Father Killed Daughter : రూ.600కోసం కన్న కూతురిని గొంతుకోసి దారుణంగా హత్య చేసిన తండ్రి
- కన్న కూతురిని దారుణంగా చంపిన కసాయి తండ్రి
- రూ.600కోసం గొంతు కోసి అతి కిరాతకంగా.. భర్త పనికి ప్రేక్షకురాలిగా మిగిలిపోయిన తల్లి
- నేరస్తుడి పై గతంలో 16కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Father Killed Daughter : తల్లిదండ్రుల ప్రేమను ఈ ప్రపంచంలో దేనితోనూ పోల్చలేరు, ఎన్ని డబ్బులు పెట్టినా కొనలేరు. ఈ సంబంధం అన్ని ఇతర బంధాల కంటే మించి ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఏదైనా చేయగలరు. తల్లిదండ్రుల ప్రేమ ముందు సంపద, కీర్తి అన్నీ దిగదుడుపే. అయితే ఈ బంధానికి మచ్చ తెచ్చే ఉదంతం యూపీలోని షాజహాన్పూర్ నుంచి వెలుగులోకి వచ్చింది. షాజహాన్పూర్లో ఒక తండ్రి తన కుమార్తెను అతి కిరాతకంగా హత్య చేశాడు. మొత్తం సంఘటనలో తల్లి మూగ ప్రేక్షకురాలిగా మిగిలిపోయింది. కూతురు చేసిన నేరం ఏంటంటే… తన తండ్రికి రూ.600 ఇవ్వలేదు. అవును… కూతురిని తండ్రి రూ. 600 అడిగాడు, కూతురు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన తండ్రి కూతురిని హత్య చేశాడు. హత్య ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు నిందితుల తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు.
చదవండి:Nani : ఆ డైరెక్టర్ తో నాని సినిమా క్యాన్సిల్.. ఎందుకంటే?
Also Read
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
కూతురి హత్యతో తండ్రి వృత్తిరీత్యా నేరస్తుడనే పోలీసులు తెలిపారు. అతనిపై దాదాపు 16 కేసులు నమోదయ్యాయి. నిందితుడి పేరు సంజయ్ గుప్తా అలియాస్ లడ్డు. షాజహాన్పూర్లోని భరద్వాజీ ప్రాంతంలోని ఇంటి పై అంతస్తులోని ఓ గదిలో సంజయ్ గుప్తా అలియాస్ లడ్డూ తన భార్య వందన, కుమారుడు పవన్, కుమార్తె పూర్తి, మనవరాలు జాన్వీలతో కలిసి నివసిస్తున్నారు. సంజయ్ కుమార్తె పూర్తి 2022లో బిస్రత్ నివాసి కమల్ రాజ్పుత్తో ప్రేమ వివాహం చేసుకుంది. అయితే త్వరలోనే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీని కారణంగా పూర్తి తన ఒకటిన్నర సంవత్సరాల కుమార్తెతో తన తల్లి ఇంట్లో ఉంటుంది.
చదవండి:West Bengal: బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు..
సంజయ్ కొడుకు పవన్ కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జూన్ 13న తాను కూతురు పూర్తి ఇంటి ఖర్చుల కోసం బంగారు ఉంగరాన్ని విక్రయించేందుకు వెళ్లినట్లు తల్లి వందన పోలీసులకు తెలిపింది. వచ్చిన డబ్బుతో ఇంటి సామాగ్రి కొనుక్కుని మిగిలిన డబ్బుతో ఇంటికి తిరిగి వచ్చింది. మిగిలిన రూ.600 కూతురి నుంచి తండ్రి సంజయ్ అడిగాడు. కానీ పూర్తి నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన రాత్రి భోజనం చేసి అందరూ నిద్రకు ఉపక్రమించిన సమయంలో 12.15 గంటల ప్రాంతంలో పూర్తి మెడపై కత్తితో కొట్టి హత్య చేశాడు. నిందితుడి తండ్రి నేర చరిత్రను పోలీసులు బయటకు తీయగా.. అతడిపై ఇప్పటి వరకు 16 కేసులు నమోదైనట్లు వెలుగులోకి వచ్చింది. ఇందులో అక్రమ మద్యం, అక్రమ పిస్టల్, దొంగతనం, దాడి, గూండా యాక్ట్ ఉన్నాయి. సంజయ్పై ఖేరీలో జూన్ 13 రాత్రి కూడా ఒక కేసు నమోదైంది.
తాజావార్తలు
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
-
Dal Dhokli Recipe : ఉల్లి, వెల్లుల్లి లేని ట్రెడిషనల్ గుజరాతీ ట్రెడిషనల్ వంటకం .. దీక్షలో ఉన్నప్పుడు భలే రుచిగా.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..