Off The Record: దరఖాస్తులకు దూరంగా బీజేపీ కీలక నేతలు.. పోటీ చేయడం ఇష్టం లేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ బీజేపీలో దరఖాస్తు గడువు ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు భారీగా అప్లికేషన్స్ పెట్టేశారు. మిగతా వాళ్ల సంగతి ఎలా ఉన్నా.. పార్టీ పరంగా కీలకం అనుకున్న నాయకుల్లో చాలా మంది ఈ వ్యవహారానికి దూరంగా ఉన్నారు. జాతీయ పార్టీ గనుక ఎంత సీనియర్, సూపర్ లీడర్ అయినా… దరఖాస్తు చేసుకోవడం అన్నది తప్పనిసరి ప్రక్రియ. అలాంటప్పుటు కీలక నేతలు ఎందుకు దూరంగా ఉన్నారన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో వస్తున్నాయి. అంటే వాళ్ళకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేదా? లేక హై కమాండ్ నుంచి క్లియరెన్స్ లేక ఆగారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కమలం గుర్తు మీద పోటీ చేయాలని అనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలంటూ.. ఈ నెల నాలుగు నుంచి 10 వరకు సమయం ఇచ్చింది హై కమాండ్. ఈ గడువులోపు 6 వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. కొందరు రెండు నియోజకవర్గాలకు కూడా దరఖాస్తులు చేసుకున్నారు. అయితే.. కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి, కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి లాంటి నేతలు అస్సలు అప్లయ్ చేసుకోలేదు. ఈటల రాజేందర్ తరపున అనుచరుడు దరఖాస్తు ఇచ్చారు గానీ.. స్వయంగా ఆయన ఇవ్వలేదు. ఈ ముఖ్యనేతలంతా అలా ఎందుకు చేశారన్న చర్చ ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడితో సహా కీలక నాయకులు ఈ ప్రక్రియకు ఎందుకు దూరంగా ఉన్నారంటే.. రకరకాల సమాధానాలు వస్తున్నాయి. కొందరు ఎంపీలుగా ఉన్నందున పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేదాకా వేచి చూద్దామనుకుంటున్నారట.
Also Read
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
జోడు పదవులు బీజేపీ సిద్ధాంతానికి వ్యతిరేకం గనుక ఎంపీగా ఉంటూ.. అసెంబ్లీకి దరఖాస్తు చేయడం భావ్యం కాదని ఆగినట్టు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో హై కమాండ్ ఆదేశిస్తే.. పోటీ చేద్దామనుకుంటున్నట్టు తెలిసింది. మరి మిగతా వాళ్ళ సంగతేంటని ప్రశిస్తే మాత్రం సమాధానం లేదు. అయితే.. సిట్టింగ్ ఎంపీలు కాకుండా అసెంబ్లీకి దరఖాస్తు చేయని పెద్ద తలకాయల్లో ఎక్కువ మంది లోక్సభ సీట్లపై కన్నేసినట్టు తెలిసింది. అందుకే అప్పటిదాకా ఆగాలనుకుని ప్రస్తుత కార్యక్రమానికి దూరంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అప్లికేషన్స్ ఇచ్చేస్తే.. ఇక్కడే ఆగిపోతామని, అందుకే వేచి చూద్దామనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాదు, కూడదు.. గట్టిగా అసెంబ్లీ బరిలో దిగాల్సిందేనని అధిష్టానం గట్టిగా చెబితే అప్పుడు చూద్దామనుకుంటున్నారట సదరు నేతలు. మరి ఈ విషయంలో ఢిల్లీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!