Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Ysrcp 11

Off The Record : వ్యూహం మార్చిన వైసీపీ.. ఇక అంతా మండలిలోనే..!

Published Date :February 26, 2025 , 10:10 pm
By Gogikar Sai Krishna
Off The Record : వ్యూహం మార్చిన వైసీపీ.. ఇక అంతా మండలిలోనే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

వైసీపీ వ్యూహం మారిందా? ఇక మీదట మేటర్‌ ఏదైనాసరే… పెద్దల సభలోనే తేల్చుకోవాలని డిసైడయ్యిందా? ఆ దిశగా ఆల్రెడీ ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ అయిందన్న ఫీలింగ్‌ పార్టీ పెద్దల్లో ఉందా? అసెంబ్లీని వదిలేసినా… తమకు బలం ఉన్న చోట అధికార పక్షాన్ని చెడుగుడు ఆడేసుకోవాలని ఫ్యాన్‌ పార్టీ ముఖ్యులు నిర్ణయించారా? ఇంతకీ వైసీపీ మారిన వ్యూహం ఏంటి? అమలు ఎలా ఉండబోతోంది? ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రస్తుతం ప్రతిపక్ష హోదా యుద్ధం నడుస్తోంది. గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైంది వైసీపీ. ఆ బలానికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని అధికార కూటమి, సభలో కూటమి పార్టీలు, తాము తప్ప వేరే ఎవరూ లేనందున మాకు హోదా కావాల్సిందేనని వైసీపీ పట్టుబడుతుండటంతో… పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోతోంది. మాటల యుద్ధం ముదిరి మేటర్‌ కోర్ట్‌దాకా వెళ్ళింది. హోదా కోసం వైసీపీ.. కోర్టుకు వెళ్ళగా… అసెంబ్లీ స్పీకర్ ఇంకా రిప్లయ్‌ ఇవ్వాల్సి ఉంది. దీంతో ఆ వ్యవహారం అక్కడే ఆగిపోయింది. ఇక తాజాగా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో.. మరోసారి ప్రతిపక్ష హోదా అంశం తెరమీదకు వచ్చింది. తొలిరోజు గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా… అసెంబ్లీకి హాజరయ్యారు వైసీపీ అధినేత జగన్, పార్టీ ఎమ్మెల్యేలు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తుండగానే… ప్రతిపక్ష హోదా ఇవ్వండి.. ప్రజల గొంతు వినిపించేందుకు అవకాశం ఇవ్వండి అంటూ నినాదాలు చేశారు వైసీపీ సభ్యులు.. ఆ తర్వాత పోడియం వద్దకు దూసుకెళ్లడం.. కాసేపు నిరసన తెలిపాక గవర్నర్‌ ప్రసంగాన్ని బాయ్‌కాట్‌ చేయడం జరిగిపోయాయి. ఇక ప్రతిపక్ష హోదా అంశం తేల్చే వరకూ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది వైసీపీ. అయితే… దాన్ని అసెంబ్లీ వరకే పరిమితం చేయాలని, తమకు బలం ఉన్న శాసనమండలిలో మాత్రం అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యిందట వైసీపీ అధినాయకత్వం.

మండలికి హాజరైన వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా గట్టిగానే రియాక్ట్‌ అయ్యారన్న అభిప్రాయం ఉంది. గవర్నర్‌తో అబద్ధాలు పలికించారని ఆరోపించిన వైసీపీ సభ్యులు.. 4 లక్షల ఉద్యోగాలిచ్చినట్టు చెప్పారని, అవెక్కడంటూ నిలదీశారు. అందుకు స్పందించిన మంత్రి లోకేష్‌… ఉద్యోగ అవకాశాలు కల్పించామనే చెప్పాంగానీ… నియమించామని చెప్పలేదన్నారు. వైసీపీ సభ్యులు వాస్తవాలు మాట్లాడాలని, వాకౌట్ చేయొద్దు.. అన్నింటిపైనా చర్చిద్దామని సవాల్‌ చేశారాయన. అయితే, గవర్నర్ ప్రసంగం తెలుగు అనువాదంలో తేడా ఉంది.. తప్పుంటే మార్చుకుంటామని చెప్పండని సూచించారు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఇక రాష్ట్రంలో పలు యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకాలపై కూడా మండలిలో వాడి వేడి చర్చ జరిగింది.గతంలో ఎప్పుడూ లేని విధంగా వీసీలపై కూడా ఒత్తిడి తెచ్చి రాజీనామాలు చేయించారంటూ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు వైసీపీ సభ్యులు. దీనిపై ఇరుపక్షాల మధ్య గట్టిగానే వాదనలు నడిచాయి. ఇలా… మొత్తంగా ఏపీ శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు వర్సెస్ మంత్రి లోకేష్‌గా మారింది వాతావరణం. ఇక పెద్దల సభలో విపక్ష నేతగా బొత్స సత్యనారాయణ పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ తమ పార్టీకి మైలేజ్ పెంచే ప్రయత్నంలో ఉన్నారట. ఇక మీదట కూడా ఇదే దూకుడు కొనసాగించాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో… బడ్జెట్ కేటాయింపుల తర్వాత మరోసారి మండలిలో మంటలు రేగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. అసెంబ్లీకి వెళ్ళకున్నా… మండలిలో యాక్టివ్‌గా ఉంటూ…ప్రభుత్వాన్ని నిలదీయాలని, కీలక అంశాలపై మీడియా సమావేశాల ద్వారా పార్టీ అధినేత జగన్ స్పందించాలని డిసైడైనట్టు చెప్పుకుంటున్నాయి వైసీపీ వర్గాలు. మరో మూడు వారాల పాటు సమావేశాలు జరిగబోతున్నందున శాసనమండలిలో ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నది వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది. మరి అందుకు అధికార పక్షం రియాక్షన్‌ ఎలా ఉంటుంది? ఎలాంటి పొలిటికల్‌ మలుపులు ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ntv
  • OTR
  • YSRCP

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions