OLA: మహిళతో ఓలా ఆటో డ్రైవర్ దురుసు ప్రవర్తన..ఎక్స్ ఖాతాలో పంచుకున్న బాధితురాలు
- కంపెనీ నిర్ధారించిన ధర కంటే అధిక మొత్తం డిమాండ్ చేసిన ఓలా ఆటో డ్రైవర్
- ఇవ్వనని తెలిపిన మహిళ
- బాధితురాలిపై దుర్భాషలాడుతూ.. విరుచుకుపడ్డ డ్రైవర్
- ఘటనపై స్పందించని ఓలా కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పట్టణాల్లో ప్రయాణం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే మనతో సొంత వాహనమే ఉండాల్సిన అవసరం లేదు. ప్రముఖ కంపెనీలకు చెందిన కొన్ని క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. వాటి సాయంతో వెళ్లాలను కున్న గమ్య స్థానాలకు చేరుకోవచ్చు. కానీ కొంత మంది క్యాబ్ డ్రైవర్ల దురుసు ప్రవర్తనలు ప్రయాణికులకు చేదు అనుభవాల్ని మిగిలిస్తున్నాయి. తాజాగా బెంగళూరులో ఓ మహిళ ఓలా ఆటో డ్రైవర్ తో తనకు జరిగిన వాగ్వాదం గురించి తెలిపారు. బెంగళూరుకు చెందిన తనీషా మాల్యా ఓలా ఆటో డ్రైవర్తో బాధకరమైన అనుభవాన్ని ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఛార్జీల విషయంలో విభేదాలు రావడంతో డ్రైవర్ నుంచి వేధింపులు, దుర్భాషలాడినట్లు ఆమె పేర్కొన్నారు.
READ MORE: Urban Naxalism Bill: మహారాష్ట్ర అసెంబ్లీ ముందుకు ‘అర్బన్ నక్సలిజం’ బిల్లు..
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
“ఈరోజు బెంగుళూరులో ఓలా క్యాబ్ డ్రైవర్ తో నాకు చాలా బాధాకరమైన సంఘటన చోటుచేసుకుంది. నేను ఓలా ఆటోను బుక్ చేసాను. అది -25 కి.మీకి గానూ రూ. 347-356 చూపింది. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత.. ఆటో డ్రైవర్ తనకు కనీసం రూ. 470 చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఎందుకంటే అతను 45 కిమీ కంటే ఎక్కువ డ్రైవ్ చేశానని చెప్పాడు. ఇరువురి ఫోన్లలో రూ.356 చెల్లించాలని స్పష్టంగా చూపిస్తోంది. తాను అడిగిన మొత్తం ఇవ్వాలని అతడు నాపై అరవడం ప్రారంభించాడు. అదనపు మొత్తాన్ని చెల్లించేందుకు నేను నిరాకరించడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. డ్రైవర్ వాహనం నుంచి కిందకు దిగాడు. దూకుడుగా మాట్లాడాడు. రూ. 470 చెల్లించకపోతే ఎక్కడి నుంచి తీసుకువచ్చాడో అక్కడే వదిలేస్తానని బెదిరించాడు. అయినా నేను పట్టించుకోకుండా రూ. 356 చెల్లించి అపార్టుమెంట్ గేట్ లోపిలికి ప్రవేశించేందుకు యత్నించాను. ఈ క్రమంలో డ్రైవర్ దుర్భాషలాడుతూ.. దురుసుగా ప్రవర్తించాడు. కన్నడలో తిట్టడం మొదలు పెట్టాడు.” తనీషా మాల్యా ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
READ MORE:Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అవకాశమే లేదు.. స్పష్టం చేసిన కేంద్ర మంత్రి
ఓలా నుంచి తనకు ఎలాంటి మద్దతు లభించలేదని, కస్టమర్ కేర్తో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని ఆమె తెలిపారు. మీటర్ ప్యాటర్న్ల ఆధారంగా ఓలా కొత్త ఛార్జీల విధానాన్ని అమలు చేయడమే ఛార్జీల వ్యత్యాసానికి కారణమని మాల్యా గుర్తించారు. ఇతర ప్రయాణీకులకు, ముఖ్యంగా కన్నడ తెలియని లేదా ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదంతా 10 నిమిషాల వ్యవధిలో జరిగిందని.. తనకు కన్నడలో మాట్లాడటం వచ్చు కాబట్టి వాదించినట్లు ఆమె తెలిపారు. డ్రాప్ లోకేషన్ తన అపార్టు మెంట్ కాబట్టి తన తండ్రి సహాయం చేసేందుకు వస్తారని.. తెలియని ప్రాంతంలో డ్రాప్ ఉన్న మహిళల రక్షణకు రక్ష పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరు పోలీసులు స్పందించారు. తమ నిర్దిష్ట ప్రాంతం వివరాలు మరియు నంబరు ఇవ్వాలని ఆమెను కోరారు.
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!