Off The Record : హైడ్రా కూల్చివేతలతో రాజకీయ ప్రకంపనలు.. కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన బీఆర్ఎస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూసీ సుందరీకరణ రాజకీయం ఎటు పోతోంది? పొలిటికల్ వార్లో పైచేయి కోసం అధికార, ప్రతిపక్షాలు అనుసరించబోతున్న వ్యూహాలేంటి? వేస్తున్న కొత్త ఎత్తులేంటి? కాంగ్రెస్ రివర్స్ అటాక్తో ముందు డిఫెన్స్లో పడ్డట్టు కనిపించిన బీఆర్ఎస్ ఇప్పుడు వేస్తున్న కొత్త ఎత్తు ఏంటి? ఏ రూపంలో జనంలోకి వెళ్ళాలనుకుంటోంది? మూసీ సుందరీకరణ అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. హైదరాబాద్ నగరం నడి బొడ్డున పారుతున్న ఒకప్పటి మంచి నీటి నది ఇప్పుడు మురికి కూపంగా మారిపోయింది. సిటీ డ్రైనేజీ కలిసిపోయి…దుర్గంధ భరితంగా మారింది. దీన్ని మార్చే ప్రయత్నం దశాబ్దాల క్రితమే మొదలైనా… ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెక్కు అన్నట్టుగా మారిపోయి… ఎప్పటికప్పుడు పొలిటికల్ అజెండా అవుతోంది మూసీ. ఈ క్రమంలోనే మరోసారి మూసీ సుందరీకరణ నినాదం అందుకున్న రేవంత్రెడ్డి సర్కార్…. ఆ దిశగా సీరియస్గా అడుగులేస్తోంది. పరీవాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలు కొన్నిటిని కూల్చేసింది హైడ్రా. ఆ కార్యక్రమం నడుస్తున్న క్రమంలోనే తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కావాల్సినంత పొలిటికల్ కలర్ పులుముకుంటోంది వ్యవహారం. ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ ఎపిసోడ్లోకి ఎంటరై…బాధితులకు బాసటగా నిలుస్తామంటోంది. అలాగే తెలంగాణ భవన్ బాట పట్టారు కొందరు బాధితులు. ఇదే సమయంలో రివర్స్ అటాక్ మొదలుపెట్టిన కాంగ్రెస్… అసలు ఈ ప్రతిపాదనలన్నీ గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఉన్నవేనని, ఇది దానికి కొనసాగింపు తప్ప మరోది కాదని చెబుతోంది. మీరు పవర్లో ఉంటే ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే మరోలాగా మాట్లాడతారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది కాంగ్రెస్. దీంతో ముందు డిఫెన్స్లో పడ్డట్టు కనిపించిన బీఆర్ఎస్ వెంటనే తేరుకుని… అధికారపక్షం ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతోందట.
మూసీ ప్రక్షాళన కోసం తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నది వాస్తవమేనని, కానీ… అప్పుడు తీసుకున్న నిర్ణయాలేంటి? ఇప్పుడు జరుగుతున్నదేంటి అన్న విషయాలను జనంలోనే చర్చకు పెట్టాలనుకుంటున్నట్టు తెలిసింది. ఇందుకోసం ఒకటి రెండు రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తోందట ప్రతిపక్షం. తాము 16 వేల కోట్లతో మూసీ ప్రాజెక్టుని చేపట్టాలనుకున్నామని, ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు దానికి అస్సలు పొంతనే లేదన్నది బీఆర్ఎస్ వాదన. తాము మొదటి దశలో భాగంగా నాలుగు వేల కోట్లతో ఎస్టీపీల నిర్మాణం మొదలు పెట్టామంటోంది గులాబీ పార్టీ. మొత్తం 30 ఎస్టీపీలతో డ్రైనేజి వాటర్ మొత్తం శుద్ధి అవుతుందని, అవన్నీ పూర్తయితే…మూసీలోకి అస్సలు మురికి నీళ్లు వచ్చే అవకాశం లేదన్నది గులాబీ వాదన. ఓవైపు మురికి నీళ్లను ఎలా శుభ్రం చేయాలనుకున్నామో చెబుతూనే…మరోవైపు ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలనుకుంటున్నారట బీఆర్ఎస్ లీడర్స్. తాము అనుకున్న 16వేల కోట్ల ప్రాజెక్ట్ ఎక్కడ? కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న లక్షన్నర కోట్ల ప్రాజెక్ట్ ఎక్కడ అన్నది బీఆర్ఎస్ క్వశ్చన్. మూసీ ప్రక్షాళనకు అసలు అంత బడ్జెట్ అవసరమేలేదని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. నమామి గంగ ప్రాజెక్టులో భాగంగా గంగా నది పునరుజ్జీవం, సుందరీకరణ కోసం కిలోమీటర్కు 17 కోట్లు ఖర్చు చేస్తే.. ఇక్కడ మూసీ ప్రాజెక్టులో కిలోమీటర్కు 2వేల 700 కోట్లు ఎందుకని అడుగుతున్నారు ప్రతిపక్ష నేతలు. అసలు పేదలకు నష్టం జరక్కుండా మూసీని ఎలా ప్రక్షాళన చేయవచ్చో పవర్పాయింట్ ప్రజెంటేషన్ మేం వివరిస్తామన్నది గులాబీ పార్టీ పెద్దల మాట. ఒకటి రెండు రోజుల్లో మూసీ నిర్వాసితుల దగ్గరకు తాము వెళ్లాడమా, లేక వారినే తెలంగాణ భవన్కు పిలిపించి ప్రెజెంటేషన్ ఇవ్వడమా అన్నది తేలిపోతుందంటున్నాయి పార్టీ వర్గాలు. గతంలో కాళేశ్వరం దగ్గర ఇచ్చినట్లు గానే మూసీ నదిపై ప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నంలో ఉందట బీఆర్ఎస్. మూసీ వార్లోఎవరిది పైచేయి అవుతుందో చూడాలి మరి.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- Tags
- BRS
- HYDRA
- ntv
- off the record
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!