Bhatti Vikramarka: పీవీ నరసింహారావుకి భారత రత్న ప్రకటించడంపై మండలిలో తీర్మానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటించడం పట్ల అభినందిస్తూ తెలంగాణ శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ బిడ్డ, అఖిలభారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధానికి కేంద్రం భారతరత్న ప్రకటించడంతో ఈరోజు తెలంగాణ గుండె ఉప్పొంగింది అని అన్నారు.
Mayawati: కాన్షీరామ్కు భారతరత్న ప్రకటించాలి
Also Read
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్థలు పీవీ తీసుకొచ్చారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా భూసంస్కరణలు అమలు కాగా.. వాటిని అమలు చేసిన గొప్ప సామ్యవాది, ప్రగతి శీలుడు పీవీ అని పొగిడారు. దేశంలో మొదటిసారి ప్రారంభించిన హ్యూమన్ రిసోర్స్ మంత్రిగా ఆయన పెను మార్పులు తీసుకొచ్చారని భట్టి పేర్కొన్నారు. పీవీ పార్లమెంటు సభ్యుడు కాకపోయిన ఈ దేశాన్ని పాలించే అవకాశాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆయనకు కల్పించిందని అందుకు జాతీయ కాంగ్రెస్ కు కృతజ్ఞతలు తెలిపారు.
CM YS Jagan Meet PM Modi: ప్రధాని మోడీతో సీఎం జగన్ చర్చించిన అంశాలు ఇవే..
బంగారం తాకట్టు పెట్టి అతలాకుతలంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మహనీయుడు, సరళీకరణ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించారని భట్టి విక్రమార్క అన్నారు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను పీవీ నరసింహారావు ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు. పీవీ నరసింహారావుతో పాటు ఎల్కే అద్వానీ, ఎమ్మెస్ స్వామినాథన్, కర్పూర సింగ్ ఠాకూర్, తదితరులకు భారతరత్న ప్రకటించడం గర్వించదగిన విషయం అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
-
CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
-
KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
-
MS Dhoni: బిగ్ అప్డేట్.. సన్రైజర్స్తో మ్యాచ్కి ధోనీ ఎంట్రీ..
-
Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..