Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Hydra

Off The Record : హైడ్రా కూల్చివేతలతో రాజకీయ ప్రకంపనలు.. కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన బీఆర్ఎస్..

Published Date :October 6, 2024 , 10:50 pm
By Gogikar Sai Krishna
Off The Record : హైడ్రా కూల్చివేతలతో రాజకీయ ప్రకంపనలు.. కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన బీఆర్ఎస్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మూసీ సుందరీకరణ రాజకీయం ఎటు పోతోంది? పొలిటికల్‌ వార్‌లో పైచేయి కోసం అధికార, ప్రతిపక్షాలు అనుసరించబోతున్న వ్యూహాలేంటి? వేస్తున్న కొత్త ఎత్తులేంటి? కాంగ్రెస్‌ రివర్స్‌ అటాక్‌తో ముందు డిఫెన్స్‌లో పడ్డట్టు కనిపించిన బీఆర్‌ఎస్‌ ఇప్పుడు వేస్తున్న కొత్త ఎత్తు ఏంటి? ఏ రూపంలో జనంలోకి వెళ్ళాలనుకుంటోంది? మూసీ సుందరీకరణ అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. హైదరాబాద్ నగరం నడి బొడ్డున పారుతున్న ఒకప్పటి మంచి నీటి నది ఇప్పుడు మురికి కూపంగా మారిపోయింది. సిటీ డ్రైనేజీ కలిసిపోయి…దుర్గంధ భరితంగా మారింది. దీన్ని మార్చే ప్రయత్నం దశాబ్దాల క్రితమే మొదలైనా… ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెక్కు అన్నట్టుగా మారిపోయి… ఎప్పటికప్పుడు పొలిటికల్‌ అజెండా అవుతోంది మూసీ. ఈ క్రమంలోనే మరోసారి మూసీ సుందరీకరణ నినాదం అందుకున్న రేవంత్‌రెడ్డి సర్కార్‌…. ఆ దిశగా సీరియస్‌గా అడుగులేస్తోంది. పరీవాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలు కొన్నిటిని కూల్చేసింది హైడ్రా. ఆ కార్యక్రమం నడుస్తున్న క్రమంలోనే తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కావాల్సినంత పొలిటికల్‌ కలర్‌ పులుముకుంటోంది వ్యవహారం. ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ ఈ ఎపిసోడ్‌లోకి ఎంటరై…బాధితులకు బాసటగా నిలుస్తామంటోంది. అలాగే తెలంగాణ భవన్‌ బాట పట్టారు కొందరు బాధితులు. ఇదే సమయంలో రివర్స్‌ అటాక్‌ మొదలుపెట్టిన కాంగ్రెస్‌… అసలు ఈ ప్రతిపాదనలన్నీ గతంలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో ఉన్నవేనని, ఇది దానికి కొనసాగింపు తప్ప మరోది కాదని చెబుతోంది. మీరు పవర్‌లో ఉంటే ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే మరోలాగా మాట్లాడతారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది కాంగ్రెస్‌. దీంతో ముందు డిఫెన్స్‌లో పడ్డట్టు కనిపించిన బీఆర్‌ఎస్‌ వెంటనే తేరుకుని… అధికారపక్షం ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతోందట.

మూసీ ప్రక్షాళన కోసం తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నది వాస్తవమేనని, కానీ… అప్పుడు తీసుకున్న నిర్ణయాలేంటి? ఇప్పుడు జరుగుతున్నదేంటి అన్న విషయాలను జనంలోనే చర్చకు పెట్టాలనుకుంటున్నట్టు తెలిసింది. ఇందుకోసం ఒకటి రెండు రోజుల్లో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తోందట ప్రతిపక్షం. తాము 16 వేల కోట్లతో మూసీ ప్రాజెక్టుని చేపట్టాలనుకున్నామని, ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు దానికి అస్సలు పొంతనే లేదన్నది బీఆర్‌ఎస్‌ వాదన. తాము మొదటి దశలో భాగంగా నాలుగు వేల కోట్లతో ఎస్టీపీల నిర్మాణం మొదలు పెట్టామంటోంది గులాబీ పార్టీ. మొత్తం 30 ఎస్టీపీలతో డ్రైనేజి వాటర్ మొత్తం శుద్ధి అవుతుందని, అవన్నీ పూర్తయితే…మూసీలోకి అస్సలు మురికి నీళ్లు వచ్చే అవకాశం లేదన్నది గులాబీ వాదన. ఓవైపు మురికి నీళ్లను ఎలా శుభ్రం చేయాలనుకున్నామో చెబుతూనే…మరోవైపు ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలనుకుంటున్నారట బీఆర్ఎస్‌ లీడర్స్‌. తాము అనుకున్న 16వేల కోట్ల ప్రాజెక్ట్‌ ఎక్కడ? కాంగ్రెస్‌ ప్రభుత్వం చెబుతున్న లక్షన్నర కోట్ల ప్రాజెక్ట్‌ ఎక్కడ అన్నది బీఆర్‌ఎస్‌ క్వశ్చన్‌. మూసీ ప్రక్షాళనకు అసలు అంత బడ్జెట్‌ అవసరమేలేదని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. నమామి గంగ ప్రాజెక్టులో భాగంగా గంగా నది పునరుజ్జీవం, సుందరీకరణ కోసం కిలోమీటర్‌కు 17 కోట్లు ఖర్చు చేస్తే.. ఇక్కడ మూసీ ప్రాజెక్టులో కిలోమీటర్‌కు 2వేల 700 కోట్లు ఎందుకని అడుగుతున్నారు ప్రతిపక్ష నేతలు. అసలు పేదలకు నష్టం జరక్కుండా మూసీని ఎలా ప్రక్షాళన చేయవచ్చో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ మేం వివరిస్తామన్నది గులాబీ పార్టీ పెద్దల మాట. ఒకటి రెండు రోజుల్లో మూసీ నిర్వాసితుల దగ్గరకు తాము వెళ్లాడమా, లేక వారినే తెలంగాణ భవన్‌కు పిలిపించి ప్రెజెంటేషన్ ఇవ్వడమా అన్నది తేలిపోతుందంటున్నాయి పార్టీ వర్గాలు. గతంలో కాళేశ్వరం దగ్గర ఇచ్చినట్లు గానే మూసీ నదిపై ప్రజెంటేషన్‌ ఇచ్చే ప్రయత్నంలో ఉందట బీఆర్‌ఎస్‌. మూసీ వార్‌లోఎవరిది పైచేయి అవుతుందో చూడాలి మరి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • HYDRA
  • ntv
  • off the record

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి..

  • Vijay : సొంతూరి కోసం విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం..

  • CM Revanth: కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం..!

  • Iran–Israel War Impact: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్.. ఆ మ్యాచులు అన్ని రద్దు..!

  • Iran-US: ఇరాన్‌పై మరోసారి అమెరికా, ఇజ్రాయెల్ బాంబ్‌ల వర్షం.. రియాద్‌పై ఇరాన్ దాడి

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions