Off The Record : పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇన్నాళ్లు ఆ పదవులు చేసిన వాళ్ళు.. పెదవి విరిచారు. కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కానీ…మనకు ఏముంది అని ఫీలింగ్. కానీ ఇప్పుడు ఆ పదవి కీలకం కాబోతుంది. అందుకే ఆశావహులు కూడా భారీ పెరుగుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్లో పార్టీ పదవులు కీలకమే. అది ఏఐసీసీ నుంచి వచ్చిన నాయకులే కీలకం…అన్నట్టు ఉంటుంది. Aicc కార్యదర్శులు… ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీలకు ఉన్న పవర్ ఎవరికి ఉండదు. అందుకే పార్టీలో ఎఐసిసి నేతలకు బాగా పలుకుబడి ఉంటుంది. ఐతే ఎఐసిసి ఇటీవల తీసుకున్న నిర్ణయాలు చూస్తే డీసీసీ అధ్యక్షులను మరింత బలోపేతం చేయడం…పార్టీ తరుపున అన్ని అధికారాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇకపై డీసీసీ అధ్యక్షులే అభ్యర్ధులను ఎంపిక చేస్తారని స్పష్టం చేసింది ఎఐసిసి. సీడబ్ల్యూసీలోనూ ఇదే నిర్ణయం తీసుకుంది. ఎఐసిసి సమావేశాల్లో రాహుల్ గాంధీ…ఖర్గే ఇదే ప్రకటన చేశారు. దీంతో ఇక పార్టీ నిర్మాణంపై ఎక్కువ ఫోకస్ పెట్టబోతుంది అనే ఇండికేషన్ ఇచ్చారు.
ఐతే… కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్షుడు మన వాడు అయ్యి ఉంటే చాలు అనే వ్యవహారమే ఎక్కువ. బలమైన డీసీసీలు కూడా టికెట్లు సాధించుకోలేరు. టికెట్ల ఇప్పించకోలేరు. పని చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనే ఉండేది కాదు. నడిపించుకున్న వారిది..నడిపించుకున్నాంత అనేలా ఉండేది. ప్రస్తుతం అభ్యర్ధుల ఎంపిక…పార్టీ నిర్మాణంలో డీసీసీలే కీలకమని చెప్పడంతో ఇప్పుడు తెలంగాణలో డీసీసీ అధ్యక్షులకు డిమాండ్ పెరిగింది. తెలంగాణలో పిసిసి చీఫ్ని నియమించారు. కమిటీతో పాటు డిసిసి అధ్యక్షుల నియామకం మర్చిపోయారు. అధికారంలో ఉన్న పార్టీ కనీసం పార్టీ కమిటీలు కూడా వేసుకోలేక పోతుందా..? అనే చర్చ వరకు వెళ్ళింది. ఐతే పిసిసినే…కొత్త డీసీసీలను నియమించాల్సి ఉంది. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి టికెట్ రాని వాళ్లు ఇప్పుడు జిల్లా అధ్యక్ష రేసులోకి వస్తున్నారు. అధికార పార్టీ…దానికి తోడు వచ్చే ఎన్నికల్లో కీలక బాధ్యతలు కూడా ఇస్తుండటంతో డీసీసీలకు డిమాండ్ పెరిగింది. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో పోటీ ఎక్కువగా ఉంది. ఖమ్మం లాంటి జిల్లాలో కూడా పోటీ తీవ్రంగా పెరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో కీలకంగా ఉన్న నేతలు…తన సొంత వారికి జిల్లా అధ్యక్ష పదవి ఇప్పించుకునే పనిలో ఉన్నారు. కొత్త ఇంచార్జి వచ్చినా పార్టీలో పదవుల భర్తీ లేదు. దీనికి తోడు ఆలస్యం అయినా కొద్ది పోటీ పెరుగుతుంది.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?