏకపక్షంగా ప్రేమలో ఉన్నాడని పోలీసులకు తెలిపాడు. అదే సమయంలో అతని స్నేహితుడు సునీల్ ధాకా కూడా అతన్ని ఇష్టపడటం ప్రారంభించాడని తెలిపాడు.
Pawan Kalyan: నన్ను అరెస్ట్ చేసుకోండి.. చిత్రవధ చేసుకోండి.. రెడీ..
అప్పట్లో ఈ మర్డర్ మిస్టరీపై మీరట్ నుండి ఢిల్లీ వరకు వందలాది మంది విద్యార్థులు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అంతేకాకుండా వ్యాపారులు కూడా తమ సంస్థలను మూసివేసి శాంతిభద్రతలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అయితే అప్పటి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని మీరట్ కోర్టుకు బదిలీ చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై మీరట్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే నిందితుడు ఇజ్లాల్ ఇటీవలే పెరోల్పై విడుదలయ్యాడు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!