Rythu Runa Mafi: రూ. 2లక్షల రుణమాఫీపై బిగ్ అలర్ట్.. కేవలం వారికి మాత్రమే వర్తింపు..!
- రూ. 2లక్షల రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు..
- ఆదాయ పన్ను.. ఉద్యోగులు.. ప్రజాప్రతినిధులకు రుణమాఫీ కట్..
- మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించాకే తుది నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Runa Mafi: ఆగస్టు 15వ తేదీలోపు రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ అమలుకు రేవంత్ సర్కార్ విధివిధానాలపై కసరత్తు కొనసాగిస్తుంది. అర్హులైన వారికే రుణమాఫీ వర్తింపజేసేందుకు అధికారులు వివిధ ప్రతిపాదనలను అందిస్తున్నారు. పాస్బుక్లు, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని తాజాగా వారు తెలంగాణ ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయ పన్ను చెల్లించే వారు, ఉద్యోగులకు దీని నుంచి మినహాయించాలని మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. పంట రుణాల మాఫీపై ఈ వారంలో మరోసారి భేటీ కావాలని సర్కార్ చూస్తుంది. రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పించాలని ఇప్పటికే వ్యవసాయాధికారులకు ప్రభుత్వం తెలిపింది. మరో రెండు, మూడు రోజుల్లో ఈ జాబితా అధికారులకు చేరే ఛాన్స్ ఉంది.
Read Also: Father Killed Daughter : రూ.600కోసం కన్న కూతురిని గొంతుకోసి దారుణంగా హత్య చేసిన తండ్రి
Also Read
కాగా, రైతుబంధు పథకం కింద రాష్ట్రంలో 66 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా.. రూ.2 లక్షల లోపు రుణాలు పొందినవారు దాదాపు ఇంత మందే ఉంటారని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. రైతుబంధు లబ్ధిదారుల్లో దాదాపు ఆరు లక్షల మందికి పట్టాదారు పాస్బుక్లు లేవు.. వాటిని ప్రామాణికంగా తీసుకుంటే రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 60 లక్షలకు తగ్గుతుందని అంటున్నారు. మరోవైపు కుటుంబంలోని ఇద్దరు, ముగ్గురికి రైతుబంధు వస్తోంది.. వారందరికీ రేషన్ కార్డుల్లేవు.. కుటుంబ పెద్దకు మాత్రమే ఉంది.. రేషన్కార్డు నిబంధన పెడితే కుటుంబంలో రైతుకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని తద్వారా మరో 18 లక్షల మంది తగ్గే ఛాన్స్ అవకాశం ఉందని అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇలా పాస్బుక్, రేషన్కార్డు, ఆదాయపన్ను చెల్లింపుదారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల తొలగింపు నిబంధనలతో కేవలం 40 లక్షల మంది వరకు రుణమాఫీ పథకం వర్తిస్తుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36 లక్షల మందికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులు అందుతున్నాయి.. రుణమాఫీ కోసం ఈ పథకం విధివిధానాల మీదా చర్చ కొనసాగుతుంది.
Read Also: Pushpa 2 : పుష్ప 2 షూటింగ్ ఇంకా ఎన్ని రోజులు పడుతుందంటే..?
ఇక, కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తేదీని పరిగణనలోకి తీసుకొని అంతకు సంవత్సరం ముందు నుంచి తీసుకున్న రుణాలనే మాఫీ చేయాలని కొందరు అధికారులు తెలిపారు. దీనికి రేవంత్ ప్రభుత్వం విముఖత చూపింది.. 2018 డిసెంబర్ 12 నుంచి తీసుకున్న పంట రుణాలు, రెన్యువల్ అయిన వాటికి రుణమాఫీ అమలు చేయాలని చూస్తుంది. దీనికి అనుగుణంగా రుణగ్రహీతల వివరాలను సేకరించాలని పేర్కొనింది. అలాగే, రుణమాఫీకి సంబంధించి పలు ప్రతిపాదనలు వచ్చినప్పటికి.. దీనిపై మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించాకే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రుణమాఫీ అమలు చేసే క్రమంలో గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!