OLA: మహిళతో ఓలా ఆటో డ్రైవర్ దురుసు ప్రవర్తన..ఎక్స్ ఖాతాలో పంచుకున్న బాధితురాలు
- కంపెనీ నిర్ధారించిన ధర కంటే అధిక మొత్తం డిమాండ్ చేసిన ఓలా ఆటో డ్రైవర్
- ఇవ్వనని తెలిపిన మహిళ
- బాధితురాలిపై దుర్భాషలాడుతూ.. విరుచుకుపడ్డ డ్రైవర్
- ఘటనపై స్పందించని ఓలా కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పట్టణాల్లో ప్రయాణం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే మనతో సొంత వాహనమే ఉండాల్సిన అవసరం లేదు. ప్రముఖ కంపెనీలకు చెందిన కొన్ని క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. వాటి సాయంతో వెళ్లాలను కున్న గమ్య స్థానాలకు చేరుకోవచ్చు. కానీ కొంత మంది క్యాబ్ డ్రైవర్ల దురుసు ప్రవర్తనలు ప్రయాణికులకు చేదు అనుభవాల్ని మిగిలిస్తున్నాయి. తాజాగా బెంగళూరులో ఓ మహిళ ఓలా ఆటో డ్రైవర్ తో తనకు జరిగిన వాగ్వాదం గురించి తెలిపారు. బెంగళూరుకు చెందిన తనీషా మాల్యా ఓలా ఆటో డ్రైవర్తో బాధకరమైన అనుభవాన్ని ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఛార్జీల విషయంలో విభేదాలు రావడంతో డ్రైవర్ నుంచి వేధింపులు, దుర్భాషలాడినట్లు ఆమె పేర్కొన్నారు.
READ MORE: Urban Naxalism Bill: మహారాష్ట్ర అసెంబ్లీ ముందుకు ‘అర్బన్ నక్సలిజం’ బిల్లు..
Also Read
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
“ఈరోజు బెంగుళూరులో ఓలా క్యాబ్ డ్రైవర్ తో నాకు చాలా బాధాకరమైన సంఘటన చోటుచేసుకుంది. నేను ఓలా ఆటోను బుక్ చేసాను. అది -25 కి.మీకి గానూ రూ. 347-356 చూపింది. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత.. ఆటో డ్రైవర్ తనకు కనీసం రూ. 470 చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఎందుకంటే అతను 45 కిమీ కంటే ఎక్కువ డ్రైవ్ చేశానని చెప్పాడు. ఇరువురి ఫోన్లలో రూ.356 చెల్లించాలని స్పష్టంగా చూపిస్తోంది. తాను అడిగిన మొత్తం ఇవ్వాలని అతడు నాపై అరవడం ప్రారంభించాడు. అదనపు మొత్తాన్ని చెల్లించేందుకు నేను నిరాకరించడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. డ్రైవర్ వాహనం నుంచి కిందకు దిగాడు. దూకుడుగా మాట్లాడాడు. రూ. 470 చెల్లించకపోతే ఎక్కడి నుంచి తీసుకువచ్చాడో అక్కడే వదిలేస్తానని బెదిరించాడు. అయినా నేను పట్టించుకోకుండా రూ. 356 చెల్లించి అపార్టుమెంట్ గేట్ లోపిలికి ప్రవేశించేందుకు యత్నించాను. ఈ క్రమంలో డ్రైవర్ దుర్భాషలాడుతూ.. దురుసుగా ప్రవర్తించాడు. కన్నడలో తిట్టడం మొదలు పెట్టాడు.” తనీషా మాల్యా ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
READ MORE:Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అవకాశమే లేదు.. స్పష్టం చేసిన కేంద్ర మంత్రి
ఓలా నుంచి తనకు ఎలాంటి మద్దతు లభించలేదని, కస్టమర్ కేర్తో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని ఆమె తెలిపారు. మీటర్ ప్యాటర్న్ల ఆధారంగా ఓలా కొత్త ఛార్జీల విధానాన్ని అమలు చేయడమే ఛార్జీల వ్యత్యాసానికి కారణమని మాల్యా గుర్తించారు. ఇతర ప్రయాణీకులకు, ముఖ్యంగా కన్నడ తెలియని లేదా ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదంతా 10 నిమిషాల వ్యవధిలో జరిగిందని.. తనకు కన్నడలో మాట్లాడటం వచ్చు కాబట్టి వాదించినట్లు ఆమె తెలిపారు. డ్రాప్ లోకేషన్ తన అపార్టు మెంట్ కాబట్టి తన తండ్రి సహాయం చేసేందుకు వస్తారని.. తెలియని ప్రాంతంలో డ్రాప్ ఉన్న మహిళల రక్షణకు రక్ష పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరు పోలీసులు స్పందించారు. తమ నిర్దిష్ట ప్రాంతం వివరాలు మరియు నంబరు ఇవ్వాలని ఆమెను కోరారు.
తాజావార్తలు
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!