Off The Record: టీడీపీ కంచుకోటాను బద్దలు కొట్టేందుకు వైసీపీ కొత్త ప్లాన్.. ఇక రిజల్టే మిగిలింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా టెక్కలి అసెంబ్లీ సెగ్మెంట్కి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ కింజరాపు కుటుంబ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే టీడీపీ కంచుకోట ఇది. దీంతో ఈసారి ఎలాగైనా సైకిల్ జోరుకు అడ్డుకట్ట వేయాలన్న కసితో కొత్త అస్త్ర శస్త్రాలను సంధించింది వైసీపీ. అచ్చెన్నాయుడిని ఎదుర్కోవాలంటే అందుకు దీటైన అభ్యర్థి కావాలని భావించి…. దువ్వాడ శ్రీనివాస్ను బరిలో దించింది. అదే సమయంలో ఇన్నేళ్ళుగా టెక్కలి వైసీపీలో ఉన్న గ్రూప్స్ని సెట్ చేసింది అధినాయకత్వం. గత ఎన్నికల్లో 8వేల మెజార్టీతో గెలిచారు అచ్చెన్నాయుడు. ఆయనకు వరుస విజయాలు ఎలా సాధ్యమవుతున్నాయని ఎంక్వైరీ చేసిన వైసీపీ అధిష్టానానికి ఇక్కడ టీడీపీ బలంకంటే వైసీపీ బలహీనతే ప్రముఖంగా కనిపించిందట. అందుకే లోకల్ లీడర్స్ మధ్య ఉన్న అనైక్యతను గుర్తించి గ్రూప్స్ని సెట్ చేసి, దువ్వాడను బరిలో దించడంతో ఈసారి గెలుపు ఆశలు పెరుగుతున్నట్టు చెబుతున్నాయి వైసీపీ వర్గాలు.
Read Also: AP Elections 2024: స్ట్రాంగ్ రూమ్ వద్ద పార్టీ..! సీఎం సెక్యూరిటీ సిబ్బందిపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు
Also Read
- Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
సామాజిక లెక్కల్ని కూడా సరిచేయడం ఈసారి తమకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు ఫ్యాన్ పార్టీ లీడర్స్. వీటన్నిటితో పాటు ఇన్నాళ్ళు సెగ్మెంట్లోని పదిహేను గ్రామాల్లో అచ్చెన్నాయుడు రిగ్గింగ్ పాల్పడుతూ గెలుస్తున్నారని క్లారిటీకి వచ్చిందట వైసీపీ అధిష్టానం. ఈసారి ఈ ఆరోపణలున్న కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించడం, వెబ్ క్యాస్టింగ్ పెట్టించడం ద్వారా రిగ్గింగ్ను అడ్డుకోగలిగామని చెబుతున్నారు స్థానిక వైసీపీ నేతలు. ఈ లెక్కలన్నీ చూసుకుని ఈసారి మా గెలుపు ఖాయమని ధీమాగా చెబుతున్నట్టు తెలిసింది. టెక్కలి, నందిగామ మండలాల్లో తాము బలంగా ఉన్నామని, సంతబొమ్మాళి , కోటబొమ్మాళి మండలాల్లో ఓటింగ్ను ఈక్వల్ చేస్తే గెలుపు గ్యారంటీ అన్న కేలిక్యులేషన్స్తో ఈసారి పనిచేశారట వైసీపీ లీడర్స్. ప్రతి సాధారణ ఎన్నికల్లో కోట బొమ్మాళి, సంతబొమ్మాళిలోని కొన్ని గ్రామాల్లో రిగ్గింగ్ జరగడంవల్లే ఓడిపోతున్నామని చెబుతున్న వైసీపీ నేతలు ఈసారి దాన్ని అడ్డుకోగలిగామని అంటున్నారట. ఇలా… ఎవరి లెక్కలు, అంచనాలు వారికి ఉన్నా… ఈవీఎంల ఓపెన్ అయ్యాక గానీ… ఎవరి బలమేంటో, ఎవరి ఎత్తుగడలు ఎంతవరకు ఫలించాయో తెలియదు.
తాజావార్తలు
-
World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
-
Keerthy Suresh : 41 గంటల నాన్-స్టాప్ షూటింగ్లో పాల్గొన్న కీర్తిసురేష్
-
iPhone 17 Pro Max: iPhone 18 రాకముందే iPhone 17 Pro Maxపై భారీ ఆఫర్.. రూ.16 వేల వరకు ఆదా!
-
Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
-
Thani Oruvan 2: రవి మోహన్, నయనతార ‘తని ఒరువన్ 2’ ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!