Off The Record: దరఖాస్తులకు దూరంగా బీజేపీ కీలక నేతలు.. పోటీ చేయడం ఇష్టం లేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ బీజేపీలో దరఖాస్తు గడువు ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు భారీగా అప్లికేషన్స్ పెట్టేశారు. మిగతా వాళ్ల సంగతి ఎలా ఉన్నా.. పార్టీ పరంగా కీలకం అనుకున్న నాయకుల్లో చాలా మంది ఈ వ్యవహారానికి దూరంగా ఉన్నారు. జాతీయ పార్టీ గనుక ఎంత సీనియర్, సూపర్ లీడర్ అయినా… దరఖాస్తు చేసుకోవడం అన్నది తప్పనిసరి ప్రక్రియ. అలాంటప్పుటు కీలక నేతలు ఎందుకు దూరంగా ఉన్నారన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో వస్తున్నాయి. అంటే వాళ్ళకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేదా? లేక హై కమాండ్ నుంచి క్లియరెన్స్ లేక ఆగారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కమలం గుర్తు మీద పోటీ చేయాలని అనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలంటూ.. ఈ నెల నాలుగు నుంచి 10 వరకు సమయం ఇచ్చింది హై కమాండ్. ఈ గడువులోపు 6 వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. కొందరు రెండు నియోజకవర్గాలకు కూడా దరఖాస్తులు చేసుకున్నారు. అయితే.. కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి, కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి లాంటి నేతలు అస్సలు అప్లయ్ చేసుకోలేదు. ఈటల రాజేందర్ తరపున అనుచరుడు దరఖాస్తు ఇచ్చారు గానీ.. స్వయంగా ఆయన ఇవ్వలేదు. ఈ ముఖ్యనేతలంతా అలా ఎందుకు చేశారన్న చర్చ ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడితో సహా కీలక నాయకులు ఈ ప్రక్రియకు ఎందుకు దూరంగా ఉన్నారంటే.. రకరకాల సమాధానాలు వస్తున్నాయి. కొందరు ఎంపీలుగా ఉన్నందున పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేదాకా వేచి చూద్దామనుకుంటున్నారట.
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
జోడు పదవులు బీజేపీ సిద్ధాంతానికి వ్యతిరేకం గనుక ఎంపీగా ఉంటూ.. అసెంబ్లీకి దరఖాస్తు చేయడం భావ్యం కాదని ఆగినట్టు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో హై కమాండ్ ఆదేశిస్తే.. పోటీ చేద్దామనుకుంటున్నట్టు తెలిసింది. మరి మిగతా వాళ్ళ సంగతేంటని ప్రశిస్తే మాత్రం సమాధానం లేదు. అయితే.. సిట్టింగ్ ఎంపీలు కాకుండా అసెంబ్లీకి దరఖాస్తు చేయని పెద్ద తలకాయల్లో ఎక్కువ మంది లోక్సభ సీట్లపై కన్నేసినట్టు తెలిసింది. అందుకే అప్పటిదాకా ఆగాలనుకుని ప్రస్తుత కార్యక్రమానికి దూరంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అప్లికేషన్స్ ఇచ్చేస్తే.. ఇక్కడే ఆగిపోతామని, అందుకే వేచి చూద్దామనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాదు, కూడదు.. గట్టిగా అసెంబ్లీ బరిలో దిగాల్సిందేనని అధిష్టానం గట్టిగా చెబితే అప్పుడు చూద్దామనుకుంటున్నారట సదరు నేతలు. మరి ఈ విషయంలో ఢిల్లీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!