Off The Record : పులివెందుల టీడీపీ ఇంచార్జికి అధిష్టానం క్లాస్ తీసుకుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వై నాట్ పులివెందుల అంటున్న టీడీపీ నాయకత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందా? ఈసారి ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో సీఎం జగన్ని ఓడించాలనుకునే పార్టీ ఎలా ఉండాలి? ఇప్పుడెలా ఉంది? అసలక్కడి నాయకత్వ తీరుపై టీడీపీ అధిష్టానం ఏమనుకుంటోంది? లెట్స్ వాచ్.
వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 అన్నది వైసీపీ నినాదానం. దానికి కౌంటర్గా వైనాట్ పులివెందుల అన్నది టీడీపీ వాయిస్. మరి ఆ దిశగా అడుగులు పడుతున్నాయా? నిజంగానే సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అంత పట్టు పెరిగిందా అంటే ఎస్ అని చెప్పలేని పరిస్థితి. పులివెందులలో పసుపు జెండా ఎగరాలంటే ప్రతి కార్యకర్త శక్తిమేర పని చేయాలంటోంది నాయకత్వం. కానీ.. అక్కడ నియోజకవర్గ ఇన్చార్జ్ బిటెక్ రవి ఆ రేంజ్లో దృష్టి పెట్టడం లేదని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయట. ఈ విషయంలో పార్టీ అధినాయకత్వం కూడా ఆయనకు క్లాస్ పీకినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
Also Read
- ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
- KTR: ప్రచార హామీలు మరిచారా.? జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రభుత్వంపై ఫైర్.!
- Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
- Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!
పులివెందులలో బూత్ లెవల్ నుంచి నాయకుల పనితీరుపై నివేదికలు తయారు చేయించుకుంది టిడిపి అధిష్టానం. ఆ మధ్య రహస్య సమావేశం పెట్టి ఎవరైతే గ్రామాల్లో మెజారిటీ తెస్తారో వారికే రేపు ప్రభుత్వం వచ్చాక పదవులు ,పనులు అంటూ ఆశ పెట్టిందట. నియోజకవర్గ ఇన్చార్జి చెబితే పదవులు రావని, పనిచేస్తేనే గుర్తింపు అని క్లారిటీ ఇచ్చేశారట. వ్యక్తిగత ఘర్షణల కేసులను కూడా కొంత మంది లీడర్స్ పార్టీ ఖాతాలో వేసేసి తామేదో తెగ పనిచేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారని, అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయని పులివెందుల నాయకులకు చెప్పాయట ఎన్టీఆర్ భవన్ వర్గాలు. గ్రూప్ లు కడితే సహించబోమని హెచ్చరించారని పార్టీ క్యాడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పులివెందుల వైసీపీ నాయకుల్లో అంసతృప్తి ఉందని, దాన్ని పసిగట్టి క్యాష్ చేసుకోవాలని క్యాడర్కు సూచించిందట నాయకత్వం. కార్యకర్తల సమావేశం అనంతరం ఇన్ఛార్జ్ బిటెక్ రవికి పార్టీ పెద్దలు స్పెషల్ క్లాస్ పీకారట. చక్రాయపేట భూ తగాదా విషయంలో బిటెక్ తీరును పార్టీ సీరియస్గా తీసుకున్నట్టు తెలిసింది. కొందరిని దగ్గరకు తీయడం, మరికొందరిని దూరం పెట్టడం లాంటివి మానుకోవాలని సూచించారట. పులివెందుల నియోజకవర్గ నాయకుల కోసం ఏర్పాటు చేసిన ఆ సమావేశంలో మొత్తం బిటెక్ రవి బంధువులు కూర్చోవడంపై పార్టీ వర్గాల్లో సీరియస్ చర్చే జరుగుతోంది.
తాజావార్తలు
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
-
Agadha Trailer: రక్తం, రహస్యాలు, దైవిక శక్తుల పోరు.. వణుకు పుట్టిస్తున్న ఎంఎస్ రాజు ‘అగధ’ ట్రైలర్!
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
-
Karnataka Cabinet Expansion 2026: కర్ణాటకలో నేడు మంత్రివర్గ విస్తరణ.. 20 మంది కొత్త మంత్రుల జాబితా విడుదల
-
KTR: ప్రచార హామీలు మరిచారా.? జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రభుత్వంపై ఫైర్.!
ట్రెండింగ్
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!