Off The Record: టీడీపీ కంచుకోటాను బద్దలు కొట్టేందుకు వైసీపీ కొత్త ప్లాన్.. ఇక రిజల్టే మిగిలింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా టెక్కలి అసెంబ్లీ సెగ్మెంట్కి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ కింజరాపు కుటుంబ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే టీడీపీ కంచుకోట ఇది. దీంతో ఈసారి ఎలాగైనా సైకిల్ జోరుకు అడ్డుకట్ట వేయాలన్న కసితో కొత్త అస్త్ర శస్త్రాలను సంధించింది వైసీపీ. అచ్చెన్నాయుడిని ఎదుర్కోవాలంటే అందుకు దీటైన అభ్యర్థి కావాలని భావించి…. దువ్వాడ శ్రీనివాస్ను బరిలో దించింది. అదే సమయంలో ఇన్నేళ్ళుగా టెక్కలి వైసీపీలో ఉన్న గ్రూప్స్ని సెట్ చేసింది అధినాయకత్వం. గత ఎన్నికల్లో 8వేల మెజార్టీతో గెలిచారు అచ్చెన్నాయుడు. ఆయనకు వరుస విజయాలు ఎలా సాధ్యమవుతున్నాయని ఎంక్వైరీ చేసిన వైసీపీ అధిష్టానానికి ఇక్కడ టీడీపీ బలంకంటే వైసీపీ బలహీనతే ప్రముఖంగా కనిపించిందట. అందుకే లోకల్ లీడర్స్ మధ్య ఉన్న అనైక్యతను గుర్తించి గ్రూప్స్ని సెట్ చేసి, దువ్వాడను బరిలో దించడంతో ఈసారి గెలుపు ఆశలు పెరుగుతున్నట్టు చెబుతున్నాయి వైసీపీ వర్గాలు.
Read Also: AP Elections 2024: స్ట్రాంగ్ రూమ్ వద్ద పార్టీ..! సీఎం సెక్యూరిటీ సిబ్బందిపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు
Also Read
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Virat Kohli: కోహ్లీ ‘స్టంప్ మైక్’ సీక్రెట్ లీక్.. పంజాబ్ను దెబ్బకొట్టిన ఆర్సీబీ వ్యూహం.. ప్లేఆఫ్స్ వేళ సరికొత్త చర్చ..
సామాజిక లెక్కల్ని కూడా సరిచేయడం ఈసారి తమకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్స్. వీటన్నిటితో పాటు ఇన్నాళ్ళు సెగ్మెంట్లోని పదిహేను గ్రామాల్లో అచ్చెన్నాయుడు రిగ్గింగ్ పాల్పడుతూ గెలుస్తున్నారని క్లారిటీకి వచ్చిందట వైసీపీ అధిష్టానం. ఈసారి ఈ ఆరోపణలున్న కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించడం, వెబ్ క్యాస్టింగ్ పెట్టించడం ద్వారా రిగ్గింగ్ను అడ్డుకోగలిగామని చెబుతున్నారు స్థానిక వైసీపీ నేతలు. ఈ లెక్కలన్నీ చూసుకుని ఈసారి మా గెలుపు ఖాయమని ధీమాగా చెబుతున్నట్టు తెలిసింది. టెక్కలి, నందిగామ మండలాల్లో తాము బలంగా ఉన్నామని, సంతబొమ్మాళి , కోటబొమ్మాళి మండలాల్లో ఓటింగ్ను ఈక్వల్ చేస్తే గెలుపు గ్యారంటీ అన్న కేలిక్యులేషన్స్తో ఈసారి పనిచేశారట వైసీపీ లీడర్స్. ప్రతి సాధారణ ఎన్నికల్లో కోట బొమ్మాళి, సంతబొమ్మాళిలోని కొన్ని గ్రామాల్లో రిగ్గింగ్ జరగడంవల్లే ఓడిపోతున్నామని చెబుతున్న వైసీపీ నేతలు ఈసారి దాన్ని అడ్డుకోగలిగామని అంటున్నారట. ఇలా… ఎవరి లెక్కలు, అంచనాలు వారికి ఉన్నా… ఈవీఎంల ఓపెన్ అయ్యాక గానీ… ఎవరి బలమేంటో, ఎవరి ఎత్తుగడలు ఎంతవరకు ఫలించాయో తెలియదు.
తాజావార్తలు
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
-
Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
-
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..