TDP, Janasena పొత్తు లెక్కలు తప్పుతున్నాయా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పురిట్లోనే పొత్తు లెక్కలు తప్పుతున్నాయా? టీడీపీ, జనసేన నాయకుల మధ్య మనస్పర్ధలు, మొహాలు మాడ్చుకోవడాలు మొదలయ్యాయా? గ్లాసు పార్టీ డిమాండ్లకు తమ్ముళ్లు బేజారవుతున్నారా? ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచే ఈ ప్రహసనం మొదలైందా? జిల్లాలోని ఆ మూడు సీట్లు మాకేనని ఢంకా భజాయించి చెబుతున్న జనసైనికులకు టీడీపీ నాయకులు కౌంటర్ సిద్ధం చేసుకుంటున్నారా? లెట్స్ వాచ్.
Also Read : Brahmanandam: ఘనంగా బ్రహ్మానందం రెండో కొడుకు నిశ్చితార్థం
Also Read
- Kerala: ‘‘మహిళలు పబ్లిక్లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
- Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
- India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
- ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు నియోజకవర్గాలపై జనసేన కన్నేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఎప్పటి నుంచో తెనాలి సీటు మాదేనని చెప్పుకొస్తున్న సేన, తాజాగా మరో రెండు కావాలంటోందట. పార్టీలో నంబర్ 2 అయిన నాదెండ్ల మనోహర్ కోసం తెనాలిలో ఇప్పటికే కర్చీఫ్ వేసి ఉంచింది. దాంతో పాటు రిజర్వుడ్ స్థానమైన ప్రత్తిపాడు, పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట సీట్లు కూడా తమకే కావాలని అడుగుతున్నారట జనసేన నాయకులు.గతంలో సత్తెనపల్లి సీటుపై ఆశలు పెట్టుకున్నా… ఇప్పుడు అక్కడ సీనియర్ నాయకుడు, ఇటీవల టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ పాగా వేశారని తెలిశాక ఆశలు వదులుకున్నారు. అందుకే ఇప్పుడు లిస్ట్లో నరసరావుపేట చేరిందట.గతంలో నరసరావుపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన జనసేన నాయకుల కదలికలు ఇటీవల పెరిగాయి. తిరిగి మేమే పోటీచేస్తామని ఆ పార్టీ నాయకులు ప్రకటించడం హాట్ టాపిక్ అయింది.
ఆయన మాటవరసకన్నారా, లేక పార్టీ జిల్లా నాయకత్వమే ఎక్కువ సీట్లు అడగాలన్న ఉద్దేశ్యంతో అలా మాట్లాడించిందా అన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు సీట్లు ఇవ్వాల్సిందేనని జనసేన నాయకులు ముందస్తు డిమాండ్లు పెట్టడంపై టీడీపీ కేడర్ గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. వాళ్ళ దెబ్బకు మా సీట్లు ఎక్కడ గల్లతవుతాయోనని కంగారుగా ఉన్నారట టీడీపీ నాయకులు. నియోజకవర్గాల్లో నాలుగేళ్ళ నుంచి కష్టపడి తిరుగుతున్నామని, ఇప్పుడు జనసేన ఏకంగా మూడు సీట్లు కావాలంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారట. పొత్తు వల్ల పార్టీకి జరిగే లాభం ఎంతో తెలియదుగానీ…మేం మాత్రం భారీగా నష్టపోతామని ఆయా నియోజకవర్గాల నాయకులు సన్నిహితుల దగ్గర చెబుతున్నట్టు తెలిసింది. టీడీపీ ఇన్ఛార్జ్లను నమ్ముకున్న కేడర్ కూడా ఈ పరిణామాలపై అసహనంగా ఉందట.
నియోజకవర్గ స్థాయిలో మాట్లాడుతున్న వారికి జనసేన నాయకులు కూడా గడుసుగానే సమాధానం చెబుతున్నట్టు తెలిసింది. తెనాలి ఇన్చార్జ్ ఆలపాటి రాజాకు ప్రత్యామ్నాయ నియోజకవర్గం ఉందనీ… గుంటూరు పశ్చిమగాని ,పెదకూరపాడు నుంచి గాని రాజా పోటీ చేయవచ్చని అంటున్నారు. అలాగే ప్రత్తిపాడుకు ఇప్పటిదాకా ఇన్చార్జి ఎవరూ లేరు కాబట్టి… ఆ సీటు మాకు ఇస్తే మీకొచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నిస్తున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి ఒక్క నరసరావుపేటలో మాత్రమే తేడా ఉంటుందని, అది కూడా సెట్ చేసుకుంటే… ఇక అన్నీ మంచి శకునములేనని అంటున్నారట జనసేన నాయకులు. మరి టీడీపీ నిజంగా గుంటూరు జిల్లాలో మూడు సీట్లు ఇస్తుందా? లేకుంటే.. జనసేన ఎలారియాక్ట్ అవుతుంది చూడాలి. కానీ…ఇక్కడ గమనించాల్సిన అంశం మాత్రం ఒకటి ఉంది. పూర్తిగా పొత్తు ప్రకటనలు రాకముందే… ఇలా ఎవరికి వారు లెక్కలేసుకుని… మనస్పర్ధలు పెంచుకుంటుంటే… అసలు సినిమా ముందుంది గనుక అప్పటికి అంతా ఎలా రియాక్ట్ అవుతారన్నది బిగ్ క్వశ్చన్.
తాజావార్తలు
-
Kerala: ‘‘మహిళలు పబ్లిక్లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!